Shivam Dube: హార్దిక్కు దూబె ఎసరు! టీ20 ప్రపంచకప్కు శివమ్
గాయాలతో జట్టుకు హార్దిక్ పాండ్య టీమ్ఇండియాకు దూరమై వేళ మరో పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబె నిలకడగా రాణిస్తూ 2024 టీ20 ప్రపంచకప్ రేసులోకి దూసుకొచ్చాడు.
టీమ్ఇండియా వెతుకుతున్న ఆల్రౌండర్ దొరికాడా? గాయాలతో జట్టుకు దూరమైన హార్దిక్ (Hardik Pandya)ను రీప్లేస్ చేసే ఆల్రౌండర్ వచ్చాడా? ఈ ఏడాది పొట్టి కప్పులో భారత జట్టు ఆల్రౌండర్ పాత్రను పోషించేది అతనేనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. హార్దిక్ స్థానానికి ఎసరు పెట్టేలా.. జట్టుకు ఉత్సాహాన్ని అందించేలా మరో పేస్ ఆల్రౌండర్ వచ్చాడు. అఫ్గానిస్థాన్తో సిరీస్లో అదరగొడుతున్నాడు. అతనే శివమ్ దూబె (Shivam Dube). జట్టులో పాతుకుపోయేలా అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతున్నాడు.
ఆ మెరుపులతో..
శివమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నాలుగేళ్లు గడిచిపోయాయి. కానీ హార్దిక్ రూపంలో ఉత్తమ ఆల్రౌండర్ జట్టులో ఉండటంతో శివమ్కు తగినన్ని అవకాశాలు రాలేవనే చెప్పాలి. ఆడిన మ్యాచ్ల్లోనూ దూబె ప్రదర్శన మెరుగ్గానే ఉంది. 2019లోనే భారత జట్టులోకి వచ్చిన అతను 20 టీ20ల్లో 13 ఇన్నింగ్స్ల్లో 275 పరుగులు చేశాడు. అతని సగటు 45.83 ఉండటం విశేషం. పేస్ బౌలింగ్తో 8 వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ ఆడిన ఏకైక వన్డేలో 9 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో శివమ్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. అతను మూడు అర్ధశతకాలు కూడా చేశాడు. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్థాన్తో సిరీస్లో మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. గాయంతో హార్దిక్ దూరం కావడంతో దొరికిన అవకాశాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ అర్ధశతకాలు చేసి భారత్ సిరీస్ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్ కోల్పోకూడదనే పట్టుదలతో సాగుతున్న అతను వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ అజేయంగా నిలిచి మ్యాచ్ ముగించడం విశేషం. ముఖ్యంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో అతను కనిపిస్తుండటం మరింత సానుకూలాంశం.
క్రీజులో నిటారుగా నిలబడి.. బంతిని కచ్చితంగా అంచనా వేసి, అలవోకగా భారీ షాట్లు ఆడేస్తున్నాడు. ఒత్తిడిని చిత్తుచేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై అతను ఆధిపత్యం చలాయిస్తున్నాడు. అఫ్గానిస్థాన్ పేరుకు చిన్నజట్టే కావొచ్చు, కానీ ఇందులో నాణ్యమైన బౌలర్లున్నారు. పోరాట పటిమకు మారుపేరుగా మారిన ఆ జట్టును ఎదుర్కోవడంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ దూబె మాత్రం తన మెరుపులతో జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు. ఇక పేస్ బౌలింగ్తోనూ ఆకట్టుకుంటున్నాడు. రెండు మ్యాచ్ల్లో ఒక్కో వికెట్ పడగొట్టాడు. విరాట్, యువరాజ్ తర్వాత ఒకటి కంటే రెండు మ్యాచ్ల్లో అర్ధశతకం చేయడంతో పాటు ఒక వికెట్ పడగొట్టిన మూడో భారత ఆటగాడిగా దూబె నిలిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయడం, వికెట్లు పడగొట్టడం, బ్యాటింగ్లో ధనాధన్ షాట్లతో చెలరేగడం.. జట్టు కోరుకుంటున్న ఆల్రౌండర్కు ఉండాల్సిన నైపుణ్యాలివే. ఇప్పుడు దూబెలో అవి కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ కీలకం..
ప్రస్తుతం అఫ్గానిస్థాన్తో సిరీస్లో అదరగొడుతున్నా.. టీ20 ప్రపంచకప్ జట్టులో దూబెకు చోటు ఖాయమని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గాయం నుంచి కోలుకుని హార్దిక్ వస్తే అప్పుడు దూబెను దూరం పెట్టే అవకాశముంది. అలా జరగకుండా ఉండాలన్నా, ప్రపంచకప్కు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాలన్నా దూబెకు వచ్చే ఐపీఎల్ ఎంతో కీలకం. 2019 ఐపీఎల్కు వేలానికి ముందు బరోడాతో రంజీ మ్యాచ్లో ముంబయి తరపున అయిదు బంతులకు అయిదు సిక్సర్లు బాదడంతో దూబె వెలుగులోకి వచ్చాడు. దీంతో వేలంలో రూ.5 కోట్లకు అతణ్ని ఆర్సీబీ సొంతం చేసుకుంది. 2019, 2020 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన అతను ఆ తర్వాత రాజస్థాన్ జట్టులోకి వెళ్లాడు. 2022 మెగా వేలంలో రూ.4 కోట్లకు అతణ్ని సీఎస్కే దక్కించుకోవడంతో దూబె దశ తిరిగిందనే చెప్పాలి. నిరుడు ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 418 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు రాబోయే సీజన్లోనూ బ్యాట్తో ఇలాగే రాణించి, బంతితోనూ సత్తాచాటితే దూబె కచ్చితంగా ప్రపంచకప్కు వెళ్లే జట్టుతో పాటు విమానం ఎక్కుతాడు. దూబె ఇదే జోరు కొనసాగిస్తే హార్దిక్కు ఎసరు తప్పదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా పోటీ మంచిదే కదా. ఇది అంతిమంగా జట్టుకే మేలు కలిగిస్తుంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!