South Africa: సఫారీ దూకుడు మామూలుగా లేదు.. ప్రపంచకప్లో చెలరేగుతున్న దక్షిణాఫ్రికా
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) దక్షిణాఫ్రికా జట్టు ఆటను చూస్తే మిగతా జట్లకు హడలెత్తుతోంది. తొలుత బ్యాటింగ్లో అదరగొట్టేసి.. ఆనక బౌలింగ్లో విజృంభిస్తూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతోంది.
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) ఆరంభమయ్యే ముందు దక్షిణాఫ్రికాపై పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే ఆ జట్టు గత చరిత్ర చూసుకున్నా.. వారి రికార్డులను తిరగేసినా సఫారీ జట్టును కప్నకు ఫేవరెట్గా పరిగణించలేని పరిస్థితి! కానీ ప్రపంచకప్ మొదలయ్యాక దక్షిణాఫ్రికా దూకుడు ఇంకోలా ఉంది. భీకరంగా ఆడుతూ ప్రత్యర్థులను బెదరగొడుతోంది. ఒక్క నెదర్లాండ్స్పై తప్పించి.. మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ సఫారీల జోరు మాములుగా లేదు. మొదట బ్యాటింగ్కు దిగి పరుగుల వరద పారించి.. ఆపై బంతితో ప్రత్యర్థి భరతం పడుతోంది దక్షిణాఫ్రికా. గత అయిదు మ్యాచ్ల్లో నాలుగింట్లో ఆ జట్టుది ఇదే వ్యూహం.
అటు డికాక్.. ఇటు క్లాసెన్
గత అయిదు మ్యాచ్ల్లో నాలుగుసార్లు సఫారీ జట్టు 300 పరుగులు అందుకుందంటే ఆ జట్టు ఎంత దూకుడుగా ఆడుతుందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్రీలంక, ఇంగ్లాండ్పై అయితే ఆ జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. లంకపై 400 దాటిన దక్షిణాఫ్రికా.. ఇంగ్లాండ్పై 399 పరుగులు చేసింది. నిజానికి బ్యాటింగ్ కన్నా బౌలింగే దక్షిణాఫ్రికాకు బలమని విశ్లేషకులు అనుకున్నారు. ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాలు లేని జట్టుపై బ్యాటింగ్లో ఎవరికీ పెద్దగా నమ్మకం లేదు. కానీ ఉన్నట్టుండి ఆ జట్టుకు బ్యాటింగే పెద్ద బలమైపోయింది. దీనికి కారణం ఓపెనర్ క్వింటాన్ డికాక్, మిడిల్డార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్! ఈ ప్రపంచకప్లో వీర విధ్వంసం సృష్టిస్తున్న ఈ జోడీ ప్రత్యర్థి ప్రత్యర్థి బౌలర్లను లెక్కే చేయట్లేదు. డికాక్ ఆరంభంలో దూకుడుగా ఆడి పునాది వేస్తేంటే.. క్లాసెన్ స్లాగ్ ఓవర్లలో భీకరంగా ఆడుతూ బలమైన ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ముఖ్యంగా డికాక్ 5 మ్యాచ్ల్లో 3 సెంచరీలతో ఈ ప్రపంచకప్ను చిరస్మరణీయం చేసుకున్నాడు. ప్రస్తుతం 81 పైన సగటుతో 407 పరుగులు చేసిన డికాక్.. టోర్నీలోనే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక క్లాసెన్ ఏమి తక్కువ తినలేదు. సిక్స్లతో చెలరేగుతున్న అతడు 5 మ్యాచ్ల్లో 288 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్పై చేసిన మెరుపు శతకాన్ని ఎవరూ మర్చిపోలేరు.
ఈసారి ఎందాకో!
ప్రపంచకప్ అంటే చాలు ఆ జట్టు బ్యాడ్లక్ను జేబులో పెట్టుకుని బరిలో దిగుతుంది దక్షిణాఫ్రికా. అలా అని ఆ జట్టు ప్రదర్శన ఎప్పుడూ తక్కువేం కాదు. ఇప్పటిదాకా ఆడిన 8 ప్రపంచకప్పుల్లో ఆ జట్టు నాలుగుసార్లు సెమీఫైనల్కు వెళ్లింది. ఆరంభంలో అదిరేలా ఆడడం నాకౌట్లో వెనుదిరగడం సఫారీలకు అలవాటు. ఈసారి ప్రపంచకప్లోనూ సఫారీ జట్టు గట్టిగానే మొదలుపెట్టింది. అయితే ఒకప్పుటికన్నా భీకరంగా.. మ్యాచ్ మ్యాచ్కు స్థాయిని పెంచుకుంటూ పోతోంది.
నెదర్లాండ్స్పై అనూహ్యంగా తడబడినా.. ఆ తర్వాత ఇంగ్లాండ్, బంగ్లాదేశ్లకు చుక్కలు చూపించింది. ఆ జట్టుకు మొదట బ్యాటింగ్ అప్పగించాలంటే భయపడేలా ఉంది దక్షిణాఫ్రికా ఆట. ఈసారి ప్రపంచకప్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లు 6 సెంచరీలు చేస్తే అందులో ఓపెనర్ క్వింటాన్ డికాక్ ఒక్కడి వాటానే మూడు కావడం విశేషం. క్లాసెన్, వాండర్డసెన్, మార్క్రమ్ తలా శతకం బాదారు. ఐపీఎల్లో ఆడిన అనుభవం ఆ జట్టు బ్యాటర్లకు బాగా పనికొస్తోంది. ఈ కప్లో ఆ జట్టు ఓడించింది మామూలు జట్లను కాదు. ఒకటి ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్ అయితే ఇంకోటి అయిదుసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియా. ఎనిమిది పాయింట్లతో ఉన్న దక్షిణాఫ్రికా సెమీఫైనల్కు చేరుకోవడం దాదాపు లాంఛనమే. నాకౌట్లో ఆ జట్టు ఆట ఎలా ఉంటుందో అన్నదాని మీదే ఈసారి సఫారీల భవిష్యత్ ఆధారపడి ఉంది. ఇదే జోరు మున్ముందు కూడా చూపితే తొలిసారి కప్ గెలవడం సఫారీలకు పెద్ద కష్టం కాబోదు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెట్టేనా?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెట్టేనా?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు