Sania Mirza: సానియా ఫేర్వెల్ మ్యాచ్.. ఎల్బీ స్టేడియంలో సందడి
భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా(Sania Mirza) ఫేర్వెల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే టెన్నిస్కు వీడ్కోలు పలికిన సానియా..
హైదరాబాద్: భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా(Sania Mirza) ఫేర్వెల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇప్పటికే టెన్నిస్కు వీడ్కోలు పలికిన సానియా.. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియం వేదికగా తన చివరి మ్యాచ్ ఆడుతోంది. డబుల్స్ మ్యాచ్ సానియా, బోపన్న- ఇవాన్ డోడిక్, మ్యాటెక్ సాండ్స్ జోడీ మధ్య జరుగుతోంది. సింగిల్స్లో రోహన్ బోపన్నతో సానియా తలపడనుంది. సానియా చివరి మ్యాచ్ను వీక్షించేందుకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్, క్రీడా, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. తెలంగాణ మంత్రి కేటీఆర్తో పాటు మాజీ క్రికెటర్లు యువరాజ్సింగ్, అజారుద్దీన్ తదితరులు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో స్టేడియం వద్ద సందడి వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ సానియా ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చిందని చెప్పారు. క్రీడా వ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరముందని ఆయన ఆభిప్రాయపడ్డారుర. మహిళా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు.
మ్యాచ్ అనంతరం సాయంత్రం ఓ ప్రైవేట్ హోటల్లో రెడ్ కార్పెట్ ఈవెంట్, గాలా డిన్నర్ జరగనుంది. సాయంత్రం గాలా డిన్నర్కు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, సినీ, క్రీడా ప్రముఖులు మహేశ్బాబు, ఏఆర్ రెహమాన్, సురేష్రైనా, జహీర్ఖాన్, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు హాజరుకానున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి