Rohit - Dravid: అలా చేయమని చెప్పడానికి మీరెవరు?: సౌరభ్ గంగూలీ
ఆసీస్ చేతిలో డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final) ఓటమి తర్వాత భారత ప్రధాన కోచ్, కెప్టెన్ కొనసాగింపుపై చర్చకు తెరలేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final)లో ఘోర ఓటమితో టీమ్ఇండియాపై సర్వత్రా విమర్శలు రేగాయి. రెండో డబ్ల్యూటీసీ ఫైనల్లో విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా టెస్టు ‘గద’ను దక్కించుకొంది. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ద్వయం కొనసాగింపుపై సందేహం నెలకొంది. వీరి కాంబినేషన్లో డబ్ల్యూటీసీ ఫైనల్కు రావడం మినహా.. గొప్పగా సాధించిందేమీ లేదనే అభిప్రాయం ఉంది. గతేడాది టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ టోర్నీల్లో టీమ్ఇండియా ఓటమి చవిచూసింది. దీంతోవారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లూ సోషల్ మీడియాలో తలెత్తాయి. విపరీతంగా ట్రోలింగ్ చేస్తూ మీమ్స్ వచ్చాయి. దీనిపై టీమ్ఇండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పందించాడు. ఆ బాధ్యత చూసుకోవడానికి సెలెక్టర్లు ఉన్నారని, మార్పులు చేసే పని వారిదేనని పేర్కొన్నాడు.
‘‘జట్టుకు సంబంధించి ఏవైనా మార్పులు చేయాలంటే ఆ బాధ్యత సెలెక్టర్లదే. అందులో సోషల్ మీడియా ఎలా ప్రభావితం చేస్తుంది..? రెండేళ్ల కిందట విరాట్ కోహ్లీ కూడా టెస్టు కెప్టెన్సీ వద్దనుకోని దిగిపోయాడు. ఇప్పుడు భారత కెప్టెన్, కోచ్గా ఎవరు ఉంటే బాగుంటుందని నన్ను అడుగుతారు? కానీ, రోహిత్, రాహుల్ ద్రవిడ్ తమ బాధ్యతలను సరిగ్గానే నిర్వర్తిస్తున్నారని అనుకుంటున్నా. వచ్చే ప్రపంచ కప్ వరకు వీరి కాంబినేషన్ను కొనసాగించాలి. ప్రపంచ కప్ తర్వాత రోహిత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నాకైతే తెలియదు. ఇప్పుడైతే వీరిద్దరు అత్యుత్తమమే అనిపిస్తోంది. భవిష్యత్తులో మంచి విజయాలు నమోదు చేయాలని ఆశిస్తున్నా. ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ రెండో రోజు ఆట సందర్భంగా మహ్మద్ సిరాజ్ ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ వైపుగా బంతిని విసిరాడు. అప్పటి నుంచే భారత బౌలింగ్ కాస్త గతి తప్పింది. అప్పటి వరకు పదునైన బౌలింగ్ వేసిన భారత్ ఆ తర్వాత వెనుకబడిపోయింది’’ అని గంగూలీ తెలిపాడు.
ఫీల్డింగ్ కూడా ఓ కారణమే: కైఫ్
‘‘భారత్ ఓడిపోవడంలో బ్యాటింగ్, బౌలింగ్తోపాటు ఫీల్డింగ్ వైఫల్యం కూడా ప్రధాన కారణమే. ఆసీస్ బ్యాటర్లు ఇచ్చిన అవకాశాలను వదిలేయడంతో భారీ మూల్యం చెల్లించుకోకతప్పలేదు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో విలువైన పరుగులు చేసిన అలెక్స్ కేరీ వికెట్ను దక్కించుకొనే అవకాశం భారత్కు చేజారింది. స్లిప్లో అలెర్ట్గా ఉండాల్సిన పుజారా, కోహ్లీ వదిలేయడం ఆశ్చర్యంగానూ ఉంది. అలాగే తొలి ఇన్నింగ్స్లో సెంచరీ బాదిన స్మిత్ కొట్టిన బంతి స్లిప్లోని కోహ్లీకి కాస్త ముందుగా పడింది. ఒకవేళ అది అందుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో’’ అని మహ్మద్ కైఫ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే