Sania Mirza: మహిళల విజయానికి విలువకట్టేది ఇలాగేనా? సానియా మీర్జా పోస్ట్ వైరల్
Sania Mirza: మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన స్ఫూర్తిదాయక ప్రకటనపై సానియా మీర్జా స్పందించారు. ఈ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: సమాజంలో ఓ మహిళ సాధించిన విజయాన్ని ఎలా విలువ కడుతున్నారన్నదానిపై మనం ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు భారత టెన్నిస్ (Tennis) స్టార్ సానియా మీర్జా (Sania Mirza). స్త్రీ, పురుష వివక్ష అనేది ఇంకా వ్యాప్తిలో ఉండటంపై విచారం వ్యక్తం చేశారు. మహిళల విజయంపై ఓ కంపెనీ చేసిన యాడ్పై స్పందిస్తూ ఆమె సోషల్మీడియాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
స్థానికంగా పలు సేవలు అందించే అర్బన్ కంపెనీ ఇటీవల (చోటీ సోచ్ - సంకుచిత ఆలోచనలు) పేరుతో ఓ వీడియో యాడ్ విడుదల చేసింది. ‘ప్రతి ఒక్కరికీ తాము చేస్తున్న పని పట్ల గర్వంగా ఉంటుంది. దాన్ని ఇతరులు కూడా గౌరవించాలి’ అనే స్ఫూర్తిదాయక సందేశంతో ఆ ప్రకటనను రూపొందించింది. అందులో ఓ మహిళ బ్యూటీషియన్గా పనిచేస్తూ కారు కొనుగోలు చేస్తుంది. అది చూసి ఇరుగుపొరుగూ ఆమె వృత్తిని చులకన చేస్తారు. దాన్ని ఆమె తమ్ముడు అవమానంగా భావిస్తాడు. అప్పుడు ఆమె సోదరుడితో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ఒక్కరూ నేను కొన్న కారునే చూస్తున్నారు. కానీ, దాని వెనుక నా కష్టాన్ని ఎవరూ గుర్తించట్లేదు. మహిళ విజయం సాధించిన ప్రతిసారీ.. ఈ సమాజం కించపర్చాలనే చూస్తుంది. అలాంటి వారి మాటలను పట్టించుకుని మన జీవితాన్ని వదులుకోవాలా? కష్టపడి ముందు సాగాలా? అనేది మన నిర్ణయమే’’ అని అంటుంది.
ఈ వీడియోకు సానియా స్పందిస్తూ ఉద్విగ్నభరిత పోస్ట్ చేశారు. ‘‘2005లో డబ్ల్యూటీఏ టైటిల్ గెలిచి.. ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళగా నిలిచాను. అది గొప్పదే కదా..?డబుల్స్లో ప్రపంచ నంబర్ వన్గా ఉన్నప్పుడు.. నేను ఎప్పుడు స్థిరపడతానా అని ప్రజలు ఆసక్తిగా చూశారు. ఆరు గ్రాండ్స్లామ్లు గెలవడం ఈ సమాజానికి సరిపోలేదు. ఈ కెరీర్లో నాకు ఎంతోమంది మద్దతు ఇచ్చారు. కానీ, ఓ మహిళ విజయం సాధించినప్పుడు నైపుణ్యాలు, శ్రమకు బదులుగా అసమానతలు, ఆమె ఆహార్యం గురించే ఎందుకు చర్చిస్తారనేది ఇప్పటికీ అర్థం కాదు. ఈ యాడ్ చూసిన తర్వాత నా మదిలో ఎన్నో భావాలు మెదిలాయి. ఈ సమాజంలో వాస్తవాల గురించి మాట్లాడటం కష్టమేనని తెలుసు. కానీ, ఓ మహిళ సాధించిన విజయానికి మనం ఎలాంటి విలువ ఇస్తున్నామనే దానిపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. కానీ, అది ఎప్పటికి జరిగేనో..!’’ అని ఆమె రాసుకొచ్చారు.
ఆరేళ్ల వయసులోనే టెన్నిస్ రాకెట్ పట్టిన సానియా మీర్జా.. 2003లో 16 ఏళ్ల వయస్సులో ప్రొఫెషనల్ ఆటలోకి అడుగుపెట్టారు. తన సుదీర్ఘ కెరీర్లో మొత్తం 43 డబుల్స్ టైటిళ్లు సాధించారు. ఇందులో ఆరు గ్రాండ్స్లామ్ ట్రోఫీలున్నాయి. మహిళల డబుల్స్ కేటగిరీలో 91 వారాల పాటు నంబర్ 1 క్రీడాకారిణిగా నిలిచారు. ఈ క్రమంలో తన ఆటతోనే కాకుండా వ్యక్తిగత జీవితం విషయంలోనూ తరచూ వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె వైవాహిక బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు సన్నాహకం జూన్ 1న బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్తో ప్రారంభం కానుంది. ఆ తర్వాత ఐదు రోజులకే తొలి పోరు జరగనుంది. -
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
భారత క్రికెట్ రూపురేఖలను మార్చడంలో ఎంఎస్ ధోనీ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అలాగే విరాట్ వంటి ఆటగాళ్లను మెరుగ్గా రాణించడంలోనూ ధోనీదే ముఖ్య భూమిక. ఈ మాట అంటున్నది భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్. -
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
టీ20 ప్రపంచ కప్ కోసం టీమ్ఇండియాకు ఎంపికైన ఆటగాళ్లు త్వరలోనే అమెరికాలో అడుగు పెట్టనున్నారు. అందరూ ఒకేసారి కాకుండా రెండు విడతలుగా వెళ్లే అవకాశం ఉంది. -
ధోనీకిదే చివరి సీజనా? విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ధోనీ కేవలం చివరి ఓవర్లలోనే బ్యాటింగ్కు వస్తూ అలరిస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరుతో మ్యాచ్లో మరోసారి ధోనీ బ్యాటింగ్ చూసే అవకాశం రావాలని అభిమానుల ఆకాంక్ష. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?
ఐపీఎల్ చివరి దశకు వరుణుడు అడ్డుగా మారాడు. కీలకమైన సమయంలో మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నాడు. -
ఏ దశలోనూ క్వాలిటీ క్రికెట్ మాత్రం ఆడలేకపోయాం: హార్దిక్ పాండ్య
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు ఉన్నా నాణ్యమైన క్రికెట్ను ఆడటంలో విఫలమైనట్లు ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య స్పష్టం చేశాడు. లఖ్నవూ చేతిలో ఓటమి అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు. -
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
తొలుత బ్యాటింగ్ చేసిన లఖ్నవూ 214 పరుగులు చేయగా.. ముంబయి 196 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చివరి మ్యాచ్లో ముంబయిని ఓడించినప్పటికీ లఖ్నవూ ప్లేఆఫ్స్కు చేరుకోలేకపోయింది. ఈ క్రమంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. -
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
లఖ్నవూతో మ్యాచ్ సందర్భంగా ముంబయి స్టార్ రోహిత్ శర్మ చేసిన ఓ విజ్ఞప్తి నెట్టింట వైరల్గా మారిపోయింది. -
పూరన్ దంచెన్
ఆఖర్లోనూ భంగపాటే. పేలవ ప్రదర్శనతో పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి ఇండియిన్స్ సీజన్ను ఓటమితో ముగించింది. వాంఖడెలో మొదట తడబడుతూ సాగిన లఖ్నవూకు 200పైగా స్కోరు సాధించే అవకాశం కల్పించి.. ఆ తర్వాత ఛేదనలో మెరుపు ఆరంభం లభించినా తేలిపోయి ఓటమి కొనితెచ్చుకుంది. -
వానా వానా వద్దప్పా!
అసలు జరుగుతుందో లేదో తెలియదు.. కానీ కచ్చితంగా మ్యాచ్ పూర్తవ్వాలని కోరుకుంటున్న అభిమానులు ఎందరో..? జరిగేది ఫైనల్ కాదు.. కానీ అంతకంటే ఎక్కువ ఆసక్తి నెలకొంది ఆ సమరంపై..! -
సెమీస్లో సాత్విక్ జోడీ
థాయ్లాండ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. -
అప్పటి నుంచే ఆ ఆలోచన
అఫ్గానిస్థాన్తో ఫిఫా ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం తొలిసారి రిటైర్మెంట్ ఆలోచన వచ్చిందని, తుది నిర్ణయం తీసుకోవడానికి ఓ నెల సమయం పట్టిందని భారత స్టార్ సునీల్ ఛెత్రి చెప్పాడు. -
ఆర్జనలో రొనాల్డో నం.1
ఫోర్బ్స్ అత్యధికంగా ఆర్జిస్తున్న క్రీడాకారుల జాబితాలో పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. -
మను బాకర్ జోరు
ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్లో భారత అగ్రశ్రేణి షూటర్ మను బాకర్ జోరు కొనసాగుతోంది. -
పర్వీన్పై నిషేధం.. చేజారిన ఒలింపిక్ బెర్తు
బాక్సింగ్లో భారత్ ఓ ఒలింపిక్ బెర్తు కోల్పోయింది. -
నా రికార్డులు ప్రస్తుతానికి భద్రమే
తన రికార్డులకు ప్రస్తుతానికి వచ్చిన ముప్పేమి లేదని జమైకా దిగ్గజం ఉసేన్ బోల్ట్ అన్నాడు. -
ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. -
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
ఐపీఎల్ 2024లో భాగంగా తమ చివరి లీగ్ మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ 18 పరుగుల తేడాతో గెలిచింది. -
వర్షం ముప్పు.. బెంగళూరును ‘సబ్ఎయిర్’ సిస్టమ్ కాపాడుతుందా?
చెన్నైతో మ్యాచ్ బెంగళూరుకు అత్యంత కీలకం. కానీ, వర్షం పడుతుందనే ఆందోళన ఆ జట్టును వెంటాడుతోంది. ఒకవేళ వర్షం తగ్గితే మాత్రం మ్యాచ్ నిర్వహణకు ఎక్కువ సమయం పట్టుకపోవచ్చు.
తాజా వార్తలు (Latest News)
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్