Sanju Samson: భారత జట్టులో పాతుకుపోవాలంటే.. ప్రత్యేకత చూపాల్సిందే: సంజూ శాంసన్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) ఐపీఎల్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో (Team India) చోటు దక్కడమంటే ఈజీగా ఉండదు. అద్భుతమైన టాలెంట్తోపాటు అదృష్టమూ కలిసి రావాలి. నిలకడైన ఫామ్, ఫిట్నెస్తో ప్లేయర్లు సిద్ధంగా ఉండాలి. ఒక్కసారి అవకాశం వస్తే నిలబెట్టుకోవడానికి తీవ్రంగా శ్రమించాలి. లేకపోతే మరో ప్లేయర్ ఆ స్థానాన్ని తన్నుకుపోయే ఛాన్స్ ఉంది. భారత క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) పరిస్థితీ ఇలాంటిదే. అతడు తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. టీమ్ఇండియాలో పాతుకుపోవాలంటే కేరళ నుంచి వచ్చిన తనలాంటి ఆటగాడు ప్రత్యేకతను ప్రదర్శించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.
‘‘ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంలో క్రికెట్ ఆడాలని అనుకుంటే జరిగిపోదు. ఇక్కడ పోటీ వాతావరణం ఎక్కువగా ఉంటుంది. నంబర్వన్ జట్టులో ఆడాలనేది చాలామంది క్రికెటర్ల కల. మన దగ్గర ఉన్న టాలెంట్ అద్భుతం. పోటీ తీవ్రం. ఇలాంటప్పుడు కేరళ నుంచి నాలాంటి ఆటగాడు భారత జట్టులో పాతుకుపోవాలని భావిస్తే మాత్రం విభిన్నంగా ఆడాలి. ప్రత్యేకమైన ప్రదర్శన చేస్తేనే జట్టులో కుదురుకోగలం.
నేను ఎప్పుడు బ్యాటింగ్కు దిగినా అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తా. ప్రతీ బంతినీ హిట్ చేయాలనే ఉద్దేశంతో ఆడను. చెత్త బంతిని స్టాండ్స్ ఆవలకు తరలించేందుకు ఏమాత్రం ఆలోచించను. అది మొదటి బాల్ అయినా సరే వదిలిపెట్టను. అప్పటికప్పుడు నా మైండ్సెట్ను మార్చుకుంటా. నా శైలిలోనే బ్యాటింగ్ చేసేందుకు ఇష్టపడతా. విభిన్నంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. పది బంతుల వరకు సిక్స్ కొట్టేందుకు వేచి చూడటం ఎందుకు? నా పవర్ హిట్టింగ్ వెనక ఉన్న స్ఫూర్తి అదే. కొవిడ్ సమయంలోనూ చాలా తీవ్రంగా శ్రమించా’’ అని సంజూ శాంసన్ తెలిపాడు. సంజూ శాంసన్కు భారత జట్టులో అవకాశాలు వచ్చినప్పటికీ.. నిలకడలేని కారణంగా స్థానం కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్గా వ్యవహరిస్తున్న సంజూ ఐపీఎల్ 17వ సీజన్ (IPL) కోసం సన్నద్ధమవుతున్నాడు.
కోహ్లీని అధిగమించే అవకాశం
ఐపీఎల్ చరిత్రలో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో సురేశ్ రైనా, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్ టాప్-3లో ఉన్నారు. రైనా 171 ఇన్నింగ్స్ల్లో 4,934 పరుగులు చేశాడు. విరాట్ 93 ఇన్నింగ్స్ల్లో 2,815 పరుగులు, సంజూ శాంసన్ 77 ఇన్నింగ్స్ల్లో 2,504 పరుగులు చేశాడు. శాంసన్ మరో 312 పరుగులు చేస్తే కోహ్లీని అధిగమిస్తాడు. అయితే, కోహ్లీ ఆర్సీబీ తరఫున ఓపెనర్గా వస్తేనే శాంసన్కు అవకాశం ఉంటుంది. విరాట్ కూడా వన్డౌన్లో వస్తే ఆ వ్యత్యాసం ఇంకా పెరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత