Asia Cup 2023: భారత్ X పాక్ మ్యాచ్లో ఎవరూ ఫేవరేట్ కాదు.. సిరాజ్ ఆడాల్సిందే!
వన్డే సంగ్రామం ముందు సన్నాహకంగా మినీ టోర్నీ మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానుంది. పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఆసియా కప్ (Asia Cup 2023) కోసం ఆరు జట్లు బరిలోకి దిగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 (Asia Cup 2023) మినీ టోర్నీలో ఎవరూ ఫేవరేట్ కాదని టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ (Ganguly) వ్యాఖ్యానించాడు. దాయాదుల పోరులోనూ ఎవరు అత్యుత్తమంగా బ్యాటింగ్ చేస్తారో.. వారిదే విజయమని స్పష్టం చేశాడు. భారత్ - పాకిస్థాన్ జట్ల (IND vs PAK) మధ్య సెప్టెబంబర్ 2న మ్యాచ్ జరగనుంది. దీంతో ఇప్పుడదే హాట్టాపిక్గా మారింది. ఈ క్రమంలో ఆసియా కప్ను ఎవరు నెగ్గుతారనే అంశంపై గంగూలీ స్పందించాడు.
Team India: ఇటు ముంబయివాలా.. అటు గుజరాతీ
‘‘ఆసియా కప్లో ఫేవరేట్ ఎవరని చెప్పడం కష్టంగానే ఉంది. ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. భారత్, పాకిస్థాన్ జట్లు అద్భుతంగా ఉన్నాయి. బుమ్రా అందుబాటులోకి రావడం టీమ్ఇండియాకు అదనపు బలం. టీ20ల్లో తన ఫిట్నెస్ను నిరూపించుకున్నాడు. అయితే, ఆసియా కప్ వన్డే ఫార్మాట్ కావడంతో ఎలా బౌలింగ్ చేస్తాడనేది వేచి చూడాలి. సెలెక్షన్ కమిటీ ఉత్తమ జట్టునే ఎంపిక చేసిందని భావిస్తున్నా. ఉపఖండ పిచ్లపై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం మంచిదే. అందుకోసం బ్యాటింగ్ కూడా చేయగలిగే అక్షర్ పటేల్ ఎంపిక సరైందే. ఆసియా కప్ అయినా, ప్రపంచకప్ అయినా బ్యాటింగ్ ఆర్డర్ రాణిస్తే విజయం సాధించడం సులువు. రెండు విభిన్న టోర్నీలు అయినా ఆడే విధానం మెరుగుపర్చుకుంటూ వెళ్లాలి’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు.
తుది జట్టులో వారి కంటే సిరాజ్ బెటర్: ఆకాశ్ చోప్రా
వరల్డ్ కప్ తుది జట్టులో పేసర్ మహమ్మద్ సిరాజ్ తప్పకుండా ఉండాలని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా తెలిపాడు. వన్డేల్లో అద్భుతమైన గణాంకాలు అతడి సొంతమని పేర్కొన్నాడు. ఆసియా కప్లోనూ కీలకమవుతాడని వ్యాఖ్యానించాడు. ‘‘మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ విధానం అద్భుతం. తక్కువ కెరీర్లోనే 24 మ్యాచుల్లో 43 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 4.78. బుమ్రా, షమీ కంటే కూడా గణాంకాల్లో ఎంతో మెరుగైన బౌలర్. అందుకే ఆసియా కంటే ఇతర దేశాల మీద అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆల్రౌండర్గా శార్దూల్ ఠాకూర్ను లేదా యువ పేసర్ ప్రసిధ్ కృష్ణను ఆడించాలని చాలామంది చెబుతుంటారు. కానీ, వారిద్దరి కంటే సిరాజ్ తుది జట్టులో ఉండాల్సిందే. అతడితో మ్యాచ్లను ఆడించాలి’’ అని చోప్రా విశ్లేషించాడు.
నేటి నుంచి ప్రపంచకప్ టికెట్ల విక్రయం ప్రారంభం
ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచకప్ మ్యాచ్లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ల విక్రయాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే రిజిస్ట్రేషన్కు అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 25న రాత్రి 8 గంటల నుంచి బుక్మై షో ద్వారా టికెట్లను దక్కించుకోవచ్చు. అయితే, భారత్ ఆడే వార్మప్, టోర్నీ మ్యాచ్లు మినహా ఇతర దేశాల గేమ్లకు సంబంధించిన టికెట్లను పొందవచ్చు. భారత్ ఆడే మ్యాచ్లు ఆగస్ట్ 30, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2, సెప్టెంబర్ 3 నుంచి టికెట్ల విక్రయం జరగనుంది. సెప్టెంబర్ 15 నుంచి రెండు సెమీస్లు, ఫైనల్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఉంటాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా సంగ్రామం జరగనున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు
-
పెళ్లయిన నెలకే బావను కడతేర్చారు.. చెల్లి ప్రేమ వివాహం ఇష్టం లేని బావమరుదుల ఘాతుకం
-
మేనమామనన్నావ్.. మా కిట్లు ఆపేశావ్