Umesh Yadav: అదే నా చివరి టోర్నీ.. ఛాన్స్ను మిస్ చేసుకోను: ఉమేశ్ యాదవ్
ఐపీఎల్ (IPL 2023)లో కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీకి ఆడుతున్న ఉమేశ్ యాదవ్ ఈసారి తన అత్యుత్తమ ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు సంపాదించాలని బలంగా భావిస్తున్నాడు. అలాగే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంకప్లోనూ ఆడాలని ఉందని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సీనియర్ బౌలర్ ఉమేశ్ యాదవ్కు (Umesh Yadav) టెస్టు జట్టులో స్థానం దక్కుతుంది. కానీ, వన్డేలతోపాటు టీ20ల్లో చోటు సంపాదించడంలో మాత్రం ఉమేశ్ విఫలమవుతున్నాడు. దాదాపు పన్నెండేళ్ల కిందట జాతీయ జట్టులోకి వచ్చిన ఉమేశ్ యాదవ్ ఇప్పటి వరకు 56 టెస్టులు, 75 వన్డేలు, కేవలం 9 అంతర్జాతీయ టీ20లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్లో (IPL) మాత్రం 130కిపైగా మ్యాచ్లను ఆడాడు. ప్రస్తుతం కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు (KKR) ఆడుతున్న ఉమేశ్ యాదవ్ ఈసారి ఎలాగైనా అద్భుత ప్రదర్శన చేసి వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇదే తనకు చివరి ప్రపంచకప్ అవుతుందని, తప్పకుండా జట్టులోకి వస్తానని ఉమేశ్ నమ్మకంగా చెప్పాడు.
‘‘ప్రతి నాలుగేళ్లకొకసారి వన్డే ప్రపంచకప్ జరుగుతుంటుంది. ఈసారి జట్టులో భాగం కావాల్సిందే. ఇదే నాకు చివరి అవకాశం అవ్వొచ్చు. అందుకే, ఐపీఎల్లో ఉత్తమ ప్రదర్శన ఇస్తే తప్పకుండా వన్డే ఫార్మాట్లో జట్టులోకి అవకాశం వస్తుందని నమ్ముతున్నా. ఇంకో ఛాన్స్ కోసం మరో నాలుగేళ్లు వేచి చూడటం నా వల్ల కాకపోవచ్చు’’ అని ఉమేశ్ యాదవ్ తెలిపాడు. మార్చి 31 నుంచి ఐపీఎల్ 16వ సీజన్ ప్రారంభం కానుంది. ఏప్రిల్ 1వ తేదీన పంజాబ్ కింగ్స్తో కోల్కతా తొలి మ్యాచ్ ఆడనుంది. శ్రేయస్ అయ్యర్ గైర్హాజరీలో కేకేఆర్కు నితీశ్ రాణాను మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించింది.
ఎక్కడైనా సవాళ్లు తప్పవు: కేకేఆర్ కోచ్
శ్రేయస్ అయ్యర్ త్వరగా కోలుకుని సీజన్ మధ్యలోనైనా జట్టుతో కలుస్తాడనే ఆశాభావంతో ఉన్నట్లు కేకేఆర్ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ తెలిపారు. నాయకుడిగా నితీశ్ రాణా అద్భుతంగా రాణిస్తాడనే నమ్మకం ఉందని పేర్కొన్నాడు. ‘‘క్రికెట్ కోచ్గానైనా, ఆటగాడిగానైనా ఎప్పుడూ వెనుకడుగు వేసింది లేదు. జట్టులో కొందరు అందుబాటులో లేరని బాధపడలేదు. కీలకమైన శ్రేయస్ లేకపోవడం నష్టమే కానీ, అధిగమిస్తాం. శ్రేయస్ మధ్యలోనైనా తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. అయితే, నితీశ్ రాణాలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. తప్పకుండా తానేంటో నిరూపించుకుంటాడు. దేశీయ క్రికెట్ కోచ్గా అక్కడి పరిస్థితులు వేరు. ఐపీఎల్లో అంతర్జాతీయ క్రికెటర్లతో కలిసి పనిచేయడం విభిన్నంగా ఉంటుంది. ఎక్కడైనా సరే సవాళ్లు ఉంటాయి. వాటిని అధిగమించాలి’’ అని పండిత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల