Meg Lanning: ఏడు ప్రపంచకప్లు.. ఎన్నో రికార్డులు... ఆటకు లానింగ్ వీడ్కోలు
క్రీజులో అడుగుపెట్టిందంటే ఆమె ధనాధన్ బ్యాటింగ్కు ఫిదా కావాల్సిందే. కెప్టెన్గా మైదానంలో దిగి వ్యూహాలు పన్నిందంటే విజయం దక్కాల్సిందే. బ్యాటింగ్లో ఆమె విధ్వంసం.. కెప్టెన్సీలో ఆమె నైపుణ్యం.. మొత్తంగా ఆమె ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం.
క్రీజులో అడుగుపెట్టిందంటే ఆమె ధనాధన్ బ్యాటింగ్కు ఫిదా కావాల్సిందే. కెప్టెన్గా మైదానంలో దిగి వ్యూహాలు పన్నిందంటే విజయం దక్కాల్సిందే. బ్యాటింగ్లో ఆమె విధ్వంసం.. కెప్టెన్సీలో ఆమె నైపుణ్యం.. మొత్తంగా ఆమె ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం. ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకూ ఏ కెప్టెన్ సాధించని రికార్డులు ఆమె సొంతం. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు ప్రపంచకప్లు.. ఇందులో కెప్టెన్గా అయిదు ఆమె ఖాతాలో ఉన్నాయి. ‘ది మెగాస్టార్’గా పిలుచుకునే ఆమె మహిళల క్రికెట్లో నిజంగానే మెగాస్టార్. ఆమెనే 31 ఏళ్ల మెగ్ లానింగ్ (Meg Lanning). ఆసీస్ మహిళల జట్టును అత్యున్నత శిఖరాల వైపు నడిపించి.. అమ్మాయిల క్రికెట్లో తనదైన ముద్ర వేసిన ఆమె ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. 13 ఏళ్ల సుదీర్ఘ కెరీర్కు తెరదించింది. అయినా ఆమె సాగించిన రికార్డుల ప్రయాణం.. విజయాల ప్రస్థానం ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మేటి కెప్టెన్..
జట్టుకు ఒక్క ప్రపంచకప్ అందిస్తేనే ఆ కెప్టెన్ను దిగ్గజంగా అభివర్ణిస్తారు. ఆకాశానికి ఎత్తేస్తారు. అలాంటిది ఆసీస్కు అయిదు ప్రపంచకప్లు అందించిన లానింగ్ను ఏమని పిలవాలి? ఎంతని పొగడాలి? ఆమె ఖాతాలో 2012, 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్లు.. 2013, 2022 వన్డే ప్రపంచకప్లున్నాయి. కెప్టెన్గా 2022 వన్డే ప్రపంచకప్.. 2014, 2018, 2020, 2023 టీ20 ప్రపంచకప్లు.. 2015, 2019, 2022 యాషెస్ సిరీస్ విజయాలు సాధించింది. నిరుడు కామన్వెల్త్ క్రీడల్లో దేశానికి పసిడి అందించింది. 182 మ్యాచ్ల్లో ఆసీస్ కెప్టెన్గా వ్యవహరించిన ఆమె 80 శాతం విజయాలు ఉండటం విశేషం. 2014లో సారథ్య బాధ్యతలు చేపట్టిన ఆమె అతిపిన్న వయస్సు ఆసీస్ సారథిగా చరిత్ర సృష్టించింది. ప్రపంచ క్రికెట్లో అత్యధిక ఐసీసీ ట్రోఫీలు నెగ్గిన కెప్టెన్ ఆమెనే. రికీ పాంటింగ్ (4)ను దాటింది. వన్డేల్లో, టీ20ల్లో వరుసగా 88.46, 76 విజయశాతాలతో ప్రపంచ రికార్డులూ తనే సొంతం చేసుకుంది. ఆమె సారథ్యంలో వన్డేల్లో ఆసీస్ వరుసగా 26 విజయాలు సాధించడమూ ప్రపంచ రికార్డే. చివరగా ఈ ఏడాది టీ20 ప్రపంచకప్లో జట్టుకు సారథిగా వ్యవహరించింది.
సింగపూర్లో పుట్టి..
లానింగ్ సింగపూర్లో జన్మించింది. ఆ తర్వాత సిడ్నీకి వలస వెళ్లిన ఆమె కుటుంబం, అనంతరం మెల్బోర్న్లో స్థిరపడింది. రికీ పాంటింగ్, పాల్ కెల్లీ లాంటి ప్లేయర్లను ఆరాధిస్తూ క్రికెట్లో ఎదిగింది. 2010 డిసెంబర్లో టీ20తో అంతర్జాతీయ క్రికెట్లో లానింగ్ అడుగుపెట్టింది. 2011లో వన్డే అరంగేట్రం చేసింది. ఇంగ్లాండ్పై 18 ఏళ్ల వయసులోనే శతకం చేసి ఆసీస్ తరపున సెంచరీ చేసిన అతిపిన్న వయస్సు క్రికెటర్ (పురుషుల క్రికెట్లో కలిపి)గా రికార్డు నమోదు చేసింది. న్యూజిలాండ్పై 45 బంతుల్లోనే శతకం చేసిన ఆమె.. వన్డేల్లో ఆస్ట్రేలియా తరపున అత్యంత వేగంగా శతకం చేసిన మహిళా క్రికెటర్గా నిలిచింది. 2013 వన్డే ప్రపంచకప్లో ఆస్ట్రేలియా విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. 2013 మహిళల యాషెస్ సిరీస్తో లానింగ్ టెస్టుల్లో అడుగుపెట్టింది. 2014 టీ20 ప్రపంచకప్లో సారథ్యంతో పాటు బ్యాటర్గానూ లానింగ్ సత్తాచాటింది.
ఆరు ఇన్నింగ్స్ల్లో 257 పరుగులతో టోర్నీ టాప్స్కోరర్గా నిలిచింది. అంతే కాకుండా కెప్టెన్సీతో సత్తాచాటి జట్టును విశ్వవిజేతగా నిలిచింది. ఆ టోర్నీలో ఐర్లాండ్తో మ్యాచ్లో కేవలం 65 బంతుల్లోనే 126 పరుగులు చేసి అప్పుడు మహిళల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో 2 వేల పరుగులు చేసిన తొలి ఆసీస్ బ్యాటర్ ఆమెనే. మహిళల క్రికెట్లో అత్యధిక వన్డే సెంచరీల (15) రికార్డూ తనదే. టీ20ల్లో రెండు శతకాలు సాధించింది. అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆసీస్ మహిళా క్రికెటర్ ఆమెనే. 241 మ్యాచ్ల్లో 8,352 పరుగులు చేసింది. అయితే 2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్లో వెస్టిండీస్, 2017 వన్డే ప్రపంచకప్ సెమీస్లో భారత్ చేతిలో ఆసీస్ ఓడటం, 2017లో భుజానికి శస్త్రచికిత్స కారణంగా ఆటకు దూరమవడంతో లానింగ్ పనైపోయిందనే విమర్శలు వచ్చాయి. కానీ ఆరు నెలల తర్వాత మళ్లీ తిరిగొచ్చి అదరగొట్టింది.
వరుసగా 2018, 2020 టీ20 ప్రపంచకప్ల్లో జట్టును విజేతగా నిలిపింది. 2022 ఆగస్టులో వ్యక్తిగత కారణాల వల్ల ఆటకు విరామం తీసుకుని తిరిగి 2023 జనవరిలో పునరాగమనం చేసింది. పొట్టికప్పులో దేశానికి మరో ట్రోఫీ అందించింది. లానింగ్ 6 టెస్టుల్లో 345 పరుగులు చేసింది. 103 వన్డేల్లో 53.51 సగటుతో 4602 పరుగులు, 132 టీ20ల్లో 3405 పరుగులు సాధించింది. అనారోగ్య కారణాలతో గత మూడు సిరీస్లకు దూరంగా ఉన్న ఆమె.. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్నే వదిలేసింది. లీగ్ల్లో మాత్రం కొనసాగుతానని ప్రకటించింది. మహిళల క్రికెట్లో ఇలాంటి కెప్టెన్, బ్యాటర్ను మళ్లీ చూసే అవకాశం లేదంటే అతిశయోక్తి కాదు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు