Shoaib Akhtar: భారత్,పాక్ మ్యాచ్ గురించి మరోసారి ప్రస్తావించిన షోయబ్ అక్తర్.. కారణమేంటంటే
భారత్, పాక్ మ్యాచ్ని ఏ దేశంలో నిర్వహించినా అక్కడి స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయి. ఇండియా,పాక్ మ్యాచ్లకున్నంతా క్రేజ్ మిగతా జట్లు ఆడితే ఉండదు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాక్ మ్యాచ్ని ఏ దేశంలో నిర్వహించినా అక్కడి స్టేడియాలు అభిమానులతో కిక్కిరిసిపోతాయి. ఇండియా,పాక్ మ్యాచ్లకున్నంతా క్రేజ్ మిగతా జట్లు ఆడితే ఉండదు. కొన్ని పెద్ద జట్ల మ్యాచ్లకూ ఇదే సమస్య ఎదురవుతోంది. అవును! టీ20 ప్రపంచకప్ ముగిసిన మూడు రోజుల తర్వాత ఆస్ట్రేలియాలో ఆసీస్, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైన నవంబర్ 22న ముగిసింది. ఈ మ్యాచ్లకు అభిమానుల నుంచి ఆశించినంత స్పందన రాలేదు. ప్రేక్షకులు లేక స్టేడియాలు ఖాళీగా కనిపించాయి. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి.
అయితే, ద్వైపాక్షిక సిరీస్లకు ఆదరణ తగ్గుతోందన్న చర్చ చాలా రోజుల నుంచి జరుగుతుండగా.. తాజాగా ఆసీస్, ఇంగ్లాండ్ సిరీస్తో ఇది మరింత ఊపందుకుంది. ఈ విషయంలో పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ స్పందించాడు. ద్వైపాక్షిక సిరీస్లకు ఆదరణ తగ్గుతోందని, ఈ విషయాన్ని తీవ్రంగా చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం మెల్బోర్న్లోని అడిలైడ్ వేదికగా జరిగిన భారత్, పాక్ మ్యాచ్కు అభిమానులు పోటెత్తారని గుర్తు చేశాడు.
‘తీవ్రంగా ఆలోచించాల్సిన విషయమిది. టీ20 ప్రపంచకప్ ముగిసి కొద్ది రోజులే అవుతోంది. టోర్నీలో ఇంగ్లాండ్ ఛాంపియన్గా నిలిచింది. ఈ మెగా టోర్నీ ముగిసిన మూడు రోజుల తర్వాత ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ ప్రారంభమైంది. అడిలైడ్లో జరిగిన మ్యాచ్కు అభిమానులు ఆసక్తి చూపలేదు. అయితే, ఒక నెల క్రితం ఇదే స్టేడియంలో పాక్, భారత్ మధ్య జరిగిన మ్యాచ్కు 92,000 మంది హాజరయ్యారు’ అని షోయబ్ అక్తర్ ట్వీట్ చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.