INDW vs PAKW : దాయాదుల పోరు.. టీమ్ఇండియాదే ఆధిక్యం.. ఈసారి ఎవరిదో..?
కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో తొలిసారి జరుగుతోన్న మహిళా క్రికెట్ టోర్నీలో సత్తా చాటాలని ఎన్నో ఆశలతో టీమ్ఇండియా బరిలోకి ...
ఆదివారం భారత్, పాక్ మహిళా జట్ల మధ్య మ్యాచ్
ఇంటర్నెట్ డెస్క్: కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games)లో తొలిసారి జరుగుతోన్న మహిళా క్రికెట్ టోర్నీలో సత్తా చాటాలని ఎన్నో ఆశలతో టీమ్ఇండియా బరిలోకి దిగింది. అయితే తొలి మ్యాచ్లో ఆఖరి వరకు పోరాడినా విజయం మాత్రం వరించలేదు. ఆసీస్ చేతిలో పరాభవం తప్పలేదు. ఇక గ్రూప్ స్టేజ్లో మిగిలిన రెండు మ్యాచ్లను గెలిస్తేనే సెమీస్కు చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఆదివారం పాక్తో తలపడనుంది. మరి ఇంతవరకు టీ20 ఫార్మాట్లో పాక్ను ఎన్ని మ్యాచుల్లో భారత్ ఢీకొట్టింది.. ఎవరు ఆధిక్యత సాధించారో తెలుసుకుందాం..
ఆధిక్యం మనదే..
భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే సర్వత్రా ఉత్కంఠ ఉంటుంది. పురుషుల జట్టైనా.. మహిళల జట్టైనా సరే.. ఏ ఫార్మాట్లో అయినా క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. మరోసారి భారత్, పాక్ మహిళా క్రికెట్లు జట్లు తలపడేందుకు సిద్ధంగా ఉన్నాయి. దానికి వేదిక కామన్వెల్త్ గేమ్స్. అయితే ఇప్పటి వరకు ఇరు జట్లూ 11 టీ20ల్లో తలపడ్డాయి. అందులో భారత్దే ఆధిక్యం సాధించడం విశేషం. తొమ్మిది మ్యాచుల్లో టీమ్ఇండియా విజయం సాధించగా.. పాకిస్థాన్ మహిళల జట్టు కేవలం రెండే మ్యాచుల్లో గెలిచింది. టీ20 ప్రపంచకప్వంటి కీలక టోర్నీల్లోనూ పాక్పై భారత్ విజయాల పరంపరను కొనసాగించింది. ఆరు మ్యాచుల్లో భారత్ 4, పాకిస్థాన్ 2 మ్యాచుల్లో విజయం సాధించాయి.
అత్యధిక స్కోరు.. అత్యల్ప స్కోరు
భారత్, పాకిస్థాన్ మహిళల జట్లు తలపడినప్పుడు భారీ స్కోర్లేమీ నమోదు కాకపోవడం విశేషం. టీమ్ఇండియా అత్యధిక స్కోరు 137/3. అదీనూ 2018 టీ20 ప్రపంచకప్ పోటీల సందర్భంగా జరిగిన మ్యాచ్లో భారత్ సాధించింది. ఇక 2012 ఆసియా కప్ మ్యాచ్లో పాకిస్థాన్ కేవలం 63 పరుగులకే కుప్పకూలింది. అయితే ఇదే మ్యాచ్లో భారత్ కూడా 81 పరుగులే చేయడం గమనార్హం. పాక్పై మాజీ సారథి మిథాలీరాజ్ (73) అత్యధిక స్కోరర్. అలానే 2009లో ప్రియాంక రాయ్ (5/16) పాక్పై అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన చేసిన భారత బౌలర్గా రికార్డు సృష్టించింది.
మరి ఈసారి ఏం చేస్తారో..?
మెగా టోర్నీ్ల్లో పాక్పై భారత్ ఎప్పుడూ ఆధిక్యత ప్రదర్శిస్తూనే ఉంది. ఈ క్రమంలో తొలిసారి ప్రాతినిధ్యం వహిస్తున్న కామన్వెల్త్ గేమ్స్లో కీలకమైన పోరుకు భారత్, పాక్ జట్లు సై అంటూ సిద్ధంగా ఉన్నాయి. ఇరు జట్లూ తమ తొలి మ్యాచుల్లో ఓడిపోవడం విశేషం. ఆసీస్పై భారత్.. బార్బోడస్పై పాక్ ఓడాయి. అయితే ఆస్ట్రేలియా మీద గెలుస్తుందని భావించినా ఆఖర్లో భారత ప్లేయర్లు చేతులెత్తేయడంతో ఓటమి తప్పలేదు. మరోవైపు బార్బోడస్ వంటి చిన్న జట్టుపై పాక్ పరాజయం పొందడంతో తదుపరి రెండు మ్యాచ్లు చాలా కీలకం. పాక్ బ్యాటర్లలో నిదా దార్ (50*) మినహా ఎవరూ రాణించలేదు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (52), షెఫాలీ వర్మ (48) ఫామ్లో ఉండటం భారత్కు కలిసొచ్చే అంశమవుతుంది. సెమీస్ బెర్తు దక్కాలంటే ఈ మ్యాచ్ ఇరు జట్లకూ జీవన్మరణ పోరాటమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు