IPL 2023: సీనియారిటీలోనే కాదు.. ఆటలోనూ అదుర్సే..
యువ ఆటగాళ్లకు తామేం తక్కువ కాదంటూ నిరూపిస్తున్నారు కొందరు సీనియర్లు. బ్యాటింగ్లో దూకుడు.. బౌలింగ్లో ప్రత్యర్థులను కట్టడి చేయడంలో ముందుంటున్నారు. ప్రస్తుత ఐపీఎల్లో (IPL 2023) ఇలాంటి ఆటగాళ్లు ఎవరో చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: అనుభవం ఉంటే సరిపోదు.. ఎక్కడ ఎప్పుడు దాన్ని బయటకు తీయాలో తెలియడటమే సీనియారిటీ అంటే.. ఇదేదో సినిమా డైలాగ్ను మార్చినట్లు ఉంది కదా. ఇప్పుడు చెప్పబోయే ప్లేయర్ల గురించి ఈ మాత్రం పరిచయం అవసరమే మరి. ఎందుకంటే వారంతా టీమ్ఇండియా తరఫున ఆడిన వెటరన్ ఆటగాళ్లు. వయసు పెరగడం, ఫామ్ కోల్పోవడం, కుర్రాళ్ల నుంచి పోటీ ఎక్కువ కావడంతో జాతీయ జట్టు నుంచి వైదొలగాల్సిన పరిస్థితి. తాజాగా ఐపీఎల్లో (IPL 2023) మాత్రం యువ క్రికెటర్లతో పోటీ పడి మరీ తమ సత్తా ఏంటో అభిమానులకు చూపిస్తున్నారు.
- అజింక్య రహానె (Rahane): ప్రస్తుత సీజన్లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని చెలరేగిపోతున్న సీనియర్ బ్యాటర్లలో అజింక్య రహానె ముందుంటాడు. సీఎస్కే తరఫున 9 మ్యాచ్లు ఆడిన రహానె 181.48 స్ట్రైక్రేట్తో 245 పరుగులు చేశాడు. సీఎస్కే నుంచి పరుగుల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. స్ట్రైక్రేట్లో మాత్రం అతడే టాప్. ‘ఆటను ఎంజాయ్ చేయడం వల్లే ఇలా ఆడుతున్నా’ అని ఒకానొక సందర్భంలో రహానె చెప్పాడు. ఐపీఎల్ ప్రదర్శనతో జాతీయ జట్టులోకి రహానెకు పిలుపు రావడం విశేషం. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడే అవకాశం వచ్చింది.
- వృద్ధిమాన్ సాహా (Saha): గత రెండేళ్లుగా జాతీయ జట్టులోకి అప్పుడప్పుడు వస్తున్నా.. అవకాశం మాత్రం దక్కలేదు. కానీ, గత సీజన్ నుంచి గుజరాత్ టైటాన్స్కు ఆడుతున్న సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా పవర్ప్లేలో భారీ హిట్టింగ్తో రెచ్చిపోయాడు. గత సీజన్లో గుజరాత్ టైటిల్ నెగ్గడంలో కీలక పాత్ర పోషించిన సాహా.. ఈసారి కూడా 11 మ్యాచుల్లో 273 పరుగులు చేశాడు. వికెట్ల వెనుక కూడా చురుగ్గా కదులుతూ కుర్రాళ్లకు ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో లెగ్సైడ్ వెళ్తున్న బంతిని పట్టుకున్న తీరు అమోఘం.
- పీయూశ్ చావ్లా (Piyush Chawla): ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ ఎవరో తెలుసా..? పీయూశ్ చావ్లా. అవునండీ 10 మ్యాచుల్లో 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులోనూ నిలిచాడు. ముంబయి బౌలర్ల యావరేజ్(16.47)లో కూడా చావ్లాదే తక్కువ. టీమ్ఇండియా తరఫున చివరి సారిగా 2012లో ఆడిన చావ్లా.. ఆ తర్వాత లీగ్లకే పరిమితం కావడం గమనార్హం. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ -5లో కూడా పీయూశ్ చోటు సంపాదించాడు. ఇప్పటి వరకు 175 మ్యాచ్లు ఆడిన చావ్లా 174 వికెట్లు తీశాడు. 34 ఏళ్ల చావ్లాకు అంతర్జాతీయ మ్యాచుల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. అనిల్ కుంబ్లే తరహాలో లెగ్ స్పిన్ బౌలింగ్లో కీలకంగా మారతాడని ఆశించినా ప్రయోజనం లేకుండా పోయింది.
- ఇషాంత్ శర్మ (Ishant Sharma): యువ ఫాస్ట్ బౌలర్లు జట్టులోకి వస్తుండటంతో ఇషాంత్కు అవకాశాలు తగ్గిపోయాయి. చివరిసారిగా భారత్ జట్టు తరఫున 2021లో డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇషాంత్ శర్మ ఆడాడు. ఈసారి ఐపీఎల్లోనూ ఆరంభంలో ఇషాంత్కు అవకాశాలు రాలేదు. అయితే, వచ్చిన ఛాన్స్లను మాత్రం సద్వినియోగం చేసుకున్నాడు. ఆడిన ఐదు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీశాడు. గుజరాత్పై రెండు వికెట్లు తీసి దిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. రాహుల్ తెవాతియా, హార్దిక్ వంటి హిట్టర్లు ఉన్నా కేవలం 6 పరుగులే ఇచ్చాడు. తర్వాత బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనూ వికెట్లు తీయకపోయినా పరుగులను నియంత్రించాడు.
- అమిత్ మిశ్రా (Amit Sharma): 40 ఏళ్ల అమిత్ మిశ్రా ఇప్పటికీ తన వైవిధ్యభరిత స్పిన్తో ప్రత్యర్థులను మెలికలు తిప్పిస్తున్నాడు. రవి బిష్ణోయ్, కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్ వంటి స్పిన్నర్లు ఉన్నా అమిత్ మిశ్రాకూ అవకాశాలు దక్కడం మాత్రం అతడి సత్తా ఏంటో తెలియజేస్తోంది. టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాలను నిలబెట్టుకుంటూ కీలక సమయాల్లో వికెట్లూ పడగొట్టాడు. ఈ సీజన్లో ఆరు మ్యాచులకుగాను ఆరు వికెట్లు తీశాడు.
- మోహిత్ శర్మ (Mohit Sharma): ఎక్కడ కోల్పోయాడో.. అక్కడే రాబట్టుకున్నాడు 34 ఏళ్ల మోహిత్ శర్మ. అత్యధికంగా వికెట్లు తీసిన బౌలర్కు ఇచ్చే పర్పుల్ క్యాప్ను 2014 సీజన్లోనే సొంతం చేసుకున్న మోహిత్ శర్మ ఆ తర్వాత కెరీర్లో నిలదొక్కుకోవడానికి చాలా శ్రమించాడు. గాయాలు, ఫామ్తో ఇబ్బంది పడిన మోహిత్ 2015 నుంచి 2020వ సీజన్ వరకు ఫ్రాంచైజీలు మారాడు. అయినా, ఆయా ఫ్రాంచైజీల తరఫున ఒక్కో మ్యాచ్ మాత్రమే ఆడాడు. అయితే, గత రెండు సీజన్లలోనూ ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడం గమనార్హం. దీంతో హరియాణా తరఫున దేశవాళీ క్రికెట్లో ఆడమని గుజరాత్ టైటాన్స్ కోచ్ ఆశిశ్ నెహ్రా సూచించడంతో అటువైపు వెళ్లాడు. గతేడాది మోహిత్ను తీసుకున్న గుజరాత్ అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. కానీ, ఈసారి మాత్రం తనకు వచ్చిన ఛాన్స్ను మోహిత్ రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. క్లిష్టమైన పరిస్థితుల్లోనూ రాణిస్తూ 8 మ్యాచుల్లోనే 12 వికెట్లు తీశాడు.
- శిఖర్ ధావన్: 37 ఏళ్ల శిఖర్ ధావన్ పేరు గతేడాది వరకు మారుమోగింది. వన్డే జట్టులో కీలక పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ రోహిత్తో ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ఎప్పుడైతే సక్సెస్ అయ్యారో.. అప్పటి నుంచి ధావన్ను బీసీసీఐ కాస్త పక్కనపెట్టేసింది. ఈ క్రమంలో వచ్చిన ఐపీఎల్ సీజన్లో పంజాబ్కు సారథిగా వ్యవహరిస్తూ అదిరిపోయే ఇన్నింగ్స్లు ఆడేశాడు. ఇప్పుడా ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా ధావనే కావడం విశేషం. 7 మ్యాచుల్లో 292 పరుగులు చేసిన ధావన్ 148 స్ట్రైక్రేట్ కలిగి ఉన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్పై ఒకవైపు వికెట్లు పడుతున్నా చివరి వరకూ క్రీజ్లో ఉండి 99 పరుగులు సాధించాడు. ఇప్పటికీ తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఈ క్రమంలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్లో ధావన్కు చోటు కల్పించడంపై మేనేజ్మెంట్కు సవాల్ విసిరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్