IND vs AUS: నా లక్ష్యమేంటో తెలుసు.. ఆ స్థానం మాత్రం అతడిదే: శ్రేయస్ అయ్యర్
ఆస్ట్రేలియాతో మూడువన్డేల సిరీస్ను మరో మ్యాచ్ ఉండగానే భారత్ (IND vs AUS) కైవసం చేసుకుంది. ఇందౌర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించడంతో 399/5 స్కోరు సాధించింది. అనంతరం వర్షం కారణంగా ఆసీస్ టార్గెట్ను 33 ఓవర్లకు 317 పరుగులకు కుదించారు. టీమ్ఇండియా బౌలర్ల దెబ్బకు ఆసీస్ 217 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇంటర్నెట్ డెస్క్: ఫామ్తోపాటు గాయం నుంచి కోలుకున్నాడో లేదో అనే అనుమానాలకు భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (105) ఒక్క ఇన్నింగ్స్తో తెరదించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో శతకం సాధించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. దీంతో వరల్డ్ కప్ జట్టులో శ్రేయస్ (Shreyas Iyer) స్థానం సుస్థిరమైనట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శతకంతో ఫామ్ను అందిపుచ్చుకోవడంపై శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘క్రీడల్లో ఎత్తుపల్లాలతో కూడిన ప్రయాణం తప్పదు. అయితే, ఇప్పుడు ఈ సెంచరీ సాధించడం అద్భుతమనిపిస్తోంది. నాకు మద్దతుగా నిలిచిన సహచరులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. టీవీల్లో మ్యాచ్లు చూసినప్పుడు నేను కూడా ఆడితే బాగుంటుందని అనిపించేది. ఇప్పుడు భారత్ తరఫున ఆడుతున్నా. అయితే, గాయాలు ఇబ్బంది పెట్టాయి. నాపై నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నా లక్ష్యాలేంటో నాకు తెలుసు. వాటి కోసం కష్టపడుతున్నా. ఆసీస్తో మ్యాచ్లో నా ప్రణాళికలను పక్కాగా అమలు చేశా. ఏ విషయాన్నీ సంక్లిష్టం చేసుకోను. జట్టు కోసం ఎలాంటి స్థానంలోనైనా ఆడేందుకు సిద్ధం. కానీ, నెంబర్ 3 స్పాట్ మాత్రం విరాట్ కోహ్లీదే. అతడి నుంచి ఎవరూ తీసుకోలేరు. అత్యుత్తమ క్రికెటర్లలో విరాట్ ఒకడు’’ అని శ్రేయస్ అన్నాడు.
ఆ సిక్స్ నాకెంతో ప్రత్యేకం: గిల్
ఆసీస్తో తొలి వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన భారత ఓపెనర్ శుభ్మన్ గిల్.. రెండో వన్డేలో సెంచరీ(104)తో కదం తొక్కాడు. మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడుతూ.. ‘‘అద్భుత విజయం సాధించడం ఆనందంగా ఉంది. జట్టుగా సరైన సమయంలో మేం ఊపు అందుకోగలిగాం. పరిస్థితికి అనుగుణంగా ఆటను మారుస్తూ ముందుకు సాగాం. వరల్డ్ కప్ ముంగిట తప్పకుండా మాకు ఎంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శ్రేయస్తో కలిసి మంచి ఇన్నింగ్స్ ఆడా. ఆ తర్వాత కేఎల్, సూర్య ఇదే ఊపును కొనసాగించడంతో భారీ స్కోరు చేయగలిగాం. కామెరూన్ గ్రీన్ బౌలింగ్లో కొట్టిన సిక్స్ నాకు ఎంతో ప్రత్యేకమైంది’’ అని గిల్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం