World Cup: ప్రపంచకప్ ప్రకంపనలు.. మెగా టోర్నీలో ఘోర వైఫల్యంతో జట్లకు కష్టాలు
ఈ వన్డే ప్రపంచకప్లో ఫేవరెట్లుగా బరిలోకి దిగిన కొన్ని జట్లు దారుణ ప్రదర్శన చేశాయి. పసికూనల చేతిలో ఓడిపోయాయి. దీంతో రానున్న రోజుల్లో పలు జట్లలో పెను మార్పులు జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డును ఆ దేశం రద్దు చేయగా, ఐసీసీ శ్రీలంకపై నిషేధం విధించింది.
వన్డే ప్రపంచకప్.. క్రికెట్లో అత్యున్నత టోర్నీ. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్షిప్, టీ20ల్లో ప్రపంచకప్ ఉన్నప్పటికీ.. వన్డే ప్రపంచకప్నకు ఉన్న విలువ వేరు. ప్రతి క్రికెటర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ టోర్నీకి ఘన చరిత్ర ఉంది. గత కొన్నేళ్లలో వన్డేల ప్రాధాన్యం తగ్గినా.. ప్రపంచకప్ను మాత్రం ఇప్పటికీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఇందులో మెరుగైన ప్రదర్శన చేసి కప్పు గెలిచే జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పడతారు. కప్పు గెలవకపోయినా ప్రదర్శన బాగుంటే వెన్నుతట్టి ప్రోత్సహిస్తారు. కానీ ఇక్కడ పేలవ ప్రదర్శన చేస్తే మాత్రం అభిమానుల నుంచి తీవ్ర ఆగ్రహం ఎదుర్కోక తప్పదు. దాంతోపాటే తమ బోర్డుల నుంచి చర్యలూ ఎదుర్కోవాల్సిందే. ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన తర్వాత జట్ల ముఖచిత్రాలు మారిపోయిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయి.
2007 ప్రపంచకప్లో ఏం జరిగిందో గుర్తుందా? భారత జట్టు పేలవ ప్రదర్శనతో టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. సచిన్, ద్రవిడ్, సెహ్వాగ్ లాంటి దిగ్గజాలతో కూడిన జట్టు అంత ఘోరమైన ప్రదర్శన చేయడం అనూహ్యం. ఆ ప్రభావం భారత క్రికెట్ మీద బాగానే పడింది. టోర్నీ అవ్వగానే ద్రవిడ్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఇంకొన్ని నెలల్లో జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి సచిన్, ద్రవిడ్ లాంటి సీనియర్లు తప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కోచింగ్ సిబ్బంది మొత్తం మారిపోయారు. అదే టోర్నీలో పాకిస్థాన్ కూడా గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. ఆ జట్టులో చాలా మార్పులు జరిగాయి. 2015లో ఇంగ్లాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమించగా.. జట్టు మొత్తాన్ని మార్చేసింది ఇంగ్లాండ్ బోర్డు. ప్రస్తుత ప్రపంచకప్లో కొన్ని జట్ల ప్రదర్శన తాలూకు ప్రభావం టోర్నీ ముగియక ముందే మొదలైపోయింది.
బోర్డే రద్దయిపోయింది
ఈ ప్రపంచకప్లో లీగ్ దశలో ఆడిన 9 మ్యాచ్ల్లో ఏడు ఓడిపోయింది శ్రీలంక. ఈసారి ఆ జట్టు సెమీస్ చేరుతుందన్న అంచనాలేమీ లేవు కానీ.. ఆసియా కప్, అంతకుముందు ప్రదర్శన బాగుండటంతో పెద్ద జట్లకు కొన్ని షాకులివ్వగలదేమో అనుకున్నారు. కానీ ఆ జట్టు తన కంటే స్థాయిలో తక్కువ అయిన అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ల చేతుల్లోనూ ఓడిపోయింది. ఆ జట్టును గాయాలు దెబ్బ తీసినా సరే.. ఇంత పేలవ ప్రదర్శన చేయడం ఆశ్చర్యకరం. దీంతో ఆ దేశ క్రికెట్ బోర్డునే మొత్తంగా రద్దు చేసి పడేసింది శ్రీలంక ప్రభుత్వం. జట్టులోనూ పలు మార్పులు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. ఐతే ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం బోర్డును రద్దు చేయడం లంక క్రికెట్లో సంక్షోభానికి దారి తీసింది. దీంతో శ్రీలంక మీద నిషేధం విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెట్ బోర్డుకు సంబంధించిన నియామకాల్లో ప్రభుత్వ జోక్యం ఉండకూడదు. ఏదైనా ఎన్నికల ప్రక్రియను అనుసరించి జరగాలి. అందుకు విరుద్ధంగా ప్రభుత్వం బోర్డును రద్దు చేయడంతో ఇప్పుడు నిషేధం ఎదుర్కొంటోంది లంక క్రికెట్. ఇదంతా ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన ఫలితమే.
కత్తి వేలాడుతోంది
ప్రపంచకప్ పేలవ ప్రదర్శన నేపథ్యంలో ఇంకో మూడు జట్లలో మార్పులు చూడబోతున్నాం. బంగ్లాదేశ్ జట్టుకు సంబంధించి ఇప్పటికే బౌలింగ్ కోచ్ అలెన్ డొనాల్డ్ తన పదవికి రాజీనామా చేశాడు. టోర్నీలో ఆ జట్టు కూడా రెండే విజయాలు సాధించింది. పసికూన నెదర్లాండ్స్ చేతిలోనూ పరాజయం చవిచూసింది. ఆ జట్టు కెప్టెన్ షకిబ్ అల్హసన్ మీదే వేటు పడటం లాంఛనమే అంటున్నారు. వ్యక్తిగతంగా అతడి ప్రదర్శన బాగా లేదు. కెప్టెన్సీలోనూ విఫలమయ్యాడు. దీనికి తోడు మాథ్యూస్ టైమ్డ్ ఔట్ విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అతను రాజీనామా చేయడమో, లేదంటే బోర్డే తప్పించడమో గ్యారెంటీ అంటున్నారు.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగి టోర్నీ చరిత్రలోనే అత్యంత పేలవ ప్రదర్శన చేసిన ఇంగ్లాండ్ జట్టుపై కఠిన చర్యలు తప్పవంటున్నారు. బట్లర్ కెప్టెన్సీకి రాజీనామా చేయడం లాంఛనమేనట. జట్టులో మరిన్ని మార్పులుంటాయని.. కోచింగ్ సిబ్బంది కూడా తప్పుకోనున్నారని ఇంగ్లాండ్ మీడియాలో ఇప్పటికే చర్చ నడుస్తోంది. భారత్కు కనీస పోటీ ఇవ్వకుండా చిత్తుగా ఓడిపోవడం, అఫ్గానిస్థాన్ చేతిలో షాక్ తిని సెమీస్కు దూరమైన పాకిస్థాన్ జట్టుపై స్వదేశంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచకప్లో పేలవ ప్రదర్శన చేయడం, జట్టులో మార్పులు చోటు చేసుకోవడం పాక్ క్రికెట్లో కొత్త కాదు. ప్రస్తుత టోర్నీ తర్వాత బాబర్ అజామ్ కెప్టెన్గా తప్పుకోనున్నాడట. కోచ్ మికీ ఆర్థర్ కూడా తన బాధ్యతలకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. లీగ్ దశ ముగిసిన వారం రోజుల్లోపు ఈ విఫల జట్లకు సంబంధించి మార్పులు చేర్పులకు సంబంధించి చాలా నిర్ణయాలే వెలువడబోతున్నట్లు తెలుస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు