SANJU SAMSON: అందరికీ అవకాశాలు ఇస్తున్నారు.. సంజూకే ఎందుకిలా..?
సంజూ శాంసన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టాలెంట్ ఎక్కువ.
ఇంటర్నెట్ డెస్క్: సంజూ శాంసన్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టాలెంట్ ఎక్కువ.. అవకాశాలు తక్కువ. అవును అతడి క్రికెట్ కెరీర్ సాగిన విధానం చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. ఎప్పుడో 2013లో అతడు భారత టీ20 లీగ్లో అడుగుపెట్టి అదరగొట్టాడు. 2015లోనే భారత్ తరఫున అరంగేట్రం చేశాడు. దీంతో సంజూ భవిష్యత్లో భారత్కు కీలక ఆటగాడిగా ఉంటాడని అంతా భావించారు. అయితే, ఏడేళ్లు గడిచినా.. జట్టులో సుస్థిర స్థానం దక్కలేదు. మరి అతడికే ఎందుకిలా జరుగుతోందంటే..?
సామర్థ్యం ఉంటే ఒక్క అవకాశమేనా!
(ఫొటోలు : సంజూ ట్విటర్)
సంజూ శాంసన్ సామర్థమున్న ఆటగాడు.. అద్భుతమైన టాలెంట్ అతడి సొంతం. బ్యాటింగ్ టెక్నిక్ బాగుంటుంది. ఇలా రకరకాల సందర్భాల్లో మాజీలు అతడిని ప్రశంసించారు. స్వయంగా ప్రస్తుత టీమ్ఇండియా హెడ్కోచ్ రాహుల్ ద్రావిడ్ 2013లోనే సంజూ సత్తా ఏంటో గుర్తించాడు. ఆ సమయంలో భారత టీ20లీగ్లోకి రాజస్థాన్ తరఫున సంజూ అరంగేట్రం చేశాడు. అప్పుడు ఆ జట్టు కెప్టెన్గా ద్రావిడ్ ఉన్నాడు. బెంగుళూరుతో జరిగిన ఓ మ్యాచ్లో సంజూ 41 బంతుల్లేనే 63(7 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే, 18 ఏళ్ల వయసులోనే సంజూ ఆడిన షాట్లు చూసి ద్రావిడ్ అభినందించాడు. ఆ తర్వాత కూడా నిలకడగా ఆడటంతో 2015 జింబాబ్వేతో టీ20 సిరీస్కు సంజూ ఎంపికయ్యాడు. సిరీస్లోని చివరి మ్యాచ్లో అవకాశం రాగా 19 పరుగులే చేసి విఫలం అయ్యాడు. అంతే సంజూకి ఇంకో ఐదేళ్ల వరకు ఛాన్స్ ఇవ్వలేదు. మళ్లీ 2020లో జాతీయజట్టు నుంచి పిలుపువచ్చిందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.. టాలెంట్ నిరూపించుకోవడానికి అతడికి ఒకే అవకాశం ఇచ్చారని.
ఫామ్లో లేక కాదు..!
2015 నుంచి భారత టీ20లీగ్తో పాటు, దేశవాళీ క్రికెట్లో సంజూ రాణించాడు. 2018 సీజన్లో మెరుపులు మెరిపించిన రిషభ్పంత్ ఆ ఏడాదే భారత జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. అయితే.. సంజూకి మాత్రం అవకాశం రాలేదు. 2018లో 137.81 స్ట్రెక్రేట్తో 441, 2019లో 148.69 స్ట్రెక్రేట్తో 342 పరుగులు సాధించినా.. శాంసన్కు అప్పుడు ఛాన్స్ రాలేదు. ఇక.. 2020 జనవరిలో శ్రీలంకతో టీ20 సిరీస్లో అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఆడిన మొదటి బంతినే సిక్సర్కు తరలించిన సంజూ వెంటనే ఔటయ్యాడు. అదే నెల చివర్లో న్యూజిలాండ్ పర్యటనకు ఎంపికయినా.. విఫలం అయ్యాడు. దీంతో మళ్లీ కథ మొదటికే వచ్చింది. సంజూని పక్కనపెట్టారు.
2020 భారత టీ20లీగ్లో 158.39 స్ట్రెక్రేట్తో 375 పరుగులు చేయడంతో అదే డిసెంబర్లో జరిగిన ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికచేశారు. ఇక్కడ తొలి మ్యాచ్లో 15 బంతుల్లో 23తో పర్వాలేదనిపించినా , తర్వాతి రెండు మ్యాచ్ల్లో దూకుడుగా ఆడే ప్రయత్పంలో 15, 10 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత మళ్లీ 2021లో శ్రీలంక పర్యటనకు ఎంపికయ్యాడు. అక్కడ హసరంగా బౌలింగ్లో ఇబ్బందిపడటంతో ఆ సిరీస్లో విఫలమయ్యాడు. 2021 భారత టీ20 లీగ్లో 136.72 స్ట్రెక్రేట్తో 484 పరుగులు చేశాడు. దీంతో 2022లో శ్రీలంకతో టీ20 సిరీస్కు సెలక్ట్ అయ్యాడు. ఇక్కడ తొలి మ్యాచ్లో అవకాశం రాలేదు. ఆ తర్వాతి మ్యాచ్లో 24 బంతుల్లో 39, చివరి మ్యాచ్లో 10 బంతుల్లో 18 పరుగులు చేశాడు.
ఇలా అయితే ఎలా రాణిస్తాడు..!
ఇక 2022 భారత టీ20 లీగ్లో 146.79 స్ట్రెక్రేట్తో 458 పరుగులు చేశాడు. దీంతో స్వదేశంలో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్కు సంజూని ఎంపికచేస్తారని అంతా భావించారు. కానీ ఇక్కడ నిరాశే మిగిలింది. దాని తర్వాత జరిగిన ఐర్లాండ్ సిరీస్లో ఆడించారు. అక్కడ 77 పరుగులతో రాణించాడు. అయితే, సంజూని తర్వాత జరిగిన ఇంగ్లాండ్ సిరీస్లో పక్కన పెట్టి.. మళ్లీ విండీస్తో వన్డే సిరీస్కు ఎంపికచేశారు. ఇక్కడ అర్థశతకంతో మెరిసిన సంజూకి టీ20 సిరీస్లో ఛాన్స్ ఇవ్వలేదు. అయితే, కేఎల్ రాహుల్కు గాయమవ్వడంతో చివరి రెండు టీ20ల్లో ఆడించేందుకు శాంసన్ను అక్కడికి పంపించారు. ఇక్కడ ఆడిన తొలి మ్యాచ్లో 23 బంతుల్లో 30 పరుగులు చేసి నాటౌట్గా నిలిచినా.. తర్వాతి మ్యాచ్లో 15 పరుగులే చేశాడు. అంతే మళ్లీ సేమ్ సీన్ రిపీట్. తాజాగా ఎంపిక చేసిన ఆసియాకప్ బృందంలో చోటివ్వలేదు.
సంజూ శాంసన్కి ఇప్పటివరకూ ఒక్కసారి కూడా వరుసగా నాలుగుమ్యాచ్ల్లో అవకాశం ఇవ్వలేదు. సంజూ తన ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్లో కేవలం 16 టీ20లు, 4 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇలా అయితే.. రానున్న టీ20 ప్రపంచకప్కు సంజూని ఎంపిక చేయడం ప్రశ్నార్థకమే..! దీంతో సంజూకి అన్యాయం జరుగుతోందని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. వరుసగా అవకాశాలు ఇవ్వకపోతే ఎలా రాణిస్తాడని మండిపడుతున్నారు. దినేశ్ కార్తీక్, పంత్, అయ్యర్లకు అవకాశాలు ఇస్తున్నారు. మరీ సంజూకి ఎందుకివ్వట్లేదని అతడి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు