Sindhu: రెండో రౌండ్లో సింధు
మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు శుభారంభం చేసింది.
కౌలాలంపూర్: మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు శుభారంభం చేసింది. తొలి రౌండ్లో సింధు 21-17, 21-16తో స్కాట్లాండ్ క్రీడాకారిణి కిర్స్టీ గిల్మోర్పై విజయం సాధించింది. 46 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. సింధు దూకుడుగా ఆడి విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్లో ఆమె.. సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)ను ఢీకొంటుంది. యువ షట్లర్ అష్మిత చాలిహా కూడా ముందంజ వేసింది. ఆమె 21-17, 21-16తో యున్ లిన్ (చైనీస్ తైపీ)ని ఓడించింది. ఉన్నతి హుడా, ఆకర్షి కశ్యప్ టోర్నీ నుంచి నిష్క్రమించారు. తొలి రౌండ్లో ఉన్నతి 13-21, 18-21తో ఫాంగ్ జీ (చైనా) చేతిలో, ఆకర్షి 22-24, 13-21తో వాంగ్ జి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. మిక్స్డ్ డబుల్స్లో సుమీత్ రెడ్డి-సిక్కి రెడ్డి జోడీ రెండో రౌండ్ చేరుకుంది. ఈ జంట 21-15, 12-21, 21-17తో చున్ వాయ్-చి యాన్ (హాంకాంగ్) ద్వయాన్ని ఓడించింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో కిరణ్ జార్జ్ 16-21, 17-21తో టకుమా (జపాన్) చేతిలో ఓడాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘కోహ్లీ అలా చేస్తే రిషభ్ పంత్ సంతోషిస్తాడు’
టీ20 ప్రపంచ కప్ 2024లో ఓపెనర్గా దిగి విఫలమవుతున్న విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడి పరుగులు రాబడితే రిషభ్ పంత్ సంతోషిస్తాడని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ పేర్కొన్నాడు. -
ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్ ఆశలను కూల్చేసిన సఫారీలు
T20 Worldcup 2024: టీ20 ప్రపంచకప్ నుంచి నేపాల్ నిష్క్రమించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఆ జట్టు ఓటమిపాలైంది. -
కోహ్లి జోరు అందుకునేనా..
ఐర్లాండ్ను చిత్తుచేసి.. పాకిస్థాన్ ముప్పును దాటి.. అమెరికాపై ఆధిపత్యంతో టీ20 ప్రపంచకప్లో సూపర్-8 చేరిన టీమ్ఇండియా.. మరో మ్యాచ్కు సిద్ధమైంది. తన చివరి గ్రూప్ మ్యాచ్లో శనివారం కెనడాతో తలపడనుంది. -
పాకిస్థాన్, న్యూజిలాండ్ ఔట్
ఆరంభం నుంచి సంచలనాలకు వేదికగా మారిన 2024 టీ20 ప్రపంచకప్లో 24 గంటల వ్యవధిలో రెండు పెద్ద జట్లకు పెద్ద షాక్ తగిలింది. పాకిస్థాన్, న్యూజిలాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి. -
అఫ్గాన్ అదరహో..
ఐసీసీ టోర్నీల్లో స్థిరంగా రాణిస్తూ నాకౌట్ చేరే రికార్డున్న న్యూజిలాండ్కు షాక్. టీ20 ప్రపంచకప్లో ఆ జట్టు తొలి రౌండ్ కూడా దాటకుండానే ఇంటిముఖం పట్టింది. -
ఇంగ్లాండ్ చేతిలో ఒమన్ చిత్తు
టీ20 ప్రపంచకప్లో ఇంగ్లాండ్ ఎట్టకేలకు గెలుపు రుచిచూసింది. గ్రూపు-బి పోరులో ఇంగ్లాండ్ 8 వికెట్ల తేడాతో ఒమన్ను చిత్తుచేసింది. -
మ్యాచ్ పూర్తవగానే సాఫ్ట్వేర్ పని..
భారత సంతతికి చెందిన సౌరభ్ నేత్రావల్కర్ ఇప్పుడు అమెరికా జట్టులో ప్రధాన పేసర్. పాకిస్థాన్పై సూపర్ ఓవర్లో యుఎస్ సంచలన విజయం సాధించడంలో అతనే కీలకం. -
ప్రణయ్ పరాజయం
ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత ఆటగాళ్లు హెచ్.ఎస్.ప్రణయ్, సమీర్వర్మల పోరాటం ముగిసింది. -
సెమీస్లో నగాల్
భారత స్టార్ ఆటగాడు సుమిత్ నగాల్ పెరుగియా టెన్నిస్ ఛాలెంజర్ టోర్నీలో సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. -
మేం అలా ఎప్పటికీ చేయం
టీ20 ప్రపంచకప్ నుంచి ఇంగ్లాండ్ను బయటకు పంపేలా తాము నెట్రన్రేట్ను తారుమారు చేయాలనుకుంటే క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని ఆస్ట్రేలియా పేసర్ కమిన్స్ అభిప్రాయపడ్డాడు. -
సూపర్-8కు అమెరికా.. వర్షంతో పాకిస్థాన్ ఆశలు గల్లంతు
ఇంకో మ్యాచ్ మిగిలిఉండగానే టీ20 ప్రపంచకప్ సూపర్-8 రేసు నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీకి ఆమోదం.. సంతోషంలో మస్క్ డ్యాన్స్
-
తొలిసారి బయటకు కేట్ మిడిల్టన్.. క్యాన్సర్ చికిత్సపై భావోద్వేగ పోస్టు..!
-
భాజపాదీ ‘రిక్షా’ పరిస్థితే.. అసలైన పోరాటం ఇప్పుడే మొదలైంది: ఉద్ధవ్ ఠాక్రే
-
రాబోయే రోజుల్లో గన్నవరం నుంచి మరిన్ని విమాన సర్వీసులు: ఎంపీ బాలశౌరి
-
త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ.. కార్యకర్తల రుణం తీర్చుకుంటా: చంద్రబాబు
-
కోడెలపై పెట్టిన కేసు జగన్ మీద కూడా పెట్టొచ్చు కదా!: శివరాం