Sehwag: ద్రవిడ్కు మద్దతుగా సెహ్వాగ్.. గ్యారీ కిర్స్టెన్ను ప్రస్తావించిన డ్యాషింగ్ బ్యాటర్!
కీలక మ్యాచుల్లో భారత్ ఓడిపోవడంతో కోచ్ రాహుల్ ద్రవిడ్పై (Rahul Dravid) విమర్శలు వచ్చాయి. జట్టును సరిగా నడిపించలేకపోతున్నాడని వ్యాఖ్యలు వినిపించాయి. అయితే, ద్రవిడ్కు టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Sehwag) మద్దతుగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ (WTC Final 2023) భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ (Rahil Dravid) ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జరిగిన టీ20 ప్రపంచకప్ (T20 World Cup 2022), ఆసియా కప్, డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమ్ఇండియాకు ఓటమి తప్పలేదు. దీంతో అతడి కోచింగ్ శైలిపై విమర్శలు రేగాయి. ఈ క్రమంలో భారత మాజీ డ్యాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ తన సహచరుడికి మద్దతుగా నిలిచాడు. అయితే, వన్డే ప్రపంచకప్ 2011 టైటిల్ను నెగ్గిన భారత్ జట్టుకు కోచ్గా పని చేసిన గ్యారీ కిర్స్టెన్ ప్రస్తావన తీసుకురావడం విశేషం.
‘‘ఆటగాళ్ల ప్రదర్శనపైనే కోచ్ కీర్తి ప్రతిష్ఠలు ఆధారపడి ఉంటాయి. ఒక్కసారి వారు మైదానంలోకి దిగి మంచి ప్రదర్శన చేస్తే కోచ్ను అభినందిస్తారు. అలాగే ఓడితే విమర్శిస్తారు. మనం డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరాం. కానీ, ఓటమి చవిచూశాం. ప్రతి ఒక్కరూ పరాజయం గురించి మాత్రమే మాట్లాడతారు. మనం ఇక్కడ వరకు ఎలా వచ్చామనేది పట్టించుకోరు. రాహుల్ ఉత్తమ కోచ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, మైదానంలోకి దిగిన తర్వాత ఆటగాళ్లే సరిగ్గా ఆడాలి. మీరు ఒకసారి 2011 ప్రపంచ కప్ సమయంలోని టీమ్ఇండియా కోచ్ను గుర్తు చేసుకోవాలి. భారత్ను విజేతగా నిలిపిన గ్యారీ కిర్స్టెన్ ఆ తర్వాత చాలా జట్లకు కోచింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. కానీ, ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలపలేకపోయాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్కు కప్ అందించాడు. అయితే, ఇక్కడ కిరిస్టెన్ కంటే ఆశిశ్ నెహ్రా చాలా కష్టపడ్డాడు. మ్యాచుల సందర్భంగా మనం టీవీల్లోనూ చూశాం’’ అని సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. ద్రవిడ్ - రోహిత్ (Dravid - Rohit) కాంబినేషన్లో వన్డే ప్రపంచకప్ను నెగ్గి ఐసీసీ ట్రోఫీ కోసం పదేళ్లుగా ఉన్న నిరీక్షణకు తెరదించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆ రెండు జట్లు గ్యారంటీ
‘‘రాబోయే వన్డే ప్రపంచకప్లో నాలుగు జట్లు సెమీస్ చేరేవేంటో చెబుతా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, భారత్, పాకిస్థాన్. అయితే, అందులో రెండు జట్లు మాత్రం తప్పకుండా ఉంటాయి. అవి ఆసీస్, ఇంగ్లాండ్. ఎందుకంటే ఇరు జట్లు ఆడే విధానం ఆ స్థాయిలో ఉంది. మిగతా రెండు వచ్చే అవకాశాలు ఎక్కువే. కానీ, అద్భుతాలు జరిగితే ఇప్పుడేం చెప్పలేం’’ అని సెహ్వాగ్ చెప్పాడు.
ఆ మ్యాచ్ చూడాలని ఉంది: ముత్తయ్య మురళీధరన్
‘‘ప్రపంచకప్లో భారత్ - ఇంగ్లాండ్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. భారత్ నిస్సందేహంగా ఫేవరేట్. ఎందుకంటే వారి స్వదేశంలో టోర్నీని ఆడబోతోంది. అందుకే, ఇంగ్లాండ్తో పోరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది’’ అని ముత్తయ్య తెలిపాడు. భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య అక్టోబర్ 29న లఖ్నవూ వేదికగా మ్యాచ్ జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ పొట్టి కప్ బరిలోకి దిగబోతున్నాడు. ఈసారైనా తన ప్రపంచ కప్ కలను నెరవేర్చుకోవాలంటే కీలకమైన మూడో స్థానంలో అద్భుత ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. -
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
డేవిడ్ వార్నర్ మైదానంలో దూకుడుగా ఆడేస్తాడు. సోషల్ మీడియాలో వీడియోలతో అభిమానులను అలరిస్తాడు. భారత క్రికెట్ అభిమానులకు చాలా దగ్గరైన ఆటగాళ్లలో వార్నర్ ఒకడు. -
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్