Hashimatullah Shahidi: తల్లి మరణాన్ని దిగమింగి
అఫ్గానిస్థాన్ ప్రజల్లో మోముల్లో నవ్వు చూడాలనే తండ్రి లక్ష్యం కోసం, జట్టుకు విజయాలు అందించాలనే తల్లి ధ్యేయం కోసం ఆ జట్టు కెప్టెన్ హష్మతుల్లా ముందుకు సాగుతున్నాడు.
ప్రపంచకప్లో సత్తాచాటుతున్న హష్మతుల్లా
2018లో తండ్రి మరణం. ఆ లోటును దాటి అంతర్జాతీయ క్రికెట్లో సత్తాచాటే దిశగా పయనం.. అఫ్గానిస్థాన్ క్రికెట్పై తనదైన ముద్ర వేసే ప్రయత్నాలు.. ఈ ఏడాది మేలో వన్డేల్లో, టెస్టుల్లో జాతీయ జట్టు పగ్గాలు.. ప్రపంచకప్లో జట్టును నడిపించేందుకు ఆ ఆటగాడు సన్నద్ధమవుతున్నాడు. కానీ ఇంతలోనే షాక్.. అన్నివేళలా అండగా నిలుస్తూ ప్రోత్సహిస్తున్న తల్లి హఠాన్మరణం. ఆ బాధ తట్టుకోలేక ఆ క్రికెటర్ కుంగిపోయాడు. నిరాశలో మునిగిపోయాడు. అటు తల్లి మరణం.. ఇటు దగ్గరపడుతున్న ప్రపంచకప్.. అటు బాధ.. ఇటు కెప్టెన్గా జట్టును నడిపించాల్సిన బాధ్యత. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో ఆ ఆటగాడు బాధను దిగమింగాడు. దేశం కోసం, జట్టు కోసం ప్రపంచకప్లో అడుగుపెట్టాడు. బ్యాటర్గా, సారథిగా అద్భుతమైన ప్రదర్శనతో సాగుతున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా జట్టుకు అనూహ్య విజయాలు అందిస్తున్నాడు. అతనే.. హష్మతుల్లా షాహిది. అఫ్గానిస్థాన్ కెప్టెన్.
శనివారం (నవంబర్ 4) 29వ పడిలోకి అడుగుపెట్టిన హష్మతుల్లా షాహిది.. అఫ్గానిస్థాన్ ప్రజల మోముల్లో నవ్వు చూడాలనే తండ్రి లక్ష్యం కోసం, జట్టుకు విజయాలు అందించాలనే తల్లి ధ్యేయం కోసం ముందుకు సాగుతున్నాడు. 2015 వన్డే ప్రపంచకప్లో అరంగేట్రం చేసిన అఫ్గానిస్థాన్.. ఈ ప్రపంచకప్ ముందు వరకూ కేవలం ఒక్క విజయం (స్కాట్లాండ్) మాత్రమే నమోదు చేసింది. కానీ ఈ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు షాకిచ్చి.. మాజీ ఛాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకను.. తాజాగా నెదర్లాండ్స్ను ఓడించి సెమీస్ రేసులో నిలిచింది. దీనికి కెప్టెన్ హష్మతుల్లా ప్రధాన చోదకశక్తి అనడంలో సందేహం లేదు.
అప్పుడు తండ్రి.. ఇప్పుడు తల్లి
హష్మతుల్లా తండ్రి మహమ్మద్ హషీమ్ షాహిది ఫిజిక్స్ ప్రొఫెసర్. సైన్స్ మీద ఆయన 44 పుస్తకాలు రాశారు. 9 నుంచి 12 తరగతులకు ఫిజిక్స్ పుస్తకాలు రూపొందించారు. హష్మతుల్లాను అగ్రశ్రేణి శాస్త్రవేత్తగా చూడాలన్నది ఆయన కోరిక. కానీ హష్మతుల్లా క్రికెట్ వైపు నడిచాడు. 2018లో తండ్రి చనిపోయారు. ఆ సమయంలో హష్మతుల్లా తండ్రి దగ్గర లేడు. దేశవాళీ క్రికెట్లో ఫస్ట్క్లాస్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ రోజు ఆట చివరకు 120 పరుగులతో అజేయంగా నిలిచిన అతను.. తండ్రికి ఫోన్ చేసి ద్విశతకం కోసం ప్రార్థించాలని కోరాడు. కానీ ఇంట్లో అతిథులు ఉండటంతో తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేశారు. ఆ రాత్రి పడుకున్న ఆయన మళ్లీ లేవలేదు. ఈ బాధ నుంచి కోలుకున్న హష్మతుల్లా క్రికెట్పైనే దృష్టి సారించారు. అంతర్జాతీయ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదిగాడు. 2019 ప్రపంచకప్లో ఇంగ్లాండ్తో మ్యాచ్లో బౌన్సర్ దెబ్బకు హష్మతుల్లా కింద పడిపోయాడు. కానీ వెంటనే లేచి బ్యాటింగ్ కొనసాగించాడు. ఒకవేళ బయటకు వెళ్తే తనకు ఏమైందోనని తల్లి కంగారు పడుతుందనే కారణంతోనే బ్యాటింగ్ కొనసాగించినట్లు అప్పుడు హష్మతుల్లా వెల్లడించాడు. అలాంటిది ఈ ఏడాది ఆగస్టులో అనారోగ్యంతో తల్లి మరణించడంతో అతను తల్లడిల్లాడు. తీవ్రమైన బాధలో మునిగిపోయాడు. ఇప్పుడు అమ్మ కోసం జట్టును సెమీస్ తీసుకెళ్లాలనే సంకల్పంతో సాగుతున్నాడు.
సారథిగా శిఖరాలకు..
ఈ ఏడాది మేలో అఫ్గానిస్థాన్ వన్డే, టెస్టు జట్టు కెప్టెన్గా హష్మతుల్లా నియమితుడయ్యాడు. ఇప్పుడు అఫ్గానిస్థాన్ క్రికెట్లోనే అత్యుత్తమ సారథిగా పేరు సాధించాడు. ఇంగ్లాండ్, పాకిస్థాన్, శ్రీలంకపై విజయాలతో హష్మతుల్లా పేరు మార్మోగుతోంది. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో జట్టును నడిపించడం కత్తిమీద సాములాంటిదే. సవాళ్లు ఉంటాయని తెలుసు... విజయం అంత సులువు కాదని తెలుసు.. అయినా వ్యక్తిగత ప్రదర్శన కంటే జట్టు విజయాలు ముఖ్యమని నమ్మి హష్మతుల్లా ముందుకు సాగుతున్నాడు. బ్యాటింగ్లోనూ అదరగొడుతున్నాడు. జట్టును గెలిపించే మైదానం వీడాలనే పట్టుదలతో ఉన్నాడు. తొందరపాటు లేకుండా.. క్రీజులో కుదురుకుని సింగిల్స్తో స్ట్రైక్ రొటేట్ చేస్తూ, అప్పుడప్పుడూ బౌండరీలు బాదుతూ ఇన్నింగ్స్ను నిర్మించడం అతని ప్రతిభకు నిదర్శనం. ఓ వన్డే బ్యాటర్కు ఉండాల్సిన నైపుణ్యాలు అతనిలో ఉన్నాయి. ఈ టోర్నీలో వరుసగా ఏడు మ్యాచ్ల్లో 18, 80, 14, 8, 48 నాటౌట్, 58 నాటౌట్, 56 నాటౌట్ పరుగులు చేశాడు. భారత్పై 80 పరుగులు సాధించాడు. పాకిస్థాన్, శ్రీలంక, నెదర్లాండ్స్పై ఛేదనలో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. టోర్నీలో ఇప్పటివరకూ 7 మ్యాచ్ల్లో 70.50 సగటుతో 282 పరుగులు చేసిన హష్మతుల్లా అఫ్గాన్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఒకే ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన అఫ్గాన్ ఆటగాడిగా రికార్డూ అతనిదే. 2021లో జింబాబ్వేపై ద్విశతకం సాధించిన అతను.. టెస్టుల్లో ఆ ఘనత సాధించిన తొలి అఫ్గాన్ క్రికెటర్గా నిలిచాడు. ఇప్పుడు నెదర్లాండ్స్పై విజయాన్ని తమ దేశ శరణార్థులకు అంకితమిచ్చి తన గొప్ప వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?