Rinku Singh: రింకూ ఆ పాత్రకు సరిపోతాడా!
భారత క్రికెట్ జట్టులో అయిదు-ఆరు స్థానాలు చాలా కీలకం! ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినా.. లేక ఛేదనకు దిగినా ఆ స్థానంలో వచ్చే బ్యాటర్ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. మరెంతో ఒత్తిడి ఉంటుంది.
భారత క్రికెట్ జట్టులో అయిదు-ఆరు స్థానాలు చాలా కీలకం! ఎందుకంటే మొదట బ్యాటింగ్ చేసినా.. లేక ఛేదనకు దిగినా ఆ స్థానంలో వచ్చే బ్యాటర్ మీద ఎంతో బాధ్యత ఉంటుంది. మరెంతో ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా లక్ష్యాన్ని ఛేదిస్తున్నప్పుడు టెయిలెండర్ల అండతో జట్టుకు విజయాన్ని అందించాల్సి వస్తుంది. ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. ఇలాంటి పాత్రను ఒకప్పుడు మహేంద్రసింగ్ ధోని అద్భుతంగా పోషించాడు. యువరాజ్, రైనా కూడా కొన్నేళ్లు ఈ స్థానాల్లో ఒదిగిపోయారు. కానీ వాళ్లెవరూ ఇప్పుడు జట్టులో లేరు. ఆ తర్వాత చాలామంది వచ్చినా కుర్చీల ఆటలో మారిపోయింది ఫినిషర్ పాత్ర. కొత్తగా జట్టులోకి వచ్చిన రింకు సింగ్ (Rinku Singh) మాత్రం ఫినిషర్ పాత్రకు టైలర్మేడ్లా కనిపిస్తున్నాడు. కూల్గా ఆడుతూ జట్టును ఆదుకుంటున్నాడు. మరి అతడు ఈ పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతాడా!
ఐపీఎల్లో ఆ ఆట చూసి
2023 ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ తరఫున రింకు సింగ్ ఆట చూసి అబ్బురపడని వాళ్లు లేరు. అంతగా ఆకట్టుకున్నాడీ లెఫ్ట్ హ్యాండర్. గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో యశ్ దయాళ్ ఓవర్లో వరుసగా అయిదు సిక్స్లు బాదేసి కోల్కతాకు సంచలన విజయాన్ని అందించాడు. ఆ ఒక్క ఇన్నింగ్స్ రింకూను ఎక్కడికో తీసుకెళ్లింది. అతడిపై అంచనాలను పెంచేసింది. అక్కడి నుంచి రింకూ ఫినిషర్గా మారిపోయాడు. అంచనాలను అందుకుంటూ ముందుకు సాగాడు. ఈ స్థిరత్వమే అతడికి భారత జట్టులో చోటు కల్పించింది. ఆసియా క్రీడల్లో టీమ్ఇండియాకు ప్రాతినిథ్యం వహించి జట్టు స్వర్ణం గెలవడంలో కీలకపాత్ర పోషించాడీ లెఫ్ట్ హ్యాండర్. పేద కుటుంబంలో పుట్టినా సీనియర్ క్రికెటర్ల అండతో ఎదిగిన రింకూ భారత జట్టుకు ఆడడం పెద్ద కలే.
👉 Follow EENADU WhatsApp Channel
కానీ ఐపీఎల్ అతడికి ఈ సువర్ణావకాశాన్ని తెచ్చి పెట్టింది. కోల్కతాకు ఫినిషర్గా సమర్థంగా పాత్ర పోషించిన రింకు.. ఇప్పుడు భారత జట్టుకు అదే పాత్ర ఒదిగిపోతున్నాడు. అతడు విధ్వంసక బ్యాటర్గా మారడం వెనుక కోల్కతా కోచ్ అభిషేక్ నాయర్ది కీలకపాత్ర. ఇటీవల ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ రింకు ఆకట్టుకున్నాడు. విశాఖపట్నంలో జరిగిన తొలి మ్యాచ్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది వాహ్వా అనిపించాడు. మూడో టీ20లోనూ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడికి లొంగకుండా అతడు ఆడుతున్న తీరు మహేంద్రసింగ్ ధోనిని తలపిస్తోంది. వచ్చిన దగ్గర నుంచి బాదేయడం అంటే అందరికి కుదరదు. ముందు కుదురుకోవాలి. ఆ తర్వాత భారీ షాట్లకు దిగాలి అనే చూస్తారు. కానీ రింకు వాళ్లకు భిన్నం. తొలి బంతికి సిక్సర్ కొట్టగలడు. ఆఖరి బంతినీ స్టాండ్స్లోకి పంపగలడు. ఈ పవర్ హిట్టింగ్ ప్రత్యర్థి బౌలర్లలో కలవరం రేపుతోంది.
ముందుంది దక్షిణాఫ్రికా..
రింకు ప్రస్తుతం గొప్పగానే ఆడుతున్నాడు. ఐస్ కూల్ పెర్ఫార్మెన్స్లతో అదరగొడుతున్నాడు. కానీ అతడు మున్ముందు మరిన్ని పరీక్షలు ఎదుర్కొని రాటుదేలాలి. పేస్ బౌలింగ్కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్లపై సత్తా చాటడం రింకుకు అత్యావశ్యకం. ఆ తర్వాత 2024 ఐపీఎల్నూ ఆ ఫామ్ను కొనసాగిస్తే కచ్చితంగా వచ్చే ఏడాది వెస్టిండీస్-అమెరికా వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్లో రింకును భారత జట్టులో చూడొచ్చు. సీనియర్ ఆటగాళ్లు రోహిత్శర్మ, విరాట్కోహ్లి టీ20 ప్రపంచకప్లో ఆడే విషయం ఇంకా నిర్ధారణ కాలేదు. ఈలోగా యువ ఆటగాళ్లు కుదురుకునే అవకాశం వచ్చింది. ఈ స్థితిలో ఫినిషర్గా రింకు కుదురుకుంటే భారత జట్టుకు ఓ ఇబ్బంది తప్పినట్లే. ఎందుకంటే రవీంద్ర జడేజా ఎడతెరిపి లేకుండా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్య గాయాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ స్థితిలో రింకు రిజర్వ్ ఫినిషర్గా ఉంటే కచ్చితంగా భారత్కు అది మేలే చేస్తుంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా