IPL 2024: రూ.10 కోట్లైనా వెచ్చిస్తామని గంగూలీ ప్రామిస్ చేశారు: కుమార్ కుశాగ్రా తండ్రి
కుమార్ కుశాగ్రా (Kumar Kushagra).. ఎంఎస్ ధోనీ వంటి మెరుపు వికెట్ కీపింగ్ చేస్తాడని దేశవాళీ క్రికెట్లో పేరు సంపాదించాడు. అదే అతడిని ఐపీఎల్ వేలంలో భారీ ధరను సొంతం చేసుకునేలా చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ వేలంలో (IPL 2024 Auction) అన్క్యాప్డ్ ప్లేయర్ జాబితాలో యువ ఆటగాడు కుమార్ కుశాగ్రా రూ.7.20 కోట్లు దక్కించుకున్నాడు. వికెట్ కీపర్ అయిన కుమార్.. దేశవాళీ క్రికెట్లో ‘మరో ధోనీ’గా పేరు సంపాదించాడు. ఐపీఎల్ వేలంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో పోటీ పడిన దిల్లీ క్యాపిటల్స్ చివరికి అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో తన కుమారుడి కోసం రూ.10 కోట్ల వరకైనా వెచ్చించేలా చూస్తానని దిల్లీ క్యాపిటల్స్ మెంటార్ సౌరభ్ గంగూలీ హామీ ఇచ్చారని కుమార్ కుశాగ్రా తండ్రి శ్రీకాంత్ వెల్లడించారు. కుమార్ వికెట్ కీపింగ్తోపాటు బ్యాటింగ్ నైపుణ్యాలను గంగూలీ స్వయంగా పరిశీలించినట్లు గుర్తు చేసుకున్నారు.
‘‘ఈడెన్ గార్డెన్స్లో జరిగిన ట్రయల్స్ అనంతరం.. దిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకొంటామని గంగూలీ అన్నారు. అవసరమైతే రూ.10 కోట్ల వరకైనా వెచ్చిస్తామన్నారు. అప్పుడు ఆ మాటలు ఎంతో ఉత్సాహానిచ్చాయి. ట్రయల్స్లో కుమార్ హిట్టింగ్ గంగూలీని ఆకట్టుకుంది. మైదానంలో అతడి చురుకుదనం కూడా దాదాను మెప్పించింది. ఈ సందర్భంగా కుమార్లో ధోనీ లక్షణాలున్నాయని గంగూలీ చెప్పారు. అతడు బెయిల్స్ను పడగొట్టే తీరు అద్భుతమని ప్రశంసించాడు. రూ.20 లక్షల కనీస ధరతో కుమార్ వేలంలోకి వచ్చాడు. అప్పుడు గంగూలీ మాట ఇచ్చినా అదేదో కుమార్ను ప్రోత్సహించడానికేనని భావించా.. వేలంలో అతడి కోసం ఎవరూ ఆసక్తి చూపరని అనుకున్నా. బేస్ ప్రైస్కే దిల్లీ క్యాపిటల్స్ తీసుకుంటుందని నమ్మకంతో ఉన్నా. వేలంలో కుమార్ పేరు వచ్చిన కాసేపటి తర్వాత ఇతర ఫ్రాంచైజీలు ఆసక్తి చూపాయి’’ అని శ్రీకాంత్ కుశాగ్రా వెల్లడించారు.
నేనెప్పుడూ క్రికెట్ ఆడలేదు.. కానీ
‘‘నేను ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడలేదు. అయితే, ఆటను మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవుతా. కుమార్ ఐదేళ్ల వయసులోనే క్రికెట్పై ఆసక్తి చూపాడు. దీంతో నేనే కోచ్గా మారాలని నిర్ణయించుకున్నా. బాబ్ వూమర్ రచించిన ‘ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ క్రికెట్’ పుస్తకం చదవమని నా స్నేహితుడొకరు సూచించారు. దాంతో కనీసం నాలుగైదు సార్లు ఆ పుస్తకం చదివా. అదే నాకు శిక్షణ. నేను కుమార్కు కోచింగ్ ఇచ్చేలా చేసింది’’ అని శ్రీకాంత్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్