IND vs ENG: మేమూ ‘మాహీ భాయ్’ను మిస్ అవుతున్నాం..: శుభ్మన్ గిల్
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ మామూలుగా ఉండదు. రాంచీ వేదికగానే టెస్టు జరుగుతుండడంతో ఇప్పుడందరి కళ్లూ ధోనీ కోసం వెతుకుతూ ఉంటాయి.
ఇంటర్నెట్ డెస్క్: రాంచీ వేదికగా భారత్ - ఇంగ్లాండ్ (IND vs ENG) నాలుగో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ సొంత మైదానంలో ఆడుతుండటంతో ‘తలా’ను ఎప్పుడు స్క్రీన్పై చూస్తామా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో భారత ఆటగాడు శుభ్మన్ గిల్ మాట్లాడుతూ.. యావత్ క్రికెట్ భారత్ మాహీ భాయ్ను మిస్ అవుతుందని వ్యాఖ్యానించాడు. రాంచీ లేదా ఎక్కడ ఆడినా ధోనీ లేని లోటు కనిపిస్తుందని పేర్కొన్నాడు. దాదాపు నాలుగేళ్ల కిందట మాహీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఐపీఎల్లోనే ఆడుతూ అభిమానులను అలరిస్తున్నాడు.
‘‘భారత్ క్రికెట్ అభిమానులు ఎంఎస్ ధోనీ భాయ్ను మిస్ అవుతున్నారు. అందులో మేం కూడా ఉన్నాం. కేవలం రాంచీలోనే కాకుండా.. ప్రపంచంలోని మరే మైదానాల్లో ఆడినా ఫ్యాన్స్ ‘ధోనీ’ అంటూ కేరింతలు కొడతారు’’ అని వ్యాఖ్యానించాడు.
ధోనీ ప్రాక్టీస్ షురూ..
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ తలపడనుంది. ఇప్పటికే ధోనీ తన ప్రాక్టీస్ను ప్రారంభించాడు. సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తున్నాడు. గత ఐపీఎల్ తర్వాత మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకున్న ధోనీ.. కొత్త సీజన్ కోసం ఉత్సాహంగా బరిలోకి దిగనున్నాడు.
కేఎల్ రాహుల్ ఫిట్నెస్పై ద్రవిడ్..
ఫిట్నెస్ లేని కారణంగా కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్తో నాలుగో టెస్టులోనూ ఆడలేదు. కేఎల్ ఫిట్నెస్పై ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటివరకు అతడు ఎంతమేరకు ఫిట్గా ఉన్నాడనేది తెలియదు. పూర్తిస్థాయిలో మాత్రం ఫిట్నెస్ సాధించలేదనేదే తెలుసు. బీసీసీఐ వైద్యబృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది ’’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!