ODI WC 2023 - Ganguly: వరల్డ్ కప్ షెడ్యూల్.. ఆ అవకాశం చేజారడం బాధగా ఉంది: గంగూలీ
భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) షెడ్యూల్ను రెండు రోజుల కిందట అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. అక్టోబర్ 5వ తేదీన ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్తో ప్రపంచ క్రికెట్ సంగ్రామం మొదలు కానుంది. భారత్ మాత్రం అక్టోబర్ 8న ఆసీస్తో వరల్డ్ కప్వేటను ప్రారంభించనుంది. దేశంలోని 10 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే భారత్ - పాక్ మ్యాచ్ (అక్టోబర్ 15న)తోపాటు ఫైనల్లో జరగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భావోద్వేగానికి గురయ్యాడు.
‘‘భారత్లో జరిగే ప్రపంచ కప్ కోసం ఎదురు చూడండి. కొవిడ్ కారణంగా ఐసీసీ అధ్యక్షుడిని కాలేకపోయా. ప్రపంచానికే భారత్ మార్గదర్శకంగా ఉండనుంది. అద్భుతమైన వేదికల్లో మ్యాచ్లను నిర్వహించేలా గొప్పగా కేటాయించారు. మరే ఇతర దేశం కూడా ఇలా పెద్ద సంఖ్యలో వేదికలను కలిగి లేవు. ప్రపంచం గుర్తుండిపోయేలా బీసీసీఐ ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుంది. బీసీసీఐ, జైషా, రోజర్ బిన్నీ, ఇతర ఆఫీస్ బేరర్స్, సిబ్బందికి శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.
బీసీసీఐ అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత సౌరభ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా వెళ్లాల్సింది. అయితే, బీసీసీఐ పెద్దలతోపాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి మద్దతు లేకపోవడంతో ఐసీసీ ఛైర్మన్గా పోటీ చేయలేకపోయాడు. ఒకవేళ ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉండి ఉంటే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను గంగూలీనే ప్రకటించే అవకాశం వచ్చేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి