Rachin Ravindra: రాహుల్ + సచిన్ = రచిన్... అదరగొడుతున్న కివీస్ ఆల్రౌండర్
ఆ తల్లిదండ్రులకు బాబు పుట్టాడు. అతనికి ఏం పేరు పెట్టాలా? అని తెగ ఆలోచిస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్ ఆటంటే మహా ఇష్టం. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాల పేరు కలిసేలా తనయుడికి నామకరణం చేశారు.
ఆ తల్లిదండ్రులకు బాబు పుట్టాడు. అతనికి ఏం పేరు పెట్టాలా? అని తెగ ఆలోచిస్తున్నారు. ఆ తల్లిదండ్రులకు భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్ ఆటంటే మహా ఇష్టం. దీంతో ఈ ఇద్దరు దిగ్గజాల పేరు కలిసేలా తనయుడికి నామకరణం చేశారు. రాహుల్ పేరులో నుంచి ‘ర’.. సచిన్ పేరులో నుంచి ‘చిన్’ తీసుకుని రచిన్ అని మొదటి పేరు పెట్టారు. పూర్తిగా రచిన్ రవీంద్ర (Rachin Ravindra) అని పెట్టారు. ఈ పేరు ఇప్పుడు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటున్నారా? ఇప్పుడు జరుగుతున్న ప్రపంచకప్ (World Cup 2023)లో అందరూ మాట్లాడుకుంటుంది ఈ రచిన్ రవీంద్ర గురించే. న్యూజిలాండ్ (New Zealand) తరపున ఈ యువ ఆల్రౌండర్ అదరగొడుతూ.. తన పేరు మార్మోగేలా చేసుకున్నాడు. భారత సంతతి కుటుంబం, చిన్నప్పటి నుంచే క్రికెట్పై ప్రేమ, బాస్కెట్బాల్ దిగ్గజాన్ని ఆరాధించడం, అనంతపురంలో శిక్షణ.. ఇలా రచిన్ కథలో ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి.
ఓ 13 ఏళ్ల వెనక్కి వెళ్తే.. అది లోవర్ హట్ వెల్లింగ్టన్లోని హట్ రీక్రియేషన్ మైదానం. అప్పుడు అక్కడ క్రికెట్ వెల్లింగ్టన్ యూత్ డెవలప్మెంట్ కోచ్గా ఉన్న ఇవాన్ టిసెరా.. 10 ఏళ్ల బాలుడిని ప్యాడ్లు కట్టుకుని బ్యాటింగ్ చేయమన్నాడు. ఆ నాలుగున్నర అడుగుల బాలుడు ధైర్యంగా స్టంప్స్ ముందు నిలబడ్డాడు. ఎదురుగా చూస్తేనేమో సుమారు ఆరడగుల పేసర్ హెన్రీ వాల్ష్. ఈ బాలుడికి ఇతనితో ఎందుకు బౌలింగ్ చేయిస్తున్నాడని అక్కడున్న వాళ్లందరిలోనూ సందేహం కలిగింది. ఆ బాలుడు తట్టుకోగలడా? అనే ప్రశ్నలు రేకెత్తాయి. కానీ 20 నిమిషాలు గడిచాయి. అప్పుడందరూ ఆ బాలుడి బ్యాటింగ్ను మెచ్చుకుంటున్నారు. ఆ పేసర్ బౌలింగ్లో అద్భుతమైన బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించిన ఆ బాలుడే రచిన్ రవీంద్ర.
మన దగ్గరే..
రచిన్ తల్లిదండ్రులు రవి కృష్ణమూర్తి, దీప కృష్ణమూర్తి. రవి బెంగళూరులో క్లబ్ స్థాయి క్రికెట్ ఆడేవాడు. 1990ల్లో కుటుంబంతో న్యూజిలాండ్కు వలస వెళ్లారు. అయినా క్రికెట్పై ఇష్టంతో రవి.. అక్కడ హాట్ హాక్స్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేశాడు. రవికి టీమ్ఇండియా మాజీ ఆటగాడు జవగళ్ శ్రీనాథ్ మంచి మిత్రుడు. దీంతో తన క్లబ్ తరపున రవి భారత్కూ ఆటగాళ్లను తీసుకొస్తున్నాడు. వెల్లింగ్టన్లోనే పుట్టిన రచిన్కు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి పట్టుకుంది. మూడేళ్ల వయసులో ప్లాస్టిక్ బ్యాటు పట్టుకుని, బంతి వేయాలని తల్లిదండ్రులను అడిగేవాడు. ఇప్పుడు బ్యాట్, బంతి మారింది అంతే.. ఆటపై అతని ప్రేమ అలాగే కొనసాగుతోంది. అదే అతణ్ని ఈ స్థాయికి తెచ్చింది.
తండ్రే అతనికి క్రికెట్ ఓనమాలు నేర్పాడు. రచిన్ కెరీర్లో తెలుగు గడ్డ పాత్ర కూడా ఉందనే చెప్పాలి. హాట్ హాక్స్ క్రికెట్ క్లబ్ తరపున వచ్చి అనంతపురంలోని రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్లో నాలుగేళ్ల పాటు శీతాకాలంలో ప్రాక్టీస్ కొనసాగించాడు. ఈ క్లబ్ తరపున ఉప్పల్ స్టేడియంలోనూ మ్యాచ్లాడాడు. మరోవైపు రచిన్ ధరించే 8వ నంబర్ జెర్సీ వెనుక మరో కథ ఉంది. దివంగత దిగ్గజ బాస్కెట్బాల్ ప్లేయర్ కోబి బ్రయాంట్ను ఆరాధించే రచిన్.. ఎన్బీఏలో మొదటిసారి ఆడినప్పుడు బ్రయాంట్ వేసుకున్న జెర్సీ నంబర్ 8నే ఇప్పుడు తన జెర్సీ నంబర్గా మార్చుకున్నాడు.
ఎదిగాడిలా..
రచిన్ కివీస్ తరపున.. 2016, 2018లో అండర్-19 ప్రపంచకప్ ఆడాడు. న్యూజిలాండ్- ఎ జట్టు, దేశవాళీల్లో వెల్లింగ్టన్ తరపున రాణించాడు. 2021లో బంగ్లాదేశ్తో టీ20లతో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను భారత్పైనే తొలి టెస్టు ఆడటం విశేషం. నిరుడు ఇంగ్లాండ్ కౌంటీల్లోనూ డర్హం జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కౌంటీ అరంగేట్రంలోనే డబుల్ సెంచరీ బాదాడు. ఈ ఏడాదే వన్డేల్లో అడుగుపెట్టాడు. మైకెల్ బ్రాస్వెల్ గాయం రచిన్కు వరంగా మారింది. మొదట ఈ ప్రపంచకప్ జట్టు ఎంపిక పరిగణలో రచిన్ లేడు. కానీ బ్రాస్వెల్ గాయంతో అందుబాటులో లేకపోవడంతో రచిన్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. భారత్లోని స్పిన్ పిచ్లపై అతను జట్టుకు కీలకమవుతాడని కివీస్ భావించింది.
కానీ ఇప్పుడు టాప్ఆర్డర్ బ్యాటర్గానూ సత్తాచాటుతున్నాడు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి అజేయ సెంచరీ చేశాడు. ప్రపంచకప్ అరంగేట్ర మ్యాచ్లో సెంచరీ చేసిన మూడో కివీస్ ఆటగాడిగా నిలిచాడు. 82 బంతుల్లోనే మూడంకెల స్కోరు చేరుకున్న అతను.. ప్రపంచకప్లో న్యూజిలాండ్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీని నమోదు చేశాడు. నెదర్లాండ్స్తో మ్యాచ్లోనూ అర్ధశతకం సాధించాడు. ఉప్పల్ పిచ్ పరిస్థితులపై అవగాహన ఉన్న రచిన్ పాకిస్థాన్తో వార్మప్ మ్యాచ్లో 97 పరుగులు చేశాడు. బౌలింగ్లోనూ కీలక వికెట్లు పడగొడుతున్నాడు. 23 ఏళ్లకే గొప్ప పరిణతి ప్రదర్శిస్తున్న అతను.. భవిష్యత్లో అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదగడం ఖాయమనే చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య