Sanju Samson: కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: దిల్లీతో మ్యాచ్లో 36 పరుగులకే కీలకమైన మూడు వికెట్లు పడ్డాయి. చివరికి రాజస్థాన్ స్కోరు 20 ఓవర్లకు 185/5. దీనికి కారణం రియాన్ పరాగ్ (84*). అతడితోపాటు అశ్విన్ (29), ధ్రువ్ జురెల్ (20), హెట్మయర్ (14*) కూడా రాణించారు. గత సీజన్లో ఫామ్ కోల్పోయిన రియాన్.. ఎప్పుడు రాణిస్తాడని అంతా ఎదురు చూశారు. ఇప్పుడు సత్తా చాటుతూ కీలక ఇన్నింగ్స్లు ఆడేస్తున్నాడు. మ్యాచ్ అనంతరం రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించాడు.
‘‘తొలి 10 ఓవర్లలో ఎక్కువ పరుగులు చేయలేకపోయాం. దీంతో రోవ్మన్ పావెల్ను సిద్ధంగా ఉండాలని చెప్పాం. అతడితో బ్యాటింగ్ చేయించాలని భావించాం. కానీ, ఆ తర్వాత బ్యాటర్లు తమ బాధ్యతలను అద్భుతంగా నిర్వర్తించారు. మ్యాచ్పై పట్టు సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంపాక్ట్ రూల్ వచ్చిన తర్వాత తుది 11 మంది ఆటగాళ్లే కాకుండా.. మొత్తం 15 మంది కూడా కీలకమే. మా ఇన్నింగ్స్లోని 13-17 ఓవర్ల మధ్య నేను, సంగక్కర కనీసం నాలుగైదుసార్లు బ్యాటింగ్ ఆర్డర్ గురించి మాట్లాడుకున్నాం. రియాన్ అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి ఎదుట పోరాడే లక్ష్యం నిర్దేశించగలిగాం. గత నాలుగేళ్లుగా రియాన్ చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో ఎక్కడికెళ్లినా అతడి గురించే అడిగేవారు. ఎప్పుడు బాగా ఆడతాడని కేరళలోనూ అతడి ఆటతీరుపై చర్చ జరిగింది. ఇప్పుడు మంచి టచ్లోకి వచ్చాడు. ఇలాగే కొనసాగితే తప్పకుండా భారత జట్టులోకి రావడం ఖాయం. మా బౌలర్లు సందీప్ శర్మ, అవేశ్ ఖాన్ కీలక సమయంలో పరుగులను నియంత్రించారు’’అని సంజూ శాంసన్ వెల్లడించాడు.
తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాం: రిషభ్ పంత్
‘‘విజయానికి చేరువగా వచ్చాం. చివర్లో మ్యాచ్ను వదిలేయడం నిరుత్సాహానికి గురి చేసింది. మా బౌలర్లు 16 ఓవర్ల వరకు కట్టుదిట్టంగా వేశారు. డెత్ ఓవర్లలో బ్యాటర్ల దూకుడు ఎక్కువగా ఉంటుంది. ఈ మ్యాచ్లోనూ ఇదే జరిగింది. తప్పకుండా డెత్లో పరుగులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. దానిపై దృష్టిపెట్టి తదుపరి మ్యాచుల్లో తప్పిదాల నుంచి పాఠాలను నేర్చుకుంటాం’’ అని దిల్లీ కెప్టెన్ రిషభ్ పంత్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం