IND vs SA: సిరీస్ కొట్టేయాలంటే... టీమ్ఇండియా వీటిపై ఓ లుక్కేయాలి!
మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువహటి వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో భారత్ విజయం సాధించి ఊపు మీదుంది. రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఎదురు చూస్తోంది.
ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్.. పొట్టి ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియా ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడం విశేషం. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత్.. సిరీస్పై కన్నేసింది. ఆదివారం ఇరు జట్ల మధ్య గువహటి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్లో ఘోర పరాభవం పొందిన దక్షిణాఫ్రికా పుంజుకొనే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో టీమ్ఇండియా దృష్టిసారించాల్సిన అంశాలేంటో ఓ సారి చూద్దాం..
బౌలింగ్ అదుర్స్.. కానీ
తొలి టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను టపాటపా పడగొట్టడంలో దీపక్ చాహర్, అర్ష్దీప్ సింగ్ కీలక పాత్ర పోషించారు. కేవలం 15 బంతుల్లో 9 పరుగులకే ఐదు వికెట్లు తీశారు. కానీ ఆ తర్వాత కాస్త పట్టు సడలించడంతో దక్షిణాఫ్రికా వందకుపైగా రన్స్ చేయడం గమనార్హం. మార్క్రమ్ (25)తోపాటు ఏడో స్థానంలో దిగిన పార్నెల్ (24), ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కేశవ్ మహరాజ్ (41) విలువైన పరుగులు చేయడంతో భారత బౌలర్ల నిర్లక్ష్యం కాస్త ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారిని త్వరగానే ఔట్ చేసి ఉండే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 40లోపే ముగిసి ఉండేది. అందుకే టాప్ ఆర్డర్ను ఒత్తిడిలోకి నెట్టినట్లే మిగతా వికెట్లపైనా పట్టు విడవకుండా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
టాప్ స్టార్లు ఇబ్బంది పడిన వేళ..
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్కు షాక్ ఇస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లీ (3) ఘోరంగా విఫలమయ్యారు. మళ్లీ బయటకు వెళ్తున్న బంతిని వెంటాడి మరీ విరాట్ పెవిలియన్కు చేరడం గమనార్హం. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51*), సూర్యకుమార్ యాదవ్ (50*) ఎంతో నింపాదిగా ఆడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. రాహుల్ నెమ్మది ఇన్నింగ్స్ కాస్త విమర్శలకు దారి తీసినా.. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడాడని అతడికి మద్దతుగా పలువురు నిలిచారు. అయితే టీ20ల్లో నిలకడ ఎంత ముఖ్యమో.. వేగంగా పరుగులు చేయడమూ కీలకం. అందుకే రాహుల్ కూడా తన బ్యాట్ స్పీడ్ను పెంచాలి. అలాగే తదుపరి మ్యాచ్లోనైనా విరాట్, రోహిత్ మళ్లీ గాడిలో పడాలి. టీ20 ప్రపంచకప్నకు ముందు ఇంకో రెండు టీ20 లను మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ లోపు ఫామ్ను కొనసాగించి మెగా టోర్నీకి సిద్ధమైపోవాలి. జట్టు కూర్పుపై కసరత్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది.
సిరాజ్కు మంచి అవకాశం
వెన్ను నొప్పి తిరగబెట్టడంతో జస్ప్రీత్ బుమ్రా టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మహమ్మద్ సిరాజ్ వచ్చాడు. ఒక వేళ తుది జట్టులో స్థానం దక్కితే మాత్రం.. సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాణిస్తే.. బుమ్రా గైర్హాజరీలో టీ20 ప్రపంచ కప్ కోసం స్టాండ్బై ఆటగాడిగా ఎంపికకు మార్గం సుగమమవుతుంది. భారత టీ20 లీగుల్లో ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. టీమ్ఇండియా తరఫున మాత్రం స్థానం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వచ్చిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.
దక్షిణాఫ్రికాతో సులభం కాదు
ఓటమితో ఉన్న దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారత్కు ఎదురు దెబ్బ తగలక తప్పదు. తొలి మ్యాచ్లో విఫలమైన డికాక్, బవుమా, రోసోవ్ను తక్కువగా అంచనా వేయొద్దు. అలాగే మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ డేంజరస్ ఆటగాళ్లు. జూనియర్ మిస్టర్ 360గా పేరొందిన ట్రిస్టన్ స్టబ్స్ క్రీజ్లో నిలదొక్కుకుంటే మాత్రం వీరబాదుడు బాదుతారు. టాస్ కీలకంగా మారే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం టీమ్ఇండియా భారీ స్కోరు సాధించాలి. లేకపోతే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికాకు 200 స్కోరు కూడా కష్టమేమీ కాదు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, బవుమా (కెప్టెన్), రోసోవ్, ఐదెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్, రబాడ, నోకియా, షంసి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్