IND vs BAN: రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌.. నిరాశపరిచిన శాంసన్‌

టీ20 వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న వార్మప్‌ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో కలిసి సంజూ శాంసన్‌ ఓపెనింగ్‌ చేశాడు.

Updated : 01 Jun 2024 20:44 IST

న్యూయార్క్‌: టీ 20 వరల్డ్‌ కప్‌ ఆడేందుకు అమెరికా వెళ్లిన టీమ్‌ ఇండియా వార్మప్‌ మ్యాచ్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో తలపడుతోంది. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ రోహిత్‌శర్మ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. అయితే, రోహితో కలిసి, యశస్వి జైస్వాల్‌ ఓపెనింగ్‌ చేస్తాడని అందరూ భావించారు. కానీ, దానికి భిన్నంగా రోహిత్‌శర్మ, సంజూ శాంసన్‌ ఓపెనర్లుగా క్రీజులోకి వచ్చారు. శుక్రవారమే న్యూయార్క్‌ చేరుకున్న విరాట్‌ కోహ్లీ ఈ మ్యాచ్‌లో ఆడటం లేదు. మరోవైపు తొలి 7 ఓవర్లలో భారత్‌ 2 వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసింది. సంజూ శాంసన్‌ (1) నిరాశ పరిచాడు. రోహిత్‌ శర్మ (23) ఫర్వాలేదనిపించాడు. రిషభ్‌ పంత్‌ (29), సూర్యకుమార్‌ యాదవ్‌ (1) క్రీజులో కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని