Sri lanka Cricket Team: అలాంటి శ్రీలంక ఇలా ఎలా!
వరల్డ్ కప్ (ODI World Cup 2023) క్వాలియింగ్ టోర్నీలో విజేతగా నిలిచి వరుస విజయాలతో ప్రపంచకప్పులో అడుగుపెట్టిన శ్రీలంక ఊహించని తీరులో అధ్వాన్న ప్రదర్శన చేసి నాకౌట్కు దూరమైంది.
వరుసగా 13 వన్డే విజయాలు! ఆ జట్టేమీ భారత్ కాదు దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అంతకంటే కాదు. ఇప్పుడిప్పుడే పునర్ నిర్మాణంలో ఉన్న శ్రీలంక (Sri Lanka Cricket Team)! క్వాలియింగ్ టోర్నీలో విజేతగా నిలిచి వరుస విజయాలతో ప్రపంచకప్పులో అడుగుపెట్టిన లంక ఊహించని తీరులో అధ్వాన్న ప్రదర్శన చేసి నాకౌట్కు దూరమైంది. అంతేకాదు ఆ దేశ ప్రభుత్వం క్రికెట్ బోర్డునే రద్దు చేసే పరిస్థితిని తెచ్చుకుంది.. మరి మొన్నటిదాకా అదరగొట్టిన లంక ఇలా ఎందుకు మారింది. ఆ స్థిరత్వం ఏమైపోయింది. ప్రపంచకప్లో నెదర్లాండ్స్ లాంటి చిన్న జట్టు కూడా దక్షిణాఫ్రికాను ఓడించి సంచలనం రేపింది.. అఫ్గానిస్థాన్ ఏకంగా సెమీఫైనల్పైనే గురి పెట్టింది. మరి మాజీ ఛాంపియన్ శ్రీలంక ఎందుకు తేలిపోయింది. కనీస పోటీ ఎందుకు ఇవ్వలేకపోయింది. 8 మ్యాచ్ల్లో 2 విజయాలే సాధించి సెమీఫైనల్ రేసు నుంచి ఎందుకు నిష్క్రమించింది!
ఆ జోరుతో వచ్చి..
భారత్లో పిచ్లు లంకలో పిచ్లను పోలే ఉంటాయి. ఆ జట్టు ఆటకు సరిపోతాయి. పైగా లంక మామూలు జోరులో లేదు వరుసగా 13 వన్డేలు గెలిచింది. ప్రపంచకప్కు ముందు భారత్తో సిరీస్లో ఈ విజయపరంపరకు తెరపడినా.. లంకను ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. ఎందుకంటే ఆ జట్టులో ప్రతిభావంతులకు కొదువలేదు. పైగా తమకు పరిచయం ఉన్న పరిస్థితులే. లంక స్పిన్నర్లు ప్రత్యర్థి పనిపట్టడం ఖాయంగా కనిపించింది. ఆ జట్టును కప్కు ఫేవరెట్ అని ఎవరూ అనుకోలేదు. సెమీఫైనల్కు వస్తుందని భావించలేదు. కానీ కచ్చితంగా ప్రభావం చూపించగలదని అనుకున్నారు. అయితే ప్రపంచకప్కు ముందు జోరు ఏమాత్రం లేదు. పైగా పసికూన మాదిరిగా మారిపోయింది. భారత్, దక్షిణాఫ్రికాలపై వణికిపోయింది. చివరికి చిన్న జట్లకు కూడా పోటీ ఇవ్వలేని స్థితికి చేరింది. అసలు ప్రపంచకప్లో ఆ జట్టు ఆరంభమే దారుణం.
రికార్డులు సమర్పించుకుని
అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైన లంక ఆడిన తొలి మూడు మ్యాచ్ల్లోనూ చిత్తయింది. పైగా ప్రత్యర్థికి రికార్డులు సమర్పించుకుంది. లంక బౌలింగ్ను తుత్తునియలు చేస్తూ తొలి మ్యాచ్లోనే దక్షిణాఫ్రికా 428 పరుగులు చేసి ప్రపంచకప్లో అత్యధిక స్కోరు రికార్డు సాధించింది. ఆ తర్వాత పాకిస్థాన్తో పోరులో 344 పరుగులు చేసి కూడా.. బౌలింగ్లో మళ్లీ విఫలమై ఓడిపోయింది. ప్రపంచకప్లో ఇదే అత్యధిక ఛేదన. ఆ తర్వాత ఆస్ట్రేలియాపైనా చేతులెత్తేసింది. నెదర్లాండ్స్పై నెగ్గి గాడిలో పడిన లంక.. ఆ తర్వాత ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాక్ ఇచ్చి మళ్లీ రేసులోకొచ్చినట్లు కనిపించింది. అయితే వాళ్ల ఆట అక్కడే ఆగిపోయింది. అక్కడి నుంచి ఆ జట్టుకి బ్యాడ్టైమ్ మళ్లీ మొదలైంది. ఈసారి మామూలు దెబ్బలు తగల్లేదు. అఫ్గానిస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి చవిచూసింది. అఫ్గాన్ కన్నా మెరుగైన జట్టే అయినా పసికూనలా ఆడి ఓడింది. ఇక లంక ఓటములన్నీ ఒక ఎత్తయితే.. భారత్పై ఆట ఇంకో ఎత్తు. భారత్కు 355 పరుగులు సమర్పించుకున్న ఆ జట్టు.. ఛేదనలో కేవలం 55 పరుగులకే కుప్పకూలింది. భారత పేసర్ల ధాటికి లంక బ్యాటింగ్ ఆర్డర్ విలవిలలాడింది. ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ సైకిల్ స్టాండ్ను తలపించింది. ఈ ఓటమే ఆ జట్టును మానసికంగా బాగా దెబ్బ తీసింది.
గాయాలే దెబ్బ తీశాయా
లంకను గాయాలు గట్టి దెబ్బ తీశాయి. టోర్నీ ఆరంభానికి ముందే ఆ జట్టు స్టార్ ఆటగాడు హసరంగను కోల్పోయింది. ప్రపంచకప్ సాగుతుండగా ఆ జట్టుకు మరో గట్టి షాక్ తగిలింది. కెప్టెన్, కీలక ఆటగాడు శానక గాయంతో నిష్క్రమించాడు. ఇదే ఆ జట్టు ఆటపై చాలా ప్రభావం చూపించింది. జట్టు సమతూకం దెబ్బ తింది. ఈ టోర్నీలో గాయాలతో నలుగురిని రీప్లేస్ చేసిన జట్టు లంకే. కుశాల్ మెండిస్కు పగ్గాలు అప్పగించినా అతడు మెరుగ్గా జట్టును నడిపించలేకపోయాడు. పైగా అతడి బ్యాటింగ్పై ప్రభావం పడింది. అప్పటిదాకా టోర్నీలో టాప్ స్కోరర్లలో ఒకడిగా ఉన్న మెండిస్.. విఫలం కావడం మొదలుపెట్టాడు. ఈ వైపల్యం లంకను దెబ్బ కొట్టింది. టోర్నీ తొలి రెండు మ్యాచ్లో సెంచరీ, అర్ధసెంచరీ సాధించి జోరు మీద కనిపించిన మెండిస్.. ఆ తర్వాత ఒక్కసారి కూడా 50 పరుగులు చేయలేకపోయాడు. శానక మాత్రమే కాదు లహిరు కుమార, పతిరన లాంటి ఆటగాళ్ల సేవలను గాయాల కారణంగా కోల్పోయింది ఆ జట్టు. మంచి రికార్డు, అనుభవం ఉన్న ఏంజెలో మాథ్యూస్ను తుది జట్టులో తీసుకున్నా అప్పటికే లంకకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రపంచకప్లో అధ్వాన్న ప్రదర్శనతో లంక క్రికెట్ బోర్డును ఆ దేశ ప్రభుత్వం రద్దు చేయడం ఇంకో షాక్. అప్పీలు న్యాయస్థానానికి వెళ్లగా రెండు వారాలపాటు బోర్డును పునరుద్ధరణ చేస్తూ నిర్ణయం వెలువరించింది. అది వేరే విషయం. మరి ఈ ప్రదర్శనను బయటపడి మున్ముందు లంక ఎలా కోలుకుంటుందో చూడాలి.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్