Shreyas Iyer: నెగెటివ్ పబ్లిసిటీ.. నియంత్రించడం మన చేతుల్లో ఉండదు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. అందులో హైదరాబాద్తో కోల్కతా తలపడనుంది. ఈ సందర్భంగా కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).. దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోవాల్సి వచ్చింది. గాయం కాకుండానే ఆటకు దూరంగా ఉండిపోయాడనే ప్రచారం అతడిపై పడింది. ఎన్సీఏ వైద్య బృందం శ్రేయస్ ఫిట్గా ఉన్నాడని ధ్రువీకరించింది. విమర్శల మధ్య రంజీ ట్రోఫీలో ఆడిన శ్రేయస్ కీలకమైన 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్లో కోల్కతా జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా హైదరాబాద్తో కోల్కతా తలపడనుంది. ఈ క్రమంలో విలేకర్ల సమావేశంలో కెప్టెన్ శ్రేయస్ పలు విషయాలపై మాట్లాడాడు.
‘‘ఎన్సీఏ డాక్టర్ ఏం చెప్పాడనే దానిపై స్పందించను. గాయం ఏంటి? ఎలా అయింది? అనే విషయాలు ఇప్పుడు అనవసరం. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే క్రికెట్పై దృష్టిపెట్టడం కష్టమని గతంలోనే చెప్పా. అందుకే, వాటన్నింటిని పక్కన పెట్టేసి మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాం. ఐపీఎల్ కోసం సరైన సన్నద్ధతే లభించింది. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తితో జట్టును నడిపించేందుకు ప్రయత్నిస్తా. ప్రతి అంశంపై దృష్టిపెట్టి విజయం సాధించేందుకు ఆడతాం.
ఐపీఎల్లో చాలా ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పుడు మాత్రం మరింత ఉత్సాహంగా ఉన్నా. నా సన్నద్ధత ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. దాని కోసం రెగ్యులర్గా సాధన చేస్తూనే ఉన్నా. భారీ షాట్లను ప్రాక్టీస్ చేశా. గంటలపాటు బ్యాటింగ్ చేశా. ఐపీఎల్లో మా జట్టు విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తా. ప్రతి టీమ్ సారథి ఇదే మాట చెబుతాడు. గత సీజన్లలో మా ప్రదర్శన గొప్పగా లేదు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని భావిస్తున్నా. వర్తమానంలో ఉండటమే నాకిష్టం. ఇప్పుడేం చేయగలమనేది మన చేతుల్లోనే ఉంటుంది. బయట నుంచి మాట్లాడేవారిని నియత్రించడం ఎవరి వల్లా కాదు. గతం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మరిన్ని తప్పులు చేస్తారని నేను గుర్తించా. అందుకే, గతం నుంచి నేర్చుకొన్నది ఇప్పుడు అమలు చేయాలి. నా పని మీద దృష్టిపెడతా. ఏదైనా పొరపాటు చేసినా బాధపడను. దాని నుంచి నేర్చుకొని ముందుకు సాగుతా’’ అని శ్రేయస్ తెలిపాడు.
గంభీర్ అద్భుతం.. స్టార్క్ కీలకం: శ్రేయస్
‘‘కోల్కతాను రెండుసార్లు ఛాంపియన్గా నిలిపిన ఆటగాడు గౌతమ్ గంభీర్. ఇప్పుడు అతడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. గతంలో మేమిద్దరం వేరే ఫ్రాంచైజీ కోసం వర్క్ చేశాం. కొత్త ఆలోచనలతో దూకుడైన ఆటను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అతడి వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ సమయంలో అతడితో చాలా విషయాలపై చర్చించా. ఇక మా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ అనుభవం అమోఘం. వారిద్దరితో కలిసి ఆడటం వల్ల ఎంతో నేర్చుకోవచ్చు. మా టీమ్లోని ప్రతి ఆటగాడు మంచి ఫామ్లోనే ఉన్నారు. మిచెల్ స్టార్క్ రాకతో బౌలింగ్ మరింత బలోపేతమైంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యుత్తమంగా బౌలింగ్ వేయగల సమర్థుడు స్టార్క్’’ అని శ్రేయస్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..