Sarfaraz - Jaiswal: సర్ఫరాజ్ ‘డబుల్ సెంచరీ’ ఆనందం... నువ్వు సూపర్ అంతే!
Sarfaraz Khan: సర్ఫరాజ్ ఖాన్ డబుల్ సెంచరీ చేయలేదు... కానీ 200 కొట్టినంత సంబరం చేసుకున్నాడు.. ఎందుకంటే?
ఇంటర్నెట్ డెస్క్: భారత దేశవాళీ క్రికెట్లో గత కొన్నేళ్లుగా వినిపిస్తున్న పేరు, నడుస్తున్న చర్చ సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan)గురించే. అయితే ఇన్నాళ్లూ అతని ఆటే స్పెషల్ అనుకున్నాం. కానీ టీమ్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చాక ఆటే కాదు.. మనసు కూడా స్పెషలే అని అర్థమైంది. దానికి కారణం అతను చేసిన పనులు. అవి చూడటానికి, వినటానికి సింపుల్గా అనిపించొచ్చు కానీ... ఈ యువ క్రికెటర్ పరిణతి ఎంతో చెప్పడానికి అవి చాలు. ఫ్యూచర్ ఇండియన్ స్టార్ అవుతాడు అనడానికి కూడా.
భారత్ రెండో ఇన్నింగ్స్ 97వ ఓవర్ తొలి బంతి పడే ముందు రాజ్కోట్ స్టేడియం మొత్తం యశస్వి జైస్వాల్ పేరు మారుమోగుతోంది. కారణం అతను 199 పరుగులతో క్రీజులో ఉండటం. 96.1వ బంతికి సింగిల్ తీసి ద్విశతకం సాధించేశాడు. దాంతో మైదానం ఈలలు, చప్పట్లు, అరుపులతో దద్దిరిల్లిపోయింది. అయితే, మైదానంలో ఆ డబుల్ సెంచరీని సెలబ్రేట్ చేసుకుంది ఒకరు కాదు ఇద్దరు.
అవును, అంతటి గొప్ప మూమెంట్ని జైస్వాల్తోపాటు... అవతలి ఎండ్లో ఉన్న సర్ఫరాజ్ ఖాన్ కూడా సంబరంలా జరుపుకొన్నాడు. ఆ పరుగు తీస్తున్నప్పుడు జైస్వాల్ ఎంతటి సంబరపడ్డాడో... ఇంచుమించే అంతే ఆనందపడ్డాడు సర్ఫరాజ్. తానే డబుల్ సెంచరీ చేశాడేమో అనేంతలా ఎగురుకుంటూ అవతలి ఎండ్కు చేరుకున్నాడు. ఆ తర్వాత జైస్వాల్ను అభినందనలతో ముంచెత్తాడు.
ఇప్పుడు దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేదో మ్యాచ్ గెలిపించే రన్లా సర్ఫరాజ్ సంబరపడిపోయాడు అని కొందరు కామెంట్లు పెడుతుంటే... మరికొందరేమో సర్ఫరాజ్ సూపర్ అంటూ పొగిడేస్తున్నారు. మరికొందరేమో ‘పక్కోడి ఘనతను సంబరంలా జరుపుకొంటున్నాడు.. గ్రేట్’ అని కామెంట్లు చేస్తున్నారు. మ్యాచ్ తొలి రోజు ఎమోషనల్ అయ్యి... అందరినీ ఎమోషనల్ చేసిన సర్ఫరాజ్... ఇలా ఆఖరి రోజు జోష్ చూపించి మరింత కనెక్ట్ అయ్యాడు.
నిజానికి సర్ఫరాజ్ ఇప్పుడే కాదు.. తొలి ఇన్నింగ్స్లో రవీంద్ర జడేజా కారణంగా రనౌట్ అయినప్పుడు కూడా ఇంతే పరిణతితో ‘క్రికెట్లో ఇలాంటివి సహజం’ అని అన్నాడు. ఇక స్లిప్ కార్డన్లో ఉన్నప్పుడు అయినా, క్లోజ్ ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు అయినా టీమ్ను భలే సపోర్టు చేశాడు. రెండో ఇన్నింగ్స్ను రోహిత్ శర్మ డిక్లేర్ చేసినప్పుడు డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లేటప్పుడు ‘ముందు నడుచుకుంటూ వెళ్లి లీడ్ చేయ్’ అని జైస్వాల్ను ముందుకు పంపించాడు. తొలి టెస్టు ఆడుతూ ఇంతటి పాజిటివ్ మైండ్సెట్తో ఆడటం గ్రేట్ అనొచ్చు. దేశవాళీల్లో చేసిన పరుగులకు ఈ యాటిట్యూడ్ మరింత మంచి పేరు తీసుకొస్తుంది అనొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం