Siraj vs SriLanka : లంక అంటే చాలు సిరాజ్కు పూనకాలే..
శ్రీలంకపై సిరాజ్(Mohammed Siraj) అదిరిపోయే ప్రదర్శన చేస్తున్నాడు. తన పదునైన బంతులతో ఆ జట్టు బ్యాటర్లను వణికిస్తున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్ : శ్రీలంక(SriLanka) అంటే చాలు మన సిరాజ్ మియా (Mohammed Siraj) రెచ్చిపోతాడు. ఎక్కడాలేని ఉత్సాహం వస్తోంది. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ వెన్ను విరుస్తాడు. దీంతో ఆ జట్టు బ్యాటర్లకు అతడో పీడకలగా మారిపోయాడు. ఈ ప్రపంచకప్(odi world cup 2023)లో అప్పటి వరకూ పెద్దగా ప్రభావం చూపని సిరాజ్.. లంక (IND vs SL)తో మ్యాచ్ అనగానే ఒక్కసారిగా తన ప్రతాపం చూపించాడు. అతడు నిప్పులు చెరిగే బంతులతో చెలరేగుతుంటే.. మరోసారి ఆసియా కప్ ఫైనలే (asia cup final 2023) గుర్తుకువచ్చింది.
బంతులతోనే సమాధానమిస్తూ..
అప్పటి వరకూ ఆడిన మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపించడం లేదన్న విమర్శలు సిరాజ్పై వెల్లువెత్తాయి. గాయం బారిన పడి జట్టుకు దూరమైన హార్దిక్ జట్టులోకి తిరిగి వస్తే.. సిరాజ్ను ఆడిస్తారో లేదో అనే అనుమానాలు. అయితే, వీటన్నింటిని పటాపంచలు చేస్తూ ఈ హైదరాబాద్ మియాభాయ్ లంకపై రెచ్చిపోయాడు. తాను వేసిన తొలి ఓవర్ తొలి బంతికే ఓపెనర్ కరుణరత్నే వికెట్ తీశాడు. అదే ఓవర్ ఐదో బంతికి సమర విక్రమను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత నాలుగో ఓవర్ తొలి బంతికి కెప్టెన్ కుశాల్ మెండీస్ను క్లీన్ బౌల్డ్ చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్లో సిరాజ్ ప్రదర్శన చూస్తే.. ఆసియా కప్ ఫైనలే అందరికీ గుర్తుకువచ్చింది. ఈ మ్యాచ్లో మొత్తం 7 ఓవర్లు వేసిన సిరాజ్.. 16 పరుగులే ఇచ్చి కీలకమైన మూడు వికెట్లు రాబట్టాడు. ఇక ఆ తర్వాత వచ్చిన షమీ.. లంక పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్లో శ్రీలంక బ్యాటర్లను దెబ్బతీయడానికి సిరాజ్ అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను వాడటంలో ఏమాత్రం జాలి చూపించలేదు. లంక బ్యాటర్ అసలంక వికెట్ల వద్ద కుదురుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్న సమయంలో అతడి ఏకాగ్రత దెబ్బతీయడమే లక్ష్యంగా ఒక దశలో నోటికి పని చెప్పాడు. కానీ, జట్టు బ్యాటింగ్ పరిస్థితి అర్థం చేసుకొన్న అసలంక దీనికి కేవలం నవ్వుతూనే ప్రతిస్పందించాడు.
ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి..
సిరాజ్ అంటే లంక బ్యాటర్లకు ఓ పీడకల. ఎందుకంటే.. ఆసియాకప్ ఫైనల్ చేరిన ఆ జట్టును పేకమేడలా కుప్పకూల్చాడు. శ్రీలంక vs సిరాజ్ అన్నట్లుగా సాగిన ఆ ఫైనల్ పోరులో ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్గానూ అవతరించాడు. దీంతో అప్పట్లో 50 పరుగులకే ఆ జట్టు కుప్పకూలింది. సిరాజ్ ఈ మ్యాచ్లో మొత్తం 7 ఓవర్లు వేసి 21 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శనతో తన కెరీర్లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసుకున్నాడు.
తిరువనంతపురం వన్డేలోనూ..
జనవరిలో తిరువనంతపురం వేదికగా జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 5 వికెట్లకు 390 పరుగులు చేస్తే.. లంక 73 పరుగులకే కుప్పకూలింది. ఆ మ్యాచ్లో 4 వికెట్లతో లంక పతనాన్ని సిరాజ్ శాసించాడు.
ఇక ఈ ప్రపంచకప్లో అప్పటి వరకూ ఆడిన 6 మ్యాచ్ల్లో మొత్తం 6 వికెట్లే పడగొడితే.. లంకతో మ్యాచ్లోనే 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో శ్రీలంకపై సిరాజ్ ప్రదర్శన ఏంటో అర్థం చేసుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్