T20 World Cup 2022: సంచలనాలు.. హోరాహోరీ పోటీలను దాటి.. పొట్టి కప్ సెమీస్లోకి ఎంట్రీ..!
టీ20 ప్రపంచకప్ చివరి దశకు చేరుకొంది. గ్రూప్ స్టేజ్ను దాటుకొని నాకౌట్ దశకు చేరింది. సెమీస్లో ఢీకొనబోయే నాలుగు జట్లేవో తేలిపోయింది. అనూహ్యంగా పాకిస్థాన్ సెమీస్ చేరుకోగా.. గ్రూప్ - 2లో అగ్రస్థానంతో భారత్ ఇంగ్లాండ్తో తలపడనుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటి వరకు ఒకెత్తు.. ఇక నుంచి పోరు మరో ఎత్తు. లీగ్ స్టేజ్లో హోరాహోరీగా మ్యాచ్లు జరిగాయి. సంచలన విజయాలు.. ఉత్కంఠభరిత పోరులు చూశాం. మధ్యమధ్యలో వరుణుడు వచ్చి మ్యాచ్లను తుడిచిపెట్టడమూ జరిగిపోయింది. ఇక నాకౌట్ దశ వచ్చేసింది.. గెలిస్తే ముందుకు.. ఓడితే ఇంటికి వెళ్లి పోయే పరిస్థితి.
అనుకొన్నదొకటి.. అయిందొకటి అన్నట్లు.. సెమీస్లోకి దూసుకొస్తామని భావించిన టీమ్లు ఇంటిముఖం పట్టాయి. ఆశలు సన్నగిల్లిన సమయంలోనూ పుంజుకొని అనూహ్యంగా సెమీఫైనల్ బెర్తులను దక్కించుకొన్న జట్లూ ఉన్నాయి. మరి సెమీస్ పోరుకు చేరిన జట్ల మధ్య పోటీ ఎలా ఉండనుందో..? ఓసారి అంచనా వేద్దాం..
ఐసీసీ మెగా టోర్నీలు అంటేనే దక్షిణాఫ్రికా జట్టుకు కలిసిరావేమో.. వరుసగా రెండు విజయాలు సాధించి సెమీస్కు వెళ్లే తొలి జట్టుగా అవతరిస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా దక్షిణాఫ్రికా ఇంటిముఖం పట్టి.. పాకిస్థాన్కు దారి కల్పించింది. అలాగే ఆతిథ్య దేశం, డిఫెండింగ్ ఛాంపియన్ ఆసీస్కు భంగపాటు తప్పలేదు. వర్షం వల్ల ఇంగ్లాండ్తో జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడం కూడానూ ఆసీస్పై ప్రభావం పడింది. టీ20 ప్రపంచకప్ సూపర్ -12 దశలో భారత్ అత్యధికంగా నాలుగు విజయాలు, ఒక ఓటమితో 8 పాయింట్లు సాధించిన టీమ్గా సెమీస్కు చేరుకొంది. ప్రస్తుతం సెమీస్కు చేరిన నాలుగు జట్లలో టీమ్ఇండియానే టాప్. న్యూజిలాండ్ (7) మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దు.. ఇంగ్లాండ్ (7) మూడు విజయాలు, ఒక ఓటమి, ఒక రద్దు.. పాకిస్థాన్ (6) మూడు విజయాలు, రెండు ఓటములు నమోదు చేశాయి.
తొలి సెమీస్..
ప్రస్తుత టీ20 ప్రపంచకప్లో ఆశ్చర్యపరిచే అంశం పాకిస్థాన్ సెమీస్కు చేరుకోవడం. ఆ దేశ అభిమానులకే కాకుండా మాజీలకు కూడా నమ్మకాలు సన్నగిల్లిన వేళ.. అదృష్టం కలిసొచ్చి నాకౌట్ దశకు చేరుకొంది. గ్రూప్ - 1లో అగ్రస్థానంలో నిలిచిన న్యూజిలాండ్తో తొలి సెమీస్ పోరులో (నవంబర్ 9న) తలపడనుంది. అయితే పాకిస్థాన్ను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. సూపర్ -12 దశలో తొలి రెండు మ్యాచ్లను ఓడిన పాక్.. కీలక సమయంలో రాణించి విజయాలు నమోదు చేసింది. అయితే దాయాది దేశం కీలక పేసర్ షహీన్ షా అఫ్రిది ఎట్టకేలకు ఫామ్లోకి దూసుకొచ్చాడు. అలాగే హారిస్ రవుఫ్, షాదాబ్ ఖాన్, నవాజ్ గత ప్రదర్శనను పునరావృతం చేస్తే మాత్రం పాక్కు తిరుగుండదు. అయితే కివీస్ చాపకింద నీరులా ఎలాంటి హడావుడి లేకుండా సెమీస్కు దూసుకొచ్చింది. ప్రస్తుత ప్రపంచకప్లో సెంచరీలు సాధించిన ఇద్దరు బ్యాటర్లలో ఒకరు కివీస్ ఆటగాడే (గ్లెన్ ఫిలిప్స్) మరొకరు శతకానికి సమీపంగా (డేవన్ కాన్వే) రావడం గమనార్హం. పొట్టి కప్ 2022 తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్కు కివీస్ చుక్కలు చూపించింది. ఇప్పటివరకు బ్యాటర్లు, బౌలర్లు సమష్టిగా రాణిస్తూ విజయాలు సాధించిన న్యూజిలాండ్కు నాకౌట్ దశ పెద్దగా అచ్చిరాదు. గత వన్డే ప్రపంచకప్లో ఫైనల్కు దూసుకెళ్లినప్పటికీ.. అదృష్టం కలిసిరాక ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైన విషయం తెలిసిందే. తాజాగా కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఫామ్లోకి రావడం మాత్రం ఆ జట్టుకు అతిపెద్ద సానుకూలాంశం.
భారత్-ఇంగ్లాండ్ పోరు..
ఎప్పుడో పదిహేనేళ్ల కిందట అరంగేట్ర పొట్టి టోర్నీ టైటిల్ను నెగ్గిన టీమ్ఇండియా మళ్లీ విజేతగా నిలవలేదు. 2014లో ఒక్కసారి మాత్రం ఫైనల్ వరకు వచ్చి లంక చేతిలో ఓటమిపాలైంది. గత ప్రపంచకప్లో భారీ ఆశలతో బరిలోకి దిగినా గ్రూప్ స్టేజ్కే పరిమితమైంది. అయితే ఇప్పుడు క్లిష్టమైన పరిస్థితుల్లోనూ విజయాలు నమోదు చేసి సెమీస్కు వచ్చింది. అయితే ఇక్కడే కఠిన పరీక్ష ఎదురుకానుంది. నవంబర్ 10న ఇంగ్లాండ్తో భారత్ ఢీకొట్టనుంది. టీమ్ఇండియాలోని ఆటగాళ్ల సంగతి తెలిసిందే. విరాట్, సూర్యకుమార్కు తోడు కేఎల్ రాహుల్ ఫామ్లోకి వచ్చేశాడు. అయితే కెప్టెన్ రోహిత్ కూడా బ్యాట్ను ఝులిపిస్తే బ్యాటింగ్లో భారత్ను ఆపడం ఎవరి తరమూ కాదు. కానీ భీకర ఆటగాళ్లు ఉన్న ఇంగ్లాండ్ను అడ్డుకోవడం సులువైన విషయం కాదు. అలెక్స్ హేల్స్, బట్లర్, లియామ్ లివింగ్స్టోన్, బెన్ స్టోక్స్, డేవిడ్ మలన్, మొయిన్ అలీ, సామ్ కరన్ వంటి హార్డ్ హిట్టర్లు ఆ జట్టు సొంతం. అలాగే పేస్ బౌలింగ్లో అత్యంత స్పీడెస్టర్గా మారిన మార్క్ వుడ్ చెలరేగుతున్నాడు. అతడికి సహకారంగా క్రిస్ వోక్స్, సామ్ కరన్, అదిల్ రషీద్ వంటి బౌలర్లు ప్రత్యర్థులను వణికించారు. నాకౌట్ దశలో ఇంగ్లాండ్ తక్కువగా అంచనా వేయొద్దని క్రీడా విశ్లేషకులు హెచ్చరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్