Shreyas Iyer: నెగెటివ్ పబ్లిసిటీ.. నియంత్రించడం మన చేతుల్లో ఉండదు: శ్రేయస్ అయ్యర్
ఐపీఎల్లో నేడు రెండు మ్యాచ్లు జరగనున్నాయి. అందులో హైదరాబాద్తో కోల్కతా తలపడనుంది. ఈ సందర్భంగా కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer).. దేశవాళీ క్రికెట్లో ఆడకపోవడంతో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోవాల్సి వచ్చింది. గాయం కాకుండానే ఆటకు దూరంగా ఉండిపోయాడనే ప్రచారం అతడిపై పడింది. ఎన్సీఏ వైద్య బృందం శ్రేయస్ ఫిట్గా ఉన్నాడని ధ్రువీకరించింది. విమర్శల మధ్య రంజీ ట్రోఫీలో ఆడిన శ్రేయస్ కీలకమైన 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు ఐపీఎల్లో కోల్కతా జట్టును నడిపించేందుకు సిద్ధమయ్యాడు. ఇవాళ ఈడెన్ గార్డెన్స్ వేదికగా హైదరాబాద్తో కోల్కతా తలపడనుంది. ఈ క్రమంలో విలేకర్ల సమావేశంలో కెప్టెన్ శ్రేయస్ పలు విషయాలపై మాట్లాడాడు.
‘‘ఎన్సీఏ డాక్టర్ ఏం చెప్పాడనే దానిపై స్పందించను. గాయం ఏంటి? ఎలా అయింది? అనే విషయాలు ఇప్పుడు అనవసరం. వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే క్రికెట్పై దృష్టిపెట్టడం కష్టమని గతంలోనే చెప్పా. అందుకే, వాటన్నింటిని పక్కన పెట్టేసి మ్యాచ్ గురించి ఆలోచిస్తున్నాం. ఐపీఎల్ కోసం సరైన సన్నద్ధతే లభించింది. అత్యుత్తమ క్రీడాస్ఫూర్తితో జట్టును నడిపించేందుకు ప్రయత్నిస్తా. ప్రతి అంశంపై దృష్టిపెట్టి విజయం సాధించేందుకు ఆడతాం.
ఐపీఎల్లో చాలా ఏళ్లుగా ఆడుతున్నా. ఇప్పుడు మాత్రం మరింత ఉత్సాహంగా ఉన్నా. నా సన్నద్ధత ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటుంది. దాని కోసం రెగ్యులర్గా సాధన చేస్తూనే ఉన్నా. భారీ షాట్లను ప్రాక్టీస్ చేశా. గంటలపాటు బ్యాటింగ్ చేశా. ఐపీఎల్లో మా జట్టు విజేతగా నిలిపేందుకు ప్రయత్నిస్తా. ప్రతి టీమ్ సారథి ఇదే మాట చెబుతాడు. గత సీజన్లలో మా ప్రదర్శన గొప్పగా లేదు. ఈసారి అలాంటి పరిస్థితి ఉండదని భావిస్తున్నా. వర్తమానంలో ఉండటమే నాకిష్టం. ఇప్పుడేం చేయగలమనేది మన చేతుల్లోనే ఉంటుంది. బయట నుంచి మాట్లాడేవారిని నియత్రించడం ఎవరి వల్లా కాదు. గతం లేదా భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మరిన్ని తప్పులు చేస్తారని నేను గుర్తించా. అందుకే, గతం నుంచి నేర్చుకొన్నది ఇప్పుడు అమలు చేయాలి. నా పని మీద దృష్టిపెడతా. ఏదైనా పొరపాటు చేసినా బాధపడను. దాని నుంచి నేర్చుకొని ముందుకు సాగుతా’’ అని శ్రేయస్ తెలిపాడు.
గంభీర్ అద్భుతం.. స్టార్క్ కీలకం: శ్రేయస్
‘‘కోల్కతాను రెండుసార్లు ఛాంపియన్గా నిలిపిన ఆటగాడు గౌతమ్ గంభీర్. ఇప్పుడు అతడితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. గతంలో మేమిద్దరం వేరే ఫ్రాంచైజీ కోసం వర్క్ చేశాం. కొత్త ఆలోచనలతో దూకుడైన ఆటను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. అతడి వద్ద చాలా ప్లాన్స్ ఉంటాయి. ప్రాక్టీస్ సమయంలో అతడితో చాలా విషయాలపై చర్చించా. ఇక మా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ అనుభవం అమోఘం. వారిద్దరితో కలిసి ఆడటం వల్ల ఎంతో నేర్చుకోవచ్చు. మా టీమ్లోని ప్రతి ఆటగాడు మంచి ఫామ్లోనే ఉన్నారు. మిచెల్ స్టార్క్ రాకతో బౌలింగ్ మరింత బలోపేతమైంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అత్యుత్తమంగా బౌలింగ్ వేయగల సమర్థుడు స్టార్క్’’ అని శ్రేయస్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం తీవ్ర పోటీ ఉంది. సీనియర్లతోపాటు యువ క్రికెటర్లు బరిలో నిలిచారు. -
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
రోడ్డుపై పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: అమెరికా కారు ప్రమాదంలో 3 భారతీయులు దుర్మరణం
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం