Tony de Zorzi: డికాక్లా వచ్చాడు.. ఎవరీ జులపాల కుర్రాడు?
వన్డేలకు డికాక్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతడి స్థానంలో ఓపెనర్గా ఆడే ఆటగాడు ఎవరు? అని దక్షిణాఫ్రికాతో పాటు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసింది. ఇప్పుడా స్థానం తనది అంటూ దూసుకొచ్చాడు టోనీ డి జోర్జి.
సూపర్ ఫామ్లో ఉండగానే వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డికాక్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాడు. చివరగా ఆడిన వన్డే ప్రపంచకప్లో అతను ఏకంగా 594 పరుగులు చేశాడు. కానీ ముందే ప్రకటించినట్లుగా వన్డేలకు గుడ్బై చెప్పేశాడు. టెస్టులకు ఇప్పటికే వీడ్కోలు పలికాడు. దీంతో డికాక్ స్థానంలో ఓపెనర్గా ఆడే ఆటగాడు ఎవరు? అని దక్షిణాఫ్రికాతో పాటు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూసింది. ఇప్పుడా స్థానం తనది అంటూ టోనీ డి జోర్జి (Tony de Zorzi) దూసుకొచ్చాడు. భారత్తో వన్డే సిరీస్లో ఓపెనర్గా సత్తాచాటాడు. దీంతో జోర్జి గురించి చర్చ మొదలైంది.
ఈ సిరీస్లో అదుర్స్..
దక్షిణాఫ్రికాలో ఆడిన గత ఆరు వన్డే సిరీస్ల్లో భారత్ కేవలం ఒక్క సిరీస్ మాత్రమే గెలిచింది. ఈ నేపథ్యంలో ఇటీవల సఫారీ గడ్డపై అడుగుపెట్టిన భారత్ టీ20 సిరీస్ను 1-1తో డ్రా చేసుకుంది. తొలి వన్డేలో విజయంతో మూడు మ్యాచ్ల సిరీస్ను దూకుడుగా ఆరంభించింది. కానీ కఠినమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పిచ్పై జరిగిన రెండో వన్డేలో భారత్కు పరాజయం ఎదురైంది. ప్రత్యర్థి జట్టులో ఓ ఆటగాడు సెంచరీతో భారత్కు విజయాన్ని దూరం చేశాడు. ఆ ఆటగాడే టోనీ డి జోర్జి. మందకొడి పిచ్పై 212 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్కు అడ్డుగోడగా జోర్జి నిలిచాడు. 119 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించి మైదానం వీడాడు. టీమ్ఇండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని, పోరాట పటిమ ప్రదర్శించాడు. ఈ సెంచరీతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ మ్యాచ్లో జట్టును గెలిపించి సిరీస్ ఆశలు నిలిపాడు. ఇక చివరిదైన మూడో వన్డేలోనూ జోర్జి రాణించాడు. 297 పరుగుల ఛేదనలో 81 పరుగులతో రాణించిన అతను ఓ దశలో జట్టును మళ్లీ విజయతీరాలకు చేర్చేలా కనిపించాడు. కానీ అతను అర్ష్దీప్ బుట్టలో పడ్డాడు. ఆ తర్వాత పట్టు బిగించిన టీమ్ఇండియా.. దక్షిణాఫ్రికాను కుప్పకూల్చి సిరీస్ దక్కించుకుంది. అంతకుముందు తొలి వన్డేలోనూ జోర్జి ఆకట్టుకున్నాడు. మొదట దక్షిణాఫ్రికా 116 పరుగులకే కుప్పకూలినప్పటికీ జోర్జి 28 పరుగులు సాధించాడు.
డికాక్ లాగే..
డికాక్ లాగే జోర్జి కూడా లెఫ్టార్మ్ బ్యాటర్. ఓపెనర్గా ఆడతాడు. పరిస్థితులకు తగ్గట్లుగా, కండీషన్స్కు అలవాటు పడి ఆడగలడు. ఇన్నింగ్స్ నిర్మించడంలో, జట్టును గెలుపు తీరాలకు చేర్చడంలో ఉత్తమంగా కనిపిస్తున్నాడు. 26 ఏళ్ల జోర్జి.. మొదటి నుంచి నిలకడగా రాణిస్తున్నాడు. 2016 అండర్-19 ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్లో పరుగుల వేటలో సాగుతూనే వచ్చాడు. ఈ ప్రదర్శనతోనే జాతీయ జట్టులోకి వచ్చాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్తో టెస్టుల్లో అడుగుపెట్టాడు. ఇప్పటివరకూ రెండు టెస్టుల్లో ఓ అర్ధశతకం సహా 114 పరుగులు చేశాడు. మార్చిలో వెస్టిండీస్తో సిరీస్తోనే వన్డేల్లోకి వచ్చాడు. 5 వన్డేల్లో 69 సగటుతో 276 పరుగులు సాధించాడు. భారత్తో రెండో వన్డేలో సెంచరీతో తొలి అంతర్జాతీయ శతకాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఆడింది తక్కువ మ్యాచ్లే అయినా ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. అన్ని రకాల షాట్లు ఆడగలనని చాటుకున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పట్టుదలతో నిలబడగలని రుజువు చేశాడు. ఇప్పుడు భారత్తో టెస్టుల్లోనూ రాణించేందుకు సిద్ధమవుతున్నాడు. డికాక్ వీడ్కోలుతో ఏర్పడ్డ ఖాళీని భర్తీ చేసే సత్తా తనకుందని జోర్జి తన ప్రదర్శనతో చెప్పాడు. దక్షిణాఫ్రికా భవిష్యత్ స్టార్గా ఎదిగా దిశగా కనిపిస్తున్నాడు. అతను ఇదే నిలకడ కొనసాగిస్తే మరో డికాక్ అవుతాడనడంలో సందేహం లేదు. మరో వైపు భారత్తో వన్డే సిరీస్తో అరంగేట్రం చేసిన పేసర్ నంద్రీ బర్గర్ కూడా ఆకట్టుకున్నాడు. మూడు మ్యాచ్ల్లో కలిపి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ మినీ వేలంలో బర్గర్ను రూ.50 లక్షలకు రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!