Sameer Rizwi: రైటార్మ్ రైనా..ఐపీఎల్ వేలంలో సమీర్ సంచలనం
ఐపీఎల్ వేలంలో ఓ అనామక ఆటగాడిగా అడుగుపెట్టి రికార్డు ధర సొంతం చేసుకున్నాడు ఓ కుర్రాడు. రైటార్మ్ రైనాగా పేరు తెచ్చుకున్న అతను ఇప్పుడు సీఎస్కే జట్టుకు ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు.
అది 2011.. యూపీలోని మేరఠ్. సౌరాష్ట్రతో ఉత్తర్ప్రదేశ్ రంజీ మ్యాచ్. యూపీ కెప్టెన్గా రైనా ఉన్నాడు. అక్కడ ప్రాక్టీస్ సమయంలో అదే మైదానంలో ఓ చిన్న పిల్లాడి ఫీల్డింగ్ నైపుణ్యాలు రైనాను మెప్పించాయి. అప్పుడు ఆ పిల్లాడి ప్రదర్శనకు మెచ్చి రైనా తన కళ్లజోడు బహుమతిగా ఇచ్చాడు. పన్నెండేళ్ల తర్వాత.. ఐపీఎల్ (IPL) వేలంలో ఓ అనామక ఆటగాడు ఏకంగా రూ.8.40 కోట్ల ధర పలికాడు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) అతణ్ని సొంతం చేసుకుంది. అప్పుడు రైనాను మెప్పించింది.. ఇప్పుడు అనూహ్య ధర సొంతం చేసుకుంది.. సమీర్ రిజ్వీ (Sameer Rizvi). 20 ఏళ్ల ఈ ఉత్తర్ప్రదేశ్ సంచలనం రైటార్మ్ రైనాగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రైనా ఆడిన జట్టుకే ఆడే అవకాశం దక్కించుకున్నాడు.
మేనమామ శిక్షణలో..
అయిదేళ్ల వయసు నుంచి ఇప్పుడు ఐపీఎల్లో భారీ ధర దక్కించుకునేంత వరకూ సమీర్ ప్రయాణం ఒడుదొడుకుల మధ్యే సాగింది. అతని మేనమామ తంకీబ్ అక్తర్ ఒకప్పటి క్రికెటర్. కానీ ముందుకు వెళ్లలేకపోయాడు. అందుకే తన సోదరి తనయుడు సమీర్లోని నైపుణ్యాలు గుర్తించి ఆటలో తీర్చిదిద్దాడు. అయితే అందుకు సమీర్ తండ్రి హసీన్ మొదట్లో ఒప్పుకోలేదు. సమీర్ను నీలాగే ఎందుకు పనికి రాకుండా చేస్తావా? అని తంకీబ్ను ప్రశ్నించేవాడు. కానీ, తంకీబ్ పట్టు వదల్లేదు. సమీర్కు ఆటలో ఓనమాలు నేర్పడమే కాదు అద్భుత ఆటగాడిగా మార్చాడు. ఇప్పుడు వేలంలో సమీర్కు భారీ ధర దక్కడంతో తంకీబ్ చేతులు పట్టుకుని హసీన్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇంకా ఐపీఎల్లో ఆడని ఆటగాళ్లలో అత్యధిక ధర పలికిన క్రికెటర్గా సమీర్ చరిత్ర సృష్టించాడు.
ఈ కష్టాలు దాటి..
2011లో క్రికెట్లో అడుగుపెట్టిన సమీర్ భారత అండర్-19 జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 16 ఏళ్లకే రంజీలో అరంగేట్రం చేశాడు. కానీ టీనేజీలోనే మైదానం లోపల, బయటా కష్టాలు ఎదుర్కొన్నాడు. సీనియర్ జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్ జట్టు ముంబయి ఇండియన్స్ తరపున ట్రయల్స్లో పాల్గొన్నా ఫలితం దక్కలేదు. మరోవైపు తండ్రి మెదడు సంబంధిత సమస్యతో మంచం పట్టడంతో కుటుంబాన్ని పోషించాల్సిన భారం కూడా అతనిపైనే పడింది. కానీ ఈ అడ్డంకులను చూసి సమీర్ ఆగిపోలేదు. సవాళ్లను దీటుగా ఎదుర్కొనేందుకు సంకల్ప బలంతో ముందడుగు వేశాడు. సీనియర్ జట్టులో చోటు దక్కకపోతే.. జూనియర్ లెవల్లో ఆడుతూ రాణించాడు. దీంతో మళ్లీ సీనియర్ జట్టులోకి వచ్చాడు. టీ20 లీగ్లోనూ ఆడటం మొదలెట్టాడు. భారత్ తరపున అండర్-19 ప్రపంచకప్ ఆడే అవకాశం రాకపోయినా కుంగిపోలేదు. అండర్-19 ప్రపంచకప్ ఆడనంత మాత్రాన దేశానికి ఆడలేవని అనుకోవద్దని ధోని చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకుని సాగాడు.
ఆ లీగ్ మలుపు..
యూపీ సీనియర్ జట్టు తరపున ఇప్పటివరకు సమీర్ 24 మ్యాచ్లు ఆడాడు. కానీ ఈ ఏడాది యూపీ టీ20 లీగ్తో అతని పేరు ఒక్కసారిగా మార్మోగింది. ఈ లీగ్లో కాన్పూర్ సూపర్స్టార్స్ తరపున ఆడుతూ అతను సిక్సర్లతో చెలరేగాడు. ఆ జట్టు తరపున అత్యధిక సిక్సర్లు కొట్టింది అతనే. ఈ సీజన్లో రెండు సెంచరీలు సహా మొత్తం 455 పరుగులు చేయడంతో ఫ్రాంఛైజీల కన్ను అతనిపై పడింది. 10 జట్లు అతణ్ని ట్రయల్స్ కోసం పిలిచాయి. కానీ అండర్-23 టోర్నీ కారణంగా కేవలం పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ తరపున మాత్రమే ట్రయల్స్లో పాల్గొన్నాడు. అండర్-23 వన్డే టోర్నీలో జట్టును విజేతగా నిలిపాడు. మరోవైపు అండర్-16 వరకు ఓపెనర్గా ఆడిన సమీర్.. స్పిన్ను బాగా ఆడతాడు. ఈ నైపుణ్యాలతోనే అతడు మిడిలార్డర్ బ్యాటర్గా మారాడు. ఈ మార్పు అతని కెరీర్నే మార్చింది. ఇప్పుడు రాబోయే ఐపీఎల్లోనూ మందకొడిగా ఉండే చెపాక్ పిచ్పై మిడిలార్డర్లో సమీర్ కీలకమయ్యే అవకాశముంది.
‘‘నా ఆటతీరు చూసి జనాలు నన్ను రైనా అని పిలుస్తుంటారు. ఇన్నేళ్లుగా నేను పడ్డ కష్టానికి 50 శాతం ఫలితం దక్కింది. నా కంటే ముందు వేలంలో కొంతమంది ఆటగాళ్లు అమ్ముడుపోకపోవడంతో ఒత్తిడి కలిగింది. కానీ నా కోసం సీఎస్కే అంత ధర పెట్టడం ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆ జట్టు నన్నెందుకు తీసుకుందోనని ఆలోచిస్తున్నా. ఆ రోజు రాత్రి నిద్రపట్టలేదు. ఐపీఎల్ కోసం ఎలా సన్నద్ధమవ్వాలా అని ఆలోచించా. వేలంలో వచ్చిన డబ్బుతో ఏం చేయాలన్నది కుటుంబ సభ్యుల ఇష్టానికే వదిలేస్తా’’ అని సమీర్ తెలిపాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్