Dhoni - Sehwag: మీరు ఇలానే చేస్తే ఐపీఎల్లో ధోనీని నిషేధిస్తారు: సెహ్వాగ్ వార్నింగ్
బౌలింగ్ విభాగంలో క్రమశిక్షణ తగ్గితే మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)కి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ హెచ్చరించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్ సీజన్ (IPL 2023)లో చెన్నై సూపర్ కింగ్స్ మంచి ప్రదర్శన కనబరుస్తోంది. ఆడిన ఐదు మ్యాచ్ల్లో మూడింట నెగ్గింది. బ్యాటింగ్ విభాగంలో బలంగా ఉన్న CSK.. బౌలింగ్లో మాత్రం కాస్త బలహీనంగా ఉంది. సీఎస్కే బౌలర్లు ప్రతి మ్యాచ్లోనూ భారీగా అదనపు పరుగులు సమర్పించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎస్కే (Chennai Super Kings) బౌలర్లకు భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఎక్స్ట్రాలు ఇవ్వడం తగ్గించకపోతే.. జట్టుకు ఇబ్బందులు తప్పవని ఘాటుగా హెచ్చరించాడు.
బౌలింగ్ విభాగంలో చెన్నైకి గాయాల బెడద ఎక్కువగా ఉంది. దీపక్ చాహర్, ముఖేశ్ చౌదరి, బెన్ స్టోక్స్ గాయాలతో మ్యాచ్లకు దూరంగా ఉంటున్నారు. దీంతో పెద్దగా అనుభవం లేని తుషార్ దేశ్పాండే, ఆకాశ్ సింగ్, రాజ్యవర్ధన్ హంగార్గేకర్ వంటి బౌలర్లతో బరిలోకి దిగుతోంది. వాళ్లు వైడ్లు, నోబాల్స్ ఎక్కువగా వేస్తూ స్లో ఓవర్ రేట్కు కారణమవుతున్నారు. ఎక్స్ట్రాలు ఇవ్వడం మానుకోకపోతే.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)వార్నింగ్ ఇచ్చినా పరిస్థితిలో మార్పు కనిపించడం లేదు. సోమవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనూ చెన్నై బౌలర్లు 12 అదనపు పరుగులిచ్చారు. ఇందులో లెగ్ బైలు 6, వైడ్లు 4, నో బాల్స్ 2 ఉన్నాయి. స్లో ఓవర్ రేట్ ఇలాగే కొనసాగితే.. ధోనీపై నిషేధం విధించే పరిస్థితి వస్తుందని, అలా జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ చాలా నష్టపోతుందని సెహ్వాగ్ చెప్పాడు.
ధోనీ అసలు సంతోషంగా కనిపించడం లేదు. బౌలర్లు వైడ్లు, నోబాల్స్ తగ్గించుకోవాలని ముందే చెప్పాడు. ఆర్సీబీతోనూ ఒక ఓవర్ అదనంగా వేయాల్సి వచ్చింది. ఇదిలాగే కొనసాగితే ధోనీపై నిషేధం విధిస్తారు. ధోనీ లేకుండా చెన్నై బరిలోకి దిగాల్సిన పరిస్థితి తెచ్చుకోకూడదు. మోకాలి గాయం కారణంగా ధోనీ మరికొన్ని మ్యాచ్లే ఆడే అవకాశం కనిపిస్తోంది. అతను ఎల్లప్పుడూ పూర్తి సామర్థ్యంతో ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, బౌలర్లు ఇలాగే వైడ్లు, నోబాల్స్ వేస్తే మాత్రం ధోనీ విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది
- వీరేంద్ర సెహ్వాగ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.