Team India: అతడు టెస్టులు ఆడాలి.. నా విన్నపం వింటాడని ఆశిస్తున్నా: సౌరభ్ గంగూలీ
విండీస్తో టెస్టు సిరీస్ నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (2023-2025) మూడో సీజన్ మొదలు కానుంది. ఈ క్రమంలో యువ క్రికెటర్లకు అవకాశాలు కల్పించాలని భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ సూచించాడు. ఇదే క్రమంలో సీనియర్ పేస్ ఆల్రౌండర్కూ ఓ విజ్ఞప్తి చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా వరుసగా రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్లో (WTC Final 2023) ఓడిపోయింది. ఈ క్రమంలో మాజీలు విమర్శలు, సలహాలు ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Sourav Ganguly) కూడా పలు సూచనలు చేశాడు. కొంతమంది వెటరన్ ప్లేయర్లు కొత్తవారికి అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నాడు. అలాగే భారత పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు (Hardik Pandya) ఓ విన్నపం చేశాడు. తప్పకుండా టెస్టు క్రికెట్ ఆడటం మళ్లీ మొదలు పెట్టాలని సూచించాడు. జులై 12 నుంచి విండీస్తో టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో యువకులకు అవకాశం ఇవ్వాలని గంగూలీ పేర్కొన్నాడు.
‘‘కేవలం ఒక్క ఓటమితో టీమ్ఇండియా క్రికెట్ను తక్కువగా అంచనా వేయకూడదు. మన దగ్గర అద్భుతమైన ప్రతిభావంతులు ఉన్నారు. ఇప్పటికిప్పుడే విరాట్, పుజారాను పక్కన పెట్టేయాలని చెప్పను. ఎందుకంటే విరాట్కు ఇంకా 34 ఏళ్లే. అయితే, యువకులకు దారి ఇవ్వాల్సిన బాధ్యత వారిదే. రిజర్వ్ బెంచ్పై నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నారు. ఇది కేవలం ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవడం లేదు. టెస్టు క్రికెట్ పూర్తిగా విభిన్నమైంది. యశస్వి జైస్వాల్, రజత్ పటీదార్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ .. ఇలా యంగ్ డైనమిక్ ప్లేయర్లు సిద్ధమవుతున్నారు. పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య నా మాటలు వింటాడని అనుకుంటున్నా. తప్పకుండా అతడు మళ్లీ టెస్టు క్రికెట్లోకి అడుగు పెట్టాలి. ఇలాంటి పరిస్థితుల్లో అతడి అవసరం చాలా ఉంది’’ అని గంగూలీ తెలిపాడు.
హార్దిక్ పాండ్య చివరిసారిగా 2018లో ఇంగ్లాండ్తో జరిగిన టెస్టులో ఆడాడు. ఆ తర్వాత వెన్ను నొప్పి కారణంగా కొన్నాళ్లు క్రికెట్కు దూరమై.. తిరిగి వచ్చిన తర్వాత వన్డేలు, టీ20లకే పరిమితమయ్యాడు. ఇప్పటి వరకు 11 టెస్టులు ఆడిన హార్దిక్ 532 పరుగులు చేసి, 17 వికెట్లు తీశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
-
లాభాల్లో సూచీలు.. 75,000 ఎగువకు సెన్సెక్స్.. 22,750 పైన నిఫ్టీ
-
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక