Asian Games: ఆసియా క్రీడలకు జట్టు.. ధావన్ నాయకత్వంలోని టీమ్ఇండియా ఇదేనా..?
ఆసియా క్రీడల్లోనూ భారత క్రికెట్ను (Team India) వీక్షించేందుకు అవకాశం దొరకనుంది. టీమ్ఇండియాకు కెప్టెన్ శిఖర్ ధావన్ వ్యవహరిస్తాడనే వార్తలు జోరుగా సాగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులకు ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్ టోర్నీలకు మధ్య ఉన్న స్వల్ప వ్యవధిలోనూ భారత మ్యాచ్లను వీక్షించే అవకాశం రాబోతోంది. ఆసియా క్రీడల్లో (Asian Games) పాల్గొనేందుకు బీసీసీఐ అంగీకరించడంతో భారత జట్టు (Team India) పాల్గొనేందుకు మార్గం సుగమమయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జౌలో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారత జట్టుకు శిఖర్ ధావన్ నాయకత్వం వహిస్తాడని, ఎన్సీఏ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్ కోచింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, బీసీసీఐ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ జట్టులో ఎవరు ఉంటారు? అనేది అభిమానుల్లో మెదిలే ప్రశ్న. మరి స్క్వాడ్ ఎలా ఉండనుందో ఓసారి అంచనా వేద్దాం..
వన్డే ప్రపంచ కప్, ఆసియా కప్ టోర్నీలకు జట్టు ఎంపిక ఇంకా చేయలేదు. సీనియర్లకే స్క్వాడ్లోకి తీసుకొనే అవకాశం ఉంది. ఆసియా క్రీడలకు కెప్టెన్గా ధావన్ను ఉంచుతారంటేనే అతడికి వరల్డ్ కప్, ఆసియా కప్ వంటి టోర్నీల్లో ఆడించే అవకాశం లేదని అర్థం. దీంతో ఆసియా క్రీడల్లో ధావన్ ఓపెనర్గా వస్తాడు. అతడికి జోడీగా యశస్వి జైస్వాల్ లేదా రుతురాజ్ గైక్వాడ్ ఖాయం.
మిడిల్.. ఆల్రౌండర్లు అదుర్స్
కీలకమైన మిడిల్ ఆర్డర్లో యువ ఆటగాళ్లకు కొదవేంలేదు. ఐపీఎల్లో తమ సత్తా చాటి జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురు చూస్తున్న ప్లేయర్లు చాలా మంది. అందులో ముందు వరుసలో మాత్రం నితీశ్ రాణా, తిలక్వర్మ, రింకు సింగ్, దీపక్ హుడా, జితేశ్ శర్మ, ప్రభ్ సిమ్రన్ సింగ్ ముందుంటారు. ఆల్రౌండర్ల జాబితాలో వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య ఉండనే ఉన్నారు. దీపక్ హుడా కూడా పార్ట్టైమ్ బౌలర్ కావడం అదనపు బలం. స్పెషలిస్ట్ స్పిన్నర్ జాబితాలో యువ ఆటగాడు రవి బిష్ణోయ్ టాప్లో ఉన్నాడు. అలాగే సీనియర్ కుల్దీప్ యాదవ్ కూడా పరిగణలోకి ఉండటం విశేషం.
పేసర్లు ఫుల్..
భారత రిజర్వ్బెంచ్ పటిష్ఠంగా ఉందనడానికి ఇదొక కారణం. బుమ్రా, షమీ, సిరాజ్, జయ్దేవ్ ఉనద్కత్, ఉమేశ్.. ఇలా సీనియర్లు ఉన్నప్పటికీ తమ అవకాశం కోసం యువ పేసర్లు ఎదురు చూస్తూ ఉన్నారు. గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగిన ప్రసిధ్ కృష్ణ కోలుకుని జట్టులోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్, ఉమ్రాన్ ఖాన్ భారత్ తరఫునా అదరగొట్టారు. దీపక్ చాహర్ నాయకత్వంలోని పేస్ దళం ఆసియా గేమ్స్ బరిలోకి దిగినా ఆశ్చర్యం లేదు. అయితే, వీరిలో కొందరు ఆసియా కప్, వన్డే ప్రపంచకప్ టోర్నీలకు ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు.
భారత్ స్క్వాడ్ (అంచనా):
శిఖర్ ధావన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, నితీశ్ రాణా, రింకు సింగ్, దీపక్ హుడా, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), ప్రభ్ సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్ ఉమ్రాన్ మాలిక్, ప్రసిధ్ కృష్ణ, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
T20 jersey: టీ20 ప్రపంచకప్ టోర్నీకి టీమ్ఇండియా జెర్సీల ధరను అడిడాస్ ప్రకటించింది. -
Team India: పాక్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమ్ఇండియా వెళ్తుందా? బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది ఫిబ్రవరి- మార్చి మధ్య జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)కి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వనుంది. పాక్లో టీమ్ఇండియా పర్యటిస్తుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
సరదా సరదాగానే సిక్స్లు బాదేస్తాడు.. అదే స్పిన్ బౌలింగ్లోనైతే..: రవిశాస్త్రి
టీమ్ఇండియా బ్యాటర్ శివమ్ దూబె (Shivam Dube)పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో పవర్ఫుల్ హిట్టింగ్తో అలరిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
రోహిత్ శర్మను వరల్డ్ కప్ ట్రోఫీతో చూడాలని ఉంది: యువరాజ్ సింగ్
వచ్చే టీ20 ప్రపంచకప్నకు రోహిత్ శర్మ భారత జట్టులో ఉండటం ఎంతో కీలకమని టీమ్ఇండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. -
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేస్తున్న ముంబయి ఇండియన్స్.. సోమవారం సన్రైజర్స్ హైదరాబాద్పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడాడు. -
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
ధోనీ లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్కు రావడం వెనుక బలమైన కారణం ఉంది. అదేంటో తెలిస్తే.. సీఎస్కే విషయంలో అతడు ఎంత అంకితభావంతో ఉన్నాడో అర్థమవుతుంది. -
రెండుసార్లు విమానం దారి మళ్లింపు.. కోల్కతా ఆటగాళ్లకు తప్పని తిప్పలు
కోల్కతా నైట్రైడర్స్ (Kolkata Knight Riders) ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ విమానాన్ని ప్రతికూల వాతావరణం కారణంగా రెండుసార్లు దారి మళ్లించారు. -
సన్రైజర్స్పై సూర్యప్రతాపం
ఐపీఎల్-17లో 11 మ్యాచ్లాడి ఎనిమిది ఓడి ఇప్పటికే దాదాపుగా ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించిన ముంబయి ఇండియన్స్.. ఇప్పుడు వేరే జట్ల అవకాశాలను దెబ్బ తీసే పనిలో పడింది. ముందుగా ఆ జట్టు సన్రైజర్స్ హైదరాబాద్కు ఝలక్ ఇచ్చింది. -
‘లక్ష్య’ జ్యోతిక అదుర్స్
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే పోటీలు. ఒలింపిక్స్లో అర్హత సాధించడానికి భారత్కు ఇదే చివరి అవకాశం. తీవ్ర ఒత్తిడిలో బరిలో దిగింది మహిళల జట్టు. ఆరంభంలో పోటీ చూస్తే ఒలింపిక్స్కు అర్హత కష్టమే అనిపించింది. అయితే.. రెండో లెగ్లో బ్యాటన్ అందుకున్న తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ కథ మార్చేసింది. -
ఇది హైబ్రిడ్ రకం!
హైబ్రిడ్ కూరగాయలు, హైబ్రిడ్ పండ్ల గురించి వింటుంటాం.. చూస్తుంటాం! కానీ ఇప్పుడు ‘హైబ్రిడ్ పిచ్’ అనే కొత్త మాట తెరపైకి వచ్చింది. పిచ్లో హైబ్రిడ్ ఏంటి..? అని ఆశ్చర్యం కలుగుతోందా? అదే విశేషం. -
43 ఏళ్ల వయసులో.. పొట్టి కప్పులో
అత్యంత పెద్ద వయసులో టీ20 ప్రపంచకప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్స్పిన్నర్ ఫ్రాంక్ సుబుగా రికార్డు సృష్టించనున్నాడు. టోర్నీ కోసం సోమవారం ఉగాండా క్రికెట్ సంఘం ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో 43 ఏళ్ల సుబుగాకు చోటు దక్కింది. -
టీమ్ఇండియా టీ20 ప్రపంచకప్ జెర్సీ ఇదే
టీ20 ప్రపంచకప్ కోసం టీమ్ఇండియా అధికారిక టీ20 జెర్సీని బీసీసీఐ సోమవారం ఆవిష్కరించింది. జెర్సీ నీలం, నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. -
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో మరో ఇద్దరు అధికారులపై బదిలీ వేటు
-
25వేల ఉద్యోగాల రద్దు.. స్టే విధించిన సుప్రీంకోర్టు
-
ఒక్క రోజులో రూ.800 కోట్ల నష్టం.. ఝున్ఝున్వాలా కుటుంబానికి టైటాన్ షాక్..!
-
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షం.. పిడుగుపాటుకు ఇద్దరి మృతి
-
టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా జెర్సీ ధరెంతో తెలుసా?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్