Dilshan Madushanka: బూట్లు అరువు తెచ్చుకున్నవాడే! ప్రపంచకప్లో అదరగొట్టిన మదుశంక..
ప్రపంచకప్లో శ్రీలంక అధ్వాన్న ప్రదర్శన చేసింది. ఒక మాదిరి జట్టే అయినా అఫ్గానిస్థాన్ స్థాయిలో కూడా ఆడలేకపోయింది. వరుస పరాభవాలతో సెమీఫైనల్కు దూరమైంది. కానీ ఆ జట్టులో ఒక్కడు మాత్రం అదిరే బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు జట్టు ఓడుతున్నా తాను మాత్రం ప్రతి మ్యాచ్లోనూ శాయశక్తులా లంకను గెలిపించేందుకు ప్రయత్నించాడు అతడే దిల్షాన్ మదుశంక (Dilshan Madushanka).
ప్రపంచకప్లో శ్రీలంక (Sri Lanka) అధ్వాన్న ప్రదర్శన చేసింది. ఒక మాదిరి జట్టే అయినా అఫ్గానిస్థాన్ స్థాయిలో కూడా ఆడలేకపోయింది. వరుస పరాభవాలతో సెమీఫైనల్కు దూరమైంది. కానీ ఆ జట్టులో ఒక్కడు మాత్రం అదిరే బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు జట్టు ఓడుతున్నా తాను మాత్రం ప్రతి మ్యాచ్లోనూ శాయశక్తులా లంకను గెలిపించేందుకు ప్రయత్నించాడు అతడే దిల్షాన్ మదుశంక (Dilshan Madushanka). ఈ యువ పేసర్ 9 మ్యాచ్ల్లో 21 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. సెమీఫైనల్ చేరని జట్లలో ఇన్ని వికెట్లు పడగొట్టింది మదుశంక మాత్రమే. ఈ 23 ఏళ్ల కుర్రాడు లంక తరఫున ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.
జాలరి కుటుంబం
మదుశంక పేద కుటుంబంలో పుట్టాడు. అతడి తండ్రి ఓ జాలరి. ఇంట్లో దుర్భర జీవితం ఉండేది. క్రీడల వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదక్కడ. కానీ క్రికెట్ అంటే ఎంతో ఆసక్తిని పెంచుకున్న మదుశంక మంచి క్రికెటర్ కావాలని కలలు కనేవాడు. అయితే క్రికెట్ ఖర్చుతో కూడుకున్నది కావడంతో అతడు ఈ ఆటలో కొనసాగలేకపోయాడు. క్రికెట్ పరికరాలు కొనే స్థోమత లేకపోవడంతో కొంతకాలం ఆట మానేశాడు. డబ్బులు తక్కువ ఖర్చయ్యే సాఫ్ట్బాల్ క్రికెట్ వైపు వెళ్లాడు. స్థానికంగా జరిగే మ్యాచ్ల్లో సత్తా చాటేవాడు. ఈ క్రమంలోనే మదుశంక ప్రతిభను గుర్తించిన ఓ కోచ్ అతడిని శ్రీలంక అండర్-19 జట్లకు నెట్బౌలర్గా ఎంపిక అయ్యేందుకు కృషి చేశాడు. ఈ నెట్ బౌలింగ్ సెషన్లకు వెళ్లడానికి కూడా అతడికి బూట్లు అందుబాటులో లేకపోవడంతో వేరే ఆటగాళ్లను అడిగి తీసుకుని వెళ్లేవాడు. ఇది అతడినెంతో బాధించేది. మంచి షూస్ కొనుక్కోవాలని ఆరాటపడేవాడు.
వాస్ మార్గనిర్దేశనంలో
అండర్-19 జట్లకు నెట్ బౌలర్గా ఉన్న సమయంలో శ్రీలంక దిగ్గజ పేసర్ చమిందా వాస్ కళ్లలో పడడం మదుశంకకు కలిసొచ్చింది. అతడిలో అంతర్జాతీయ క్రికెట్ ఆడే సత్తా ఉందని గుర్తించిన వాస్.. మదుశంకను ప్రోత్సహించాడు. తనలాగే లెఫ్ట్ఆర్మ్ మీడియం పేసర్ అయిన అతడిని జాతీయ జట్టులో ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించాడు. అఫ్గానిస్థాన్తో టీ20 సిరీస్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు మదుశంక. ఈ సిరీస్లో రెండో మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచి సత్తా చాటాడు. ఆ తర్వాత దుబాయ్లో జరిగిన ఆసియాకప్లోనూ ఆకట్టుకున్నాడు. రెగ్యులర్ పేసర్ చమీరకు గాయం కావడంతో ప్రపంచకప్ జట్టులో ఆడే బంగారు అవకాశాన్ని పట్టేశాడు మదుశంక. ఇప్పటిదాకా 14 వన్డేల్లో 31 వికెట్లు తీశాడీ కుర్రాడు. భారత్తో ప్రపంచకప్ మ్యాచ్లో అయిదు వికెట్లతో అదరగొట్టాడు. చక్కని లైన్ అండ్ లెంగ్త్కు తోడు వైవిధ్యాన్ని జోడించి మదుశంక వికెట్ల వేటలో సాగాడు. ముఖ్యంగా పవర్ప్లేలో అతడి బౌలింగ్ ఆకట్టుకుంది. పొదుపుగా బంతులు వేస్తూనే వికెట్లు తీశాడీ కుర్రాడు. పేస్ బౌలింగ్కు అనుకూలించని పిచ్లపైనా రాణించడం ఈ కుర్రాడి సత్తాకు నిదర్శనం. తమ జట్టు సెమీస్ చేరకపోయినా అద్భుత బౌలింగ్తో భవిష్యత్ తారగా నిలిచాడు మదుశంక.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
భారత ఆర్చరీ బృందం అద్భుత ప్రదర్శన చేసింది. ఆర్చరీ వరల్డ్ కప్లో మూడు కేటగిరీల్లో స్వర్ణాలను గెలుచుకుంది. -
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
ఐపీఎల్ 17వ సీజన్లో భారీ స్కోర్లు నమోదు కావడం సర్వసాధారణమైంది. 200+ కాకుండా.. 250+ స్కోరుకూడా దాటిపోవడం గమనార్హం. -
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?నేడు జట్టును ప్రకటించే అవకాశం
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ 20 ఏళ్లలో నా జుట్టు కూడా మారింది కానీ..: సుందర్ పిచాయ్
-
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
-
ఆర్చరీ వరల్డ్ కప్లో అదరగొట్టిన భారత్.. మూడు స్వర్ణాలు కైవసం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఐదు రోజులుగా టీవీ నటుడు మిస్సింగ్.. కిడ్నాప్ అనుమానాలు..!
-
ఓటీటీలోకి ‘మంజుమ్మల్ బాయ్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే