ODI WC 2023 - Ganguly: వరల్డ్ కప్ షెడ్యూల్.. ఆ అవకాశం చేజారడం బాధగా ఉంది: గంగూలీ
భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ను ఐసీసీ ప్రకటించింది. ఈ క్రమంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భావోద్వేగానికి గురయ్యాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ 2023 (ODI World Cup 2023) షెడ్యూల్ను రెండు రోజుల కిందట అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) ప్రకటించింది. అక్టోబర్ 5వ తేదీన ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్తో ప్రపంచ క్రికెట్ సంగ్రామం మొదలు కానుంది. భారత్ మాత్రం అక్టోబర్ 8న ఆసీస్తో వరల్డ్ కప్వేటను ప్రారంభించనుంది. దేశంలోని 10 వేదికల్లో మ్యాచ్లు జరుగుతాయి. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే భారత్ - పాక్ మ్యాచ్ (అక్టోబర్ 15న)తోపాటు ఫైనల్లో జరగనుంది. ఈ క్రమంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ భావోద్వేగానికి గురయ్యాడు.
‘‘భారత్లో జరిగే ప్రపంచ కప్ కోసం ఎదురు చూడండి. కొవిడ్ కారణంగా ఐసీసీ అధ్యక్షుడిని కాలేకపోయా. ప్రపంచానికే భారత్ మార్గదర్శకంగా ఉండనుంది. అద్భుతమైన వేదికల్లో మ్యాచ్లను నిర్వహించేలా గొప్పగా కేటాయించారు. మరే ఇతర దేశం కూడా ఇలా పెద్ద సంఖ్యలో వేదికలను కలిగి లేవు. ప్రపంచం గుర్తుండిపోయేలా బీసీసీఐ ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుంది. బీసీసీఐ, జైషా, రోజర్ బిన్నీ, ఇతర ఆఫీస్ బేరర్స్, సిబ్బందికి శుభాకాంక్షలు చెబుతున్నా’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.
బీసీసీఐ అధ్యక్ష పదవీకాలం ముగిసిన తర్వాత సౌరభ్ గంగూలీ ఐసీసీ అధ్యక్షుడిగా వెళ్లాల్సింది. అయితే, బీసీసీఐ పెద్దలతోపాటు ఐసీసీ సభ్య దేశాల నుంచి మద్దతు లేకపోవడంతో ఐసీసీ ఛైర్మన్గా పోటీ చేయలేకపోయాడు. ఒకవేళ ఐసీసీ ఛైర్మన్ హోదాలో ఉండి ఉంటే భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ను గంగూలీనే ప్రకటించే అవకాశం వచ్చేది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్
-
ఇంటి స్థలం ఇప్పటికీ ఇవ్వలేదు.. పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్య ఆవేదన