Team India: అది మాత్రం ప్రాక్టికల్గా వర్కౌట్ కాదు..: సౌరభ్ గంగూలీ
ఆటగాళ్లపై వర్క్లోడ్ను తగ్గించేలా బీసీసీఐ చర్యలు తీసుకోవాలనే సూచనలపై సౌరభ్ గంగూలీ స్పందించాడు. అలాగే వెస్టిండీస్ పర్యటనకు యశస్వి ఎంపిక నిర్ణయంపై మాట్లాడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC Final 2023) ఫైనల్ ముగిసి దాదాపు ఇరవై రోజులు కావొస్తోంది. ఆ మ్యాచ్లో టీమ్ఇండియాకు పరాభవం ఎదురైంది. ఐపీఎల్ ప్రభావంతోనే భారత్ ఓడిందనే విమర్శ కూడా ఉంది. దీంతో, ఆటగాళ్లపై పనిభారం తగ్గించేలా ఐపీఎల్ ఫ్రాంచైజీలతో బీసీసీఐ చర్చలు జరపాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచనలు చేశారు. అయితే, ఇలాంటివి ప్రాక్టికల్గా చాలా కష్టమని టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ వ్యాఖ్యానించాడు.
‘‘ఇలాంటి థియరీని నేను అంగీకరించను. ఎందుకంటే గత ఐపీఎల్లో ఆడిన అజింక్య రహానె కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడాడు. దానిలో కీలక ఇన్నింగ్స్లతో రాణించి మెప్పించాడు. కాబట్టి, వర్క్లోడ్ అనే థియరీని నమ్మను. ఆసీస్లోనూ కొందరు ఐపీఎల్లో ఆడి నేరుగా డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇంగ్లాండ్ వచ్చారు. కామెరూన్ గ్రీన్, డేవిడ్ వార్నర్ రెండింట్లోనూ ఆడారు. ఐపీఎల్ ముగిసిన తర్వాత కొంత సమయం కూడా ఉంది. టెస్టు ఫార్మాట్లోకి మారేందుకు తగినంత సమయం ఉందనేది నా భావన. గతంలోనూ ఇలా జరిగిన సందర్భాలున్నాయి. వన్డే లేదా టెస్టు క్రికెట్ ఆడినా పెద్దగా మార్పులు ఉండవు. కాబట్టే, ఇదేమీ పెద్ద సమస్య కాదు. ఐపీఎల్ ఆడి వచ్చినా సరే బ్యాటర్ త్వరగా తన టెక్నిక్, దూకుడును అడ్జస్ట్ చేసుకోగలిగితే టెస్టు మ్యాచ్లోనూ రాణించేందుకు ఎక్కువ అవకాశం లభిస్తుంది’’ అని గంగూలీ తెలిపాడు.
యశస్విని ఎంపిక చేయడం బాగుంది
వెస్టిండీస్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో భారత యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్కు అవకాశం దక్కింది. అయితే, సర్ఫరాజ్ ఖాన్తోపాటు అభిమన్యు ఈశ్వరన్ను తీసుకోకపోవడంపై గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘రంజీ, ఇరానీ, దులీప్ ట్రోఫీల్లో యశస్వి అద్భుతంగా రాణించాడు. అతడిని ఎంపిక చేయడం మంచి నిర్ణయం. అయితే, సర్ఫరాజ్ ఖాన్తోపాటు ఈశ్వరన్కు కూడా అవకాశం ఇస్తే బాగుండేది. గత మూడేళ్లుగా దేశవాళీ క్రికెట్లో వారు పరుగుల వరద పారించారు’’ అని వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రి రోజాను అడ్డుకున్న వేమాపురం వాసులు
-
ఎన్నిక, తీర్పు రెండూ సంచలనమే.. భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ భవిష్యత్తు ప్రశ్నార్థకం!
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు.. డిగ్రీ పరీక్షలు రాయకుండా నిర్బంధం