Sanju Samson: భారత జట్టులో పాతుకుపోవాలంటే.. ప్రత్యేకత చూపాల్సిందే: సంజూ శాంసన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో (Team India) చోటు దక్కడమంటే ఈజీగా ఉండదు. అద్భుతమైన టాలెంట్తోపాటు అదృష్టమూ కలిసి రావాలి. నిలకడైన ఫామ్, ఫిట్నెస్తో ప్లేయర్లు సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి అవకాశం వస్తే నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాలి. లేకపోతే మరో ప్లేయర్ ఆ స్థానాన్ని తన్నుకుపోయే ఛాన్స్ ఉంది. భారత క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) పరిస్థితీ ఇలాంటిదే. అతడు తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. టీమ్ఇండియాలో పాతుకుపోవాలంటే కేరళ నుంచి వచ్చిన తనలాంటి ఆటగాడు ప్రత్యేకతను ప్రదర్శించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.
‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంలో క్రికెట్ ఆడాలని అనుకుంటే జరిగిపోదు. ఇక్కడ పోటీ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. నంబర్వన్ జట్టులో ఆడాలనేది చాలామంది క్రికెటర్ల కల. మన దగ్గర ఉన్న టాలెంట్ అద్భుతం. పోటీ తీవ్రం. ఇలాంటప్పుడు కేరళ నుంచి నాలాంటి ఆటగాడు భారత జట్టులో పాతుకుపోవాలని భావిస్తే మాత్రం విభిన్నంగా ఆడాలి. ప్రత్యేకమైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కుదురుకోగలం.
నేను ఎప్పుడు బ్యాటింగ్కు దిగినా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. ప్రతీ బంతినీ హిట్ చేయాలనే ఉద్దేశంతో ఆడను. చెత్త బంతిని స్టాండ్స్ ఆవలకు తరలించేందుకు ఏమాత్రం ఆలోచించను. అది మొదటి బాల్ అయినా సరే వదిలిపెట్టను. అప్పటికప్పుడు నా మైండ్సెట్ను మార్చుకుంటా. నా శైలిలోనే బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడతా. విభిన్నంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. పది బంతుల వరకు సిక్స్ కొట్టేందుకు వేచి చూడటం ఎందుకు? నా పవర్ హిట్టింగ్ వెనక ఉన్న స్ఫూర్తి అదే. కొవిడ్ సమయంలోనూ చాలా తీవ్రంగా శ్రమించా’’ అని సంజూ శాంసన్ తెలిపాడు. సంజూ శాంసన్కు భారత జట్టులో అవకాశాలు వచ్చినప్పటికీ.. నిలకడలేని కారణంగా స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంజూ ఐపీఎల్ 17వ సీజన్ (IPL) కోసం సన్నద్ధమవుతున్నాడు.
కోహ్లీని అధిగమించే అవకాశం
ఐపీఎల్ చరిత్రలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్ టాప్-3లో ఉన్నారు. రైనా 171 ఇన్నింగ్స్ల్లో 4,934 పరుగులు చేశాడు. విరాట్ 93 ఇన్నింగ్స్ల్లో 2,815 పరుగులు, సంజూ శాంసన్ 77 ఇన్నింగ్స్ల్లో 2,504 పరుగులు చేశాడు. శాంసన్ మరో 312 పరుగులు చేస్తే కోహ్లీని అధిగమిస్తాడు. అయితే, కోహ్లీ ఆర్సీబీ తరఫున ఓపెనర్గా వస్తేనే శాంసన్కు అవకాశం ఉంటుంది. విరాట్ కూడా వన్డౌన్లో వస్తే ఆ వ్యత్యాసం ఇంకా పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం