Siraj vs SriLanka : లంక అంటే చాలు సిరాజ్కు పూనకాలే..
శ్రీలంకపై సిరాజ్(Mohammed Siraj) అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. తన పదునైన బంతులతో ఆ జట్టు బ్యాటర్లను వణికిస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్ : శ్రీలంక(SriLanka) అంటే చాలు మన సిరాజ్ మియా (Mohammed Siraj) రెచ్చిపోతాడు. ఎక్కడాలేని ఉత్సాహం వస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరుస్తాడు. దీంతో ఆ జట్టు బ్యాటర్లకు అతడో పీడకలగా మారిపోయాడు. ఈ ప్రపంచకప్(odi world cup 2023)లో అప్పటి వరకూ పెద్దగా ప్రభావం చూపని సిరాజ్.. లంక (IND vs SL)తో మ్యాచ్ అనగానే ఒక్కసారిగా తన ప్రతాపం చూపించాడు. అతడు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగుతుంటే.. మరోసారి ఆసియా కప్ ఫైనలే (asia cup final 2023) గుర్తుకువచ్చింది.
బంతులతోనే సమాధానమిస్తూ..
అప్పటి వరకూ ఆడిన మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపించడం లేదన్న విమర్శలు సిరాజ్పై వెల్లువెత్తాయి. గాయం బారిన పడి జట్టుకు దూరమైన హార్దిక్ జట్టులోకి తిరిగి వస్తే.. సిరాజ్ను ఆడిస్తారో లేదో అనే అనుమానాలు. అయితే, వీటన్నింటిని పటాపంచలు చేస్తూ ఈ హైదరాబాద్ మియాభాయ్ లంకపై రెచ్చిపోయాడు. తాను వేసిన తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ కరుణరత్నే వికెట్ తీశాడు. అదే ఓవర్ ఐదో బంతికి సమర విక్రమను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్ తొలి బంతికి కెప్టెన్ కుశాల్ మెండీస్ను క్లీన్ బౌల్డ్ చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ప్రదర్శన చూస్తే.. ఆసియా కప్ ఫైనలే అందరికీ గుర్తుకువచ్చింది. ఈ మ్యాచ్లో మొత్తం 7 ఓవర్లు వేసిన సిరాజ్.. 16 పరుగులే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు రాబట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన షమీ.. లంక పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్లను దెబ్బతీయడానికి సిరాజ్ అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను వాడటంలో ఏమాత్రం జాలి చూపించలేదు. లంక బ్యాటర్ అసలంక వికెట్ల వద్ద కుదురుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్న సమయంలో అతడి ఏకాగ్రత దెబ్బతీయడమే లక్ష్యంగా ఒక దశలో నోటికి పని చెప్పాడు. కానీ, జట్టు బ్యాటింగ్ పరిస్థితి అర్థం చేసుకొన్న అసలంక దీనికి కేవలం నవ్వుతూనే ప్రతిస్పందించాడు.
ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి..
సిరాజ్ అంటే లంక బ్యాటర్లకు ఓ పీడకల. ఎందుకంటే.. ఆసియాకప్ ఫైనల్ చేరిన ఆ జట్టును పేకమేడలా కుప్పకూల్చాడు. శ్రీలంక vs సిరాజ్ అన్నట్లుగా సాగిన ఆ ఫైనల్ పోరులో ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్గానూ అవతరించాడు. దీంతో అప్పట్లో 50 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. సిరాజ్ ఈ మ్యాచ్లో మొత్తం 7 ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.
తిరువనంతపురం వన్డేలోనూ..
జనవరిలో తిరువనంతపురం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 5 వికెట్లకు 390 పరుగులు చేస్తే.. లంక 73 పరుగులకే కుప్పకూలింది. ఆ మ్యాచ్లో 4 వికెట్లతో లంక పతనాన్ని సిరాజ్ శాసించాడు.
ఇక ఈ ప్రపంచకప్లో అప్పటి వరకూ ఆడిన 6 మ్యాచ్ల్లో మొత్తం 6 వికెట్లే పడగొడితే.. లంకతో మ్యాచ్లోనే 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంకపై సిరాజ్ ప్రదర్శన ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
తక్కువ స్ట్రైక్ రేట్ విషయంలో విరాట్ కోహ్లీపై వస్తున్న విమర్శలను కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. -
ధోనీ ‘ఐపీఎల్’ జర్నీ సక్సెస్కు కారణమిదే!
‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీ క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. సుదీర్ఘంగా ఐపీఎల్లో కొనసాగుతున్న అతడిని చూసేందుకు అభిమానులు భారీగా స్టేడియాలకు తరలి వస్తున్న సంగతి తెలిసిందే. -
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) కోసం జట్టును ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్టర్లు సిద్ధమవుతున్నారు. మే 1లోపు స్క్వాడ్ను వెల్లడించాల్సి ఉంది. -
ఈ సెల్యూట్ ఆయన కోసమే.. తొలి హాఫ్ సెంచరీ అంకితం: ధ్రువ్ జురెల్
ప్లేఆఫ్స్కు చేరువైన తొలి జట్టుగా రాజస్థాన్ నిలవనుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అందరికంటే ముందుంది. తాజాగా లఖ్నవూపై విజయభేరి మోగించింది. -
ఆర్చరీ వరల్డ్ కప్లో భారత్ అద్భుతం.. ఒలింపిక్ ఛాంపియన్ను ఓడించి స్వర్ణం కైవసం
ఆర్చరీ ప్రపంచ కప్లో టీమ్ఇండియా హవా కొనసాగుతోంది. ఐదు స్వర్ణాలను గెలిచి అదరగొట్టేసింది. రికర్వ్ విభాగంలోనూ ఆధిపత్యం ప్రదర్శించింది. -
బుమ్రా బౌలింగ్ ఫుటేజీలను విపరీతంగా చూశా: జేక్ ఫ్రేజర్
దిల్లీ భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేజర్ కీలక పాత్ర పోషించాడు. దూకుడైన ఆటతీరుతో ముంబయి బౌలర్లను వణికించాడు. -
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
దిల్లీ చేతిలో ఓటమితో ముంబయి ప్లే ఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లాయి. మరోవైపు రిషభ్ పంత్ సేన ఛాన్స్లు మెరుగయ్యాయి. -
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు
-
ఈ పానీపూరీ ‘మోదీ’ చాలా నీట్ గురూ!
-
మే నెల పింఛను సొమ్ము లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే జమ
-
కోహ్లీని వెనకేసుకొచ్చిన గంభీర్.. మీడియాకు చురకలు..!
-
WWE మాజీ మహిళా రెజ్లర్ను పెళ్లాడిన టెక్ సీఈఓ
-
‘బంగారం’లాంటి కబురు చెప్పిన సమంత.. అభిమానుల ఆనందం