Team India: అతడు టెస్టులు ఆడాలి.. నా విన్నపం వింటాడని ఆశిస్తున్నా: సౌరభ్ గంగూలీ
విండీస్తో టెస్టు సిరీస్ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2023-2025) మూడో సీజన్ మొదలు కానుంది. ఈ క్రమంలో యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు. ఇదే క్రమంలో సీనియర్ పేస్ ఆల్రౌండర్కూ ఓ విజ్ఞప్తి చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final 2023) ఓడిపోయింది. ఈ క్రమంలో మాజీలు విమర్శలు, సలహాలు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) కూడా పలు సూచనలు చేశాడు. కొంతమంది వెటరన్ ప్లేయర్లు కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అలాగే భారత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు (Hardik Pandya) ఓ విన్నపం చేశాడు. తప్పకుండా టెస్టు క్రికెట్ ఆడటం మళ్లీ మొదలు పెట్టాలని సూచించాడు. జులై 12 నుంచి విండీస్తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో యువకులకు అవకాశం ఇవ్వాలని గంగూలీ పేర్కొన్నాడు.
‘‘కేవలం ఒక్క ఓటమితో టీమ్ఇండియా క్రికెట్ను తక్కువగా అంచనా వేయకూడదు. మన దగ్గర అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు. ఇప్పటికిప్పుడే విరాట్, పుజారాను పక్కన పెట్టేయాలని చెప్పను. ఎందుకంటే విరాట్కు ఇంకా 34 ఏళ్లే. అయితే, యువకులకు దారి ఇవ్వాల్సిన బాధ్యత వారిదే. రిజర్వ్ బెంచ్పై నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇది కేవలం ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవడం లేదు. టెస్టు క్రికెట్ పూర్తిగా విభిన్నమైంది. యశస్వి జైస్వాల్, రజత్ పటీదార్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ .. ఇలా యంగ్ డైనమిక్ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య నా మాటలు వింటాడని అనుకుంటున్నా. తప్పకుండా అతడు మళ్లీ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో అతడి అవసరం చాలా ఉంది’’ అని గంగూలీ తెలిపాడు.
హార్దిక్ పాండ్య చివరిసారిగా 2018లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో ఆడాడు. ఆ తర్వాత వెన్ను నొప్పి కారణంగా కొన్నాళ్లు క్రికెట్కు దూరమై.. తిరిగి వచ్చిన తర్వాత వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు. ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన హార్దిక్ 532 పరుగులు చేసి, 17 వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే