Shah Rukh Khan: షారుక్ ఖాన్ ఐపీఎల్ ఫైనల్కు వచ్చేస్తాడు: జూహీ చావ్లా
కోల్కతా ఓనర్ షారుక్ ఖాన్ డీహైడ్రేషన్కు గురైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపై తాజాగా సహ యజమాని జూహీ చావ్లా స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: బాలీవుడ్ నటుడు, కోల్కతా నైట్రైడర్స్ ఓనర్ షారుక్ ఖాన్ (Sharukh Khan) అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో (మే 21న) హైదరాబాద్పై కేకేఆర్ గెలిచింది. ఆ సందర్భంగా షారుక్ ఆటగాళ్లతో అహ్మదాబాద్ మైదానంలో సందడి చేశాడు. అయితే, ఆ సమయంలో అస్వస్థతకు గురి కావడంతో ఆసుప్రతికి తరలించారు. డీహైడ్రేషన్, అధిక వేడి కారణంగా ఇబ్బంది పడ్డాడు. ఈ క్రమంలో అతడి ఆరోగ్య పరిస్థితిపై కేకేఆర్ సహ యజమాని జూహీ చావ్లా కీలక సమాచారం అందించారు. ‘‘ఆసుప్రతిలో చేరినప్పుడు షారుక్ కాస్త ఇబ్బందిగా ఉన్నాడు. నిన్న సాయంత్రానికి ఆరోగ్యం మెరుగైంది. దేవుడి దయ వల్ల త్వరగా కోలుకుంటున్నాడు. కోల్కతాను ప్రోత్సహించేందుకు తప్పకుండా ఐపీఎల్ ఫైనల్కు వస్తాడు’’ అని చావ్లా తెలిపారు.
వైద్యులు ఏమన్నారంటే?
‘‘బాలీవుడ్ నటుడు షారుక్ డీహైడ్రేషన్ కారణంగా ఇబ్బంది పడ్డారు. అహ్మదాబాద్లో 45+ డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వైద్యుల పర్యవేక్షణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఆసుపత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశాం’’ అని వైద్య వర్గాలు వెల్లడించాయి. మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే కోల్కతా తుది పోరుకు దూసుకెళ్లింది. శుక్రవారం జరగనున్న రెండో క్వాలిఫయర్లో విజేతగా నిలిచే జట్టుతో కేకేఆర్ టైటిల్ కోసం తలపడనుంది.
అనారోగ్యంతో బాధపడుతూనే..
తొలి క్వాలిఫయర్ మ్యాచ్ అనంతరం నీరసంగా ఉన్న షారుక్ ఆసుపత్రికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఆ సమయంలో ఓ దివ్యాంగ అభిమాని ఎదురుగా వచ్చాడు. అతడిని నిరుత్సాహపరచడం ఇష్టంలేని ఎస్ఆర్కే ఆప్యాయంగా మాట్లాడి ఫొటో దిగాడు. అప్పుడు షారుక్ అలసటగానే కనిపించాడు. దీంతో బాలీవుడ్ స్టార్పై నెట్టింట ప్రశంసలు వచ్చాయి. సూపర్ స్టార్ను పొగడ్తలతో ముంచెత్తించారు. ఆ వీడియో కూడా వైరల్గా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం