IND vs SA: సిరీస్ కొట్టేయాలంటే... టీమ్ఇండియా వీటిపై ఓ లుక్కేయాలి!
మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఆదివారం భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య గువహటి వేదికగా రెండో మ్యాచ్ జరగనుంది. తొలి టీ20లో భారత్ విజయం సాధించి ఊపు మీదుంది. రెండో మ్యాచ్లోనూ గెలిచి సిరీస్ను కైవసం చేసుకోవాలని ఎదురు చూస్తోంది.
ఆదివారం దక్షిణాఫ్రికాతో రెండో టీ20 మ్యాచ్
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా-భారత్ జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్.. పొట్టి ప్రపంచకప్ ముంగిట టీమ్ఇండియా ఆడుతున్న ఆఖరి టీ20 సిరీస్ ఇదే కావడం విశేషం. తొలి మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత్.. సిరీస్పై కన్నేసింది. ఆదివారం ఇరు జట్ల మధ్య గువహటి వేదికగా రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్లో ఘోర పరాభవం పొందిన దక్షిణాఫ్రికా పుంజుకొనే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో టీమ్ఇండియా దృష్టిసారించాల్సిన అంశాలేంటో ఓ సారి చూద్దాం..
బౌలింగ్ అదుర్స్.. కానీ
తొలి టీ20 మ్యాచ్లో దక్షిణాఫ్రికా బ్యాటర్లను టపాటపా పడగొట్టడంలో దీపక్ చాహర్, అర్ష్దీప్ సింగ్ కీలక పాత్ర పోషించారు. కేవలం 15 బంతుల్లో 9 పరుగులకే ఐదు వికెట్లు తీశారు. కానీ ఆ తర్వాత కాస్త పట్టు సడలించడంతో దక్షిణాఫ్రికా వందకుపైగా రన్స్ చేయడం గమనార్హం. మార్క్రమ్ (25)తోపాటు ఏడో స్థానంలో దిగిన పార్నెల్ (24), ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన కేశవ్ మహరాజ్ (41) విలువైన పరుగులు చేయడంతో భారత బౌలర్ల నిర్లక్ష్యం కాస్త ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. వారిని త్వరగానే ఔట్ చేసి ఉండే దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 40లోపే ముగిసి ఉండేది. అందుకే టాప్ ఆర్డర్ను ఒత్తిడిలోకి నెట్టినట్లే మిగతా వికెట్లపైనా పట్టు విడవకుండా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది.
టాప్ స్టార్లు ఇబ్బంది పడిన వేళ..
దక్షిణాఫ్రికా నిర్దేశించిన 107 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్కు షాక్ ఇస్తూ కెప్టెన్ రోహిత్ శర్మ (0), విరాట్ కోహ్లీ (3) ఘోరంగా విఫలమయ్యారు. మళ్లీ బయటకు వెళ్తున్న బంతిని వెంటాడి మరీ విరాట్ పెవిలియన్కు చేరడం గమనార్హం. అయితే మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (51*), సూర్యకుమార్ యాదవ్ (50*) ఎంతో నింపాదిగా ఆడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. రాహుల్ నెమ్మది ఇన్నింగ్స్ కాస్త విమర్శలకు దారి తీసినా.. పిచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆడాడని అతడికి మద్దతుగా పలువురు నిలిచారు. అయితే టీ20ల్లో నిలకడ ఎంత ముఖ్యమో.. వేగంగా పరుగులు చేయడమూ కీలకం. అందుకే రాహుల్ కూడా తన బ్యాట్ స్పీడ్ను పెంచాలి. అలాగే తదుపరి మ్యాచ్లోనైనా విరాట్, రోహిత్ మళ్లీ గాడిలో పడాలి. టీ20 ప్రపంచకప్నకు ముందు ఇంకో రెండు టీ20 లను మాత్రమే ఆడే అవకాశం ఉంది. ఈ లోపు ఫామ్ను కొనసాగించి మెగా టోర్నీకి సిద్ధమైపోవాలి. జట్టు కూర్పుపై కసరత్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది.
సిరాజ్కు మంచి అవకాశం
వెన్ను నొప్పి తిరగబెట్టడంతో జస్ప్రీత్ బుమ్రా టీ20 సిరీస్ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో మహమ్మద్ సిరాజ్ వచ్చాడు. ఒక వేళ తుది జట్టులో స్థానం దక్కితే మాత్రం.. సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రాణిస్తే.. బుమ్రా గైర్హాజరీలో టీ20 ప్రపంచ కప్ కోసం స్టాండ్బై ఆటగాడిగా ఎంపికకు మార్గం సుగమమవుతుంది. భారత టీ20 లీగుల్లో ఫర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. టీమ్ఇండియా తరఫున మాత్రం స్థానం సుస్థిరం చేసుకోలేకపోతున్నాడు. ఇప్పుడు వచ్చిన ఛాన్స్ను సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తు బాగుంటుంది.
దక్షిణాఫ్రికాతో సులభం కాదు
ఓటమితో ఉన్న దక్షిణాఫ్రికాను తేలిగ్గా తీసుకుంటే మాత్రం భారత్కు ఎదురు దెబ్బ తగలక తప్పదు. తొలి మ్యాచ్లో విఫలమైన డికాక్, బవుమా, రోసోవ్ను తక్కువగా అంచనా వేయొద్దు. అలాగే మార్క్రమ్, డేవిడ్ మిల్లర్ డేంజరస్ ఆటగాళ్లు. జూనియర్ మిస్టర్ 360గా పేరొందిన ట్రిస్టన్ స్టబ్స్ క్రీజ్లో నిలదొక్కుకుంటే మాత్రం వీరబాదుడు బాదుతారు. టాస్ కీలకంగా మారే అవకాశం ఉండటంతో తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం టీమ్ఇండియా భారీ స్కోరు సాధించాలి. లేకపోతే పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన దక్షిణాఫ్రికాకు 200 స్కోరు కూడా కష్టమేమీ కాదు.
తుది జట్లు (అంచనా):
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, అశ్విన్, అక్షర్ పటేల్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్, దీపక్ చాహర్
దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్, బవుమా (కెప్టెన్), రోసోవ్, ఐదెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, పార్నెల్, కేశవ్ మహరాజ్, రబాడ, నోకియా, షంసి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు