KL Rahul : రాహుల్ ఈ పరీక్షలో నెగ్గితే ప్రతీకారం... ఓడిపోతే కెప్టెన్సీకి పోటీ తీవ్రం!
దక్షిణాఫ్రికా సిరీస్లో కేఎల్ రాహుల్ (KL Rahul) కెప్టెన్గా రాణిస్తాడా? అవకాశాలెంత? ఒకవేళ రాణించకపోతే...
కెరీర్లో చాలా ఆటుపోట్లు చూశాడు లోకేశ్ రాహుల్ ఉరఫ్ కేఎల్ రాహుల్ (KL Rahul). ఇప్పుడిప్పుడే జట్టులో కీలక సభ్యుడిగా ఎదుగుతున్నాడు. ఆటను మెచ్చి ఇటీవల కెప్టెన్సీ ఇచ్చారు. అయితే తొలి పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికా సిరీస్ (India vs South Africa Series) రూపంలో రెండో పరీక్ష మొదలవుతోంది. ఈ సిరీస్లో రాహుల్ కెప్టెన్గా ఏం చేస్తాడు అనేదే ప్రశ్న. ఈ నేపథ్యంలో భారత్ సిరీస్ నెగ్గితే ఏమవుతుంది, ఓడితే ఏమవుతుందో ఓసారి చూద్దాం!
జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభమయ్యే టీ20 సిరీస్ భారత జట్టుకు చాలా కీలకం. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లాంటి మేటి, సీనియర్ ప్లేయర్లు లేకుండా ఆడుతున్నారు. ఇందులో భారత్ విజయం సాధిస్తే సీనియర్లు లేకున్నా గెలిచారనే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే ఇది జట్టుగా చూస్తే. కెప్టెన్సీ ప్రకారం చూస్తే రోహిత్ శర్మ తర్వాత ఎవరు అనే ప్రశ్నకు... రాహులే అనే ఆన్సర్ దొరుకుతుంది. అయితే ఇదంత ఈజీ కాదు అంటున్నారు మాజీలు. కారణం రాహుల్ రీసెంట్ పర్ఫార్మెన్సే. ఆటగాడిగా కాదు, కెప్టెన్గా.
కెప్టెన్గా అంతంతే...
కేఎల్ రాహుల్ ఇప్పటివరకు కెప్టెన్సీ చేసింది నాలుగు మ్యాచ్లకే. అందులో ఒకటి టెస్టు కాగా, మూడు టీ20లు. ఈ ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన ఓ టెస్టుకి కెప్టెన్సీ వహించాడు. ఆ తర్వాత మూడు టీ20ల సిరీస్కి కూడా జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే ఈ నాలుగింటిలోనూ భారత్ ఓడిపోయింది. దీంతో రాహుల్ కెప్టెన్సీ మీద విమర్శలు, కౌంటర్లు, మీమ్స్ కనిపించాయి. కెప్టెన్గా రాహుల్ ఎంపిక సరైనదేనా? అనే ప్రశ్న టీమిండియా అభిమానుల్లో కలిగేలా చేశాడు. మరోవైపు టీ20 లీగ్లో కెప్టెన్సీలో లోపాలున్నాయని మాజీలు అంటున్నారు. అందుకే తొలుత బాగా ఆడినా ఫైనల్కు లఖ్నవూ చేరలేదని విశ్లేషించారు.
ఇప్పుడు మళ్లీ అదే దక్షిణాఫ్రికాతో మరో టీ20 సిరీస్కి కెప్టెన్గా చేస్తున్నాడు రాహుల్. అదే 9 నుంచి మొదలవుతుంది. ఇందులో భారత జట్టును రాహుల్ గెలిపిస్తే ప్రొటీజ్ జట్టు మీద ప్రతీకారం తీరినట్లు అవుతుంది. బోనస్గా కెప్టెన్సీ ఛాన్స్లు బలంగా ఉంటాయి. ఒకవేళ ఓడితే వెనుక మరో ముగ్గురు యువ క్రికెటర్లు కెప్టెన్సీ కోసం సిద్ధంగా ఉన్నారు. టీమిండియా చరిత్రలో ఇలా ఓ పార్ట్ టైమ్ కెప్టెన్కు ఇంతమంది పోటీ ఉండటం అరుదు అనే చెప్పాలి.
పోటీ వీరి నుంచే...
ప్రస్తుతం టీమిండియాలో చూస్తే రిషభ్ పంత్, హార్దిక్ పాండ్య, శ్రేయస్ అయ్యర్ లాంటి యువ క్రికెటర్లు సిద్ధంగా ఉన్నారు. వీరి కెప్టెన్సీ ఎలా ఉంటుందో ఇప్పటికే టీ20లీగ్లో చూశాం కూడా. తొలుతగా రిషభ్ పంత్ను తీసుకుంటే... లీగ్లో దిల్లీని చక్కగానే నడిపించాడు. అందుకే జట్టు ఐదో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ప్రస్తుతం అతను వైస్ కెప్టెన్. కాబట్టి రాహుల్ విఫలమైతే తొలుత ఛాన్స్ వచ్చేది పంత్కే అంటున్నారు సీనియర్లు.
కెప్టెన్సీ పోటీదారుడిగా వైస్కెప్టెన్నే ఎందుకు ఉండాలి.. వేరే ఆటగాడు రేసులోకి రాకూడదా అనుకుంటే.. వినిపించే తొలి పేరు హార్దిక్ పాండ్య. ఈ ఏడాది టీ20 లీగ్లో గుజరాత్ను ముందుండి నడిపించి విజేతగా నిలిపాడు. అన్ని విభాగాలను ఎంతో పట్టుతో హ్యాండిల్ చేశాడని సీనియర్లు తెగమెచ్చేసుకున్నారు. నిజానికి విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్సీ అర్హత ఉన్న కుర్ర క్రికెటర్లలో హార్దిక్ తొలి స్థానంలో ఉండేవాడు. ఫామ్ లేమి, గాయాలతో జట్టు నుంచి స్థానం కోల్పోయాడు. కెప్టెన్సీ పోటీదారుడి అర్హత కూడా కోల్పోయాడు. అయితే టీ20 లీగ్తో తిరిగి బలంగా పోటీలోకి వచ్చాడు.
ఇక మిగిలింది శ్రేయస్ అయ్యర్. కెప్టెన్గా తొలిసారి కోల్కతా జట్టును ఈ ఏడాది లీగ్లో నడిపించాడు. అయితే జట్టు సమతూకంలో సమస్యలు వచ్చి ప్లే ఆఫ్స్కి చేరలేకపోయింది. కానీ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో మాత్రం మ్యాజిక్ ఉందని సీనియర్లు అంటున్నారు. వచ్చే సీజన్లలో అయ్యర్ నుంచి ఆ మ్యాజిక్ చూడొచ్చంటున్నారు. ఆ లెక్కన శ్రేయస్ ఆఖరి పోటీదారుడు అవుతాడు. అయితే కెప్టెన్సీ పోటీలో తనకంటే ముందున్న పంత్, పాండ్య కంటే మైదానంలో శ్రేయస్ చాలా కూల్గా ఉంటాడు. ఇది బాగా కలిసొచ్చే అంశం.
ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా సిరీస్ భారత భవిష్యత్తు కెప్టెన్ను నిర్ణయిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. రోహిత్ శర్మ వయసు రీత్యా ఇంకా ఎన్నాళ్లు కెప్టెన్సీ కొనసాగిస్తాడు అనేది తెలియడం లేదు. అందులో టీ20 లీగ్లో ముంబయి పేలవ ప్రదర్శన.. రోహిత్ టీ20 కెప్టెన్సీ మీద ప్రభావం చూపిస్తుందేమో అనే భయాలున్నాయి. దీంతోనే తర్వాతి కెప్టెన్ ఎవరు అనే ప్రశ్న, చర్చ, విశ్లేషణలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం