Shivam Dube: హార్దిక్కు దూబె ఎసరు! టీ20 ప్రపంచకప్కు శివమ్
గాయాలతో జట్టుకు హార్దిక్ పాండ్య టీమ్ఇండియాకు దూరమై వేళ మరో పేస్ ఆల్రౌండర్ శివమ్ దూబె నిలకడగా రాణిస్తూ 2024 టీ20 ప్రపంచకప్ రేసులోకి దూసుకొచ్చాడు.
టీమ్ఇండియా వెతుకుతున్న ఆల్రౌండర్ దొరికాడా? గాయాలతో జట్టుకు దూరమైన హార్దిక్ (Hardik Pandya)ను రీప్లేస్ చేసే ఆల్రౌండర్ వచ్చాడా? ఈ ఏడాది పొట్టి కప్పులో భారత జట్టు ఆల్రౌండర్ పాత్రను పోషించేది అతనేనా? అనే ప్రశ్నలకు సమాధానం దొరికింది. హార్దిక్ స్థానానికి ఎసరు పెట్టేలా.. జట్టుకు ఉత్సాహాన్ని అందించేలా మరో పేస్ ఆల్రౌండర్ వచ్చాడు. అఫ్గానిస్థాన్తో సిరీస్లో అదరగొడుతున్నాడు. అతనే శివమ్ దూబె (Shivam Dube). జట్టులో పాతుకుపోయేలా అత్యుత్తమ ప్రదర్శనతో సాగుతున్నాడు.
ఆ మెరుపులతో..
శివమ్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నాలుగేళ్లు గడిచిపోయాయి. కానీ హార్దిక్ రూపంలో ఉత్తమ ఆల్రౌండర్ జట్టులో ఉండటంతో శివమ్కు తగినన్ని అవకాశాలు రాలేవనే చెప్పాలి. ఆడిన మ్యాచ్ల్లోనూ దూబె ప్రదర్శన మెరుగ్గానే ఉంది. 2019లోనే భారత జట్టులోకి వచ్చిన అతను 20 టీ20ల్లో 13 ఇన్నింగ్స్ల్లో 275 పరుగులు చేశాడు. అతని సగటు 45.83 ఉండటం విశేషం. పేస్ బౌలింగ్తో 8 వికెట్లు కూడా ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకూ ఆడిన ఏకైక వన్డేలో 9 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్లో శివమ్ ప్రదర్శన మెరుగ్గా ఉంది. అతను మూడు అర్ధశతకాలు కూడా చేశాడు. ఇప్పుడు తాజాగా అఫ్గానిస్థాన్తో సిరీస్లో మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. గాయంతో హార్దిక్ దూరం కావడంతో దొరికిన అవకాశాన్ని అతను రెండు చేతులా అందిపుచ్చుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ అర్ధశతకాలు చేసి భారత్ సిరీస్ సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. వికెట్ కోల్పోకూడదనే పట్టుదలతో సాగుతున్న అతను వరుసగా రెండు మ్యాచ్ల్లోనూ అజేయంగా నిలిచి మ్యాచ్ ముగించడం విశేషం. ముఖ్యంగా ఎంతో ఆత్మవిశ్వాసంతో అతను కనిపిస్తుండటం మరింత సానుకూలాంశం.
క్రీజులో నిటారుగా నిలబడి.. బంతిని కచ్చితంగా అంచనా వేసి, అలవోకగా భారీ షాట్లు ఆడేస్తున్నాడు. ఒత్తిడిని చిత్తుచేస్తూ ప్రత్యర్థి బౌలర్లపై అతను ఆధిపత్యం చలాయిస్తున్నాడు. అఫ్గానిస్థాన్ పేరుకు చిన్నజట్టే కావొచ్చు, కానీ ఇందులో నాణ్యమైన బౌలర్లున్నారు. పోరాట పటిమకు మారుపేరుగా మారిన ఆ జట్టును ఎదుర్కోవడంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. కానీ దూబె మాత్రం తన మెరుపులతో జట్టుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాడు. ఇక పేస్ బౌలింగ్తోనూ ఆకట్టుకుంటున్నాడు. రెండు మ్యాచ్ల్లో ఒక్కో వికెట్ పడగొట్టాడు. విరాట్, యువరాజ్ తర్వాత ఒకటి కంటే రెండు మ్యాచ్ల్లో అర్ధశతకం చేయడంతో పాటు ఒక వికెట్ పడగొట్టిన మూడో భారత ఆటగాడిగా దూబె నిలిచాడు. నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేయడం, వికెట్లు పడగొట్టడం, బ్యాటింగ్లో ధనాధన్ షాట్లతో చెలరేగడం.. జట్టు కోరుకుంటున్న ఆల్రౌండర్కు ఉండాల్సిన నైపుణ్యాలివే. ఇప్పుడు దూబెలో అవి కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ కీలకం..
ప్రస్తుతం అఫ్గానిస్థాన్తో సిరీస్లో అదరగొడుతున్నా.. టీ20 ప్రపంచకప్ జట్టులో దూబెకు చోటు ఖాయమని ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే గాయం నుంచి కోలుకుని హార్దిక్ వస్తే అప్పుడు దూబెను దూరం పెట్టే అవకాశముంది. అలా జరగకుండా ఉండాలన్నా, ప్రపంచకప్కు తనను ఎంపిక చేయక తప్పని పరిస్థితి కల్పించాలన్నా దూబెకు వచ్చే ఐపీఎల్ ఎంతో కీలకం. 2019 ఐపీఎల్కు వేలానికి ముందు బరోడాతో రంజీ మ్యాచ్లో ముంబయి తరపున అయిదు బంతులకు అయిదు సిక్సర్లు బాదడంతో దూబె వెలుగులోకి వచ్చాడు. దీంతో వేలంలో రూ.5 కోట్లకు అతణ్ని ఆర్సీబీ సొంతం చేసుకుంది. 2019, 2020 సీజన్లలో ఆర్సీబీకి ఆడిన అతను ఆ తర్వాత రాజస్థాన్ జట్టులోకి వెళ్లాడు. 2022 మెగా వేలంలో రూ.4 కోట్లకు అతణ్ని సీఎస్కే దక్కించుకోవడంతో దూబె దశ తిరిగిందనే చెప్పాలి. నిరుడు ఐపీఎల్లో 16 మ్యాచ్ల్లో 418 పరుగులతో సత్తాచాటాడు. ఇప్పుడు రాబోయే సీజన్లోనూ బ్యాట్తో ఇలాగే రాణించి, బంతితోనూ సత్తాచాటితే దూబె కచ్చితంగా ప్రపంచకప్కు వెళ్లే జట్టుతో పాటు విమానం ఎక్కుతాడు. దూబె ఇదే జోరు కొనసాగిస్తే హార్దిక్కు ఎసరు తప్పదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయినా పోటీ మంచిదే కదా. ఇది అంతిమంగా జట్టుకే మేలు కలిగిస్తుంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు