IND vs BAN: ఆ ఒక్క తప్పిదం చేయకుండా ఉంటే గెలిచేవారు: సునీల్ గావస్కర్
టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్(Sunil gavaskar) రాహుల్కు తన మద్దతు తెలిపాడు.
దిల్లీ: బంగ్లాదేశ్(Bangladesh)తో తొలి వన్డేలో పేలవమైన బ్యాటింగ్ను ప్రదర్శించిన టీమ్ఇండియా(Team india).. 41.2 ఓవర్లలో 186 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. బౌలింగ్ పరంగా రాణించినప్పటికీ బంగ్లా ఆటగాళ్లు మెహదీ హసన్(Mehidy hasan), ముస్తాఫిజుర్ రెహమాన్ జోరు ముందు భారత బ్యాటర్లు నిలబడలేకపోయారు. ఫీల్డింగ్ పరంగానూ తేలిపోయారు. చివరి ఓవర్లో క్యాచ్ను వదిలేసి జట్టు ఓటమికి కారణమయ్యాడంటూ కేఎల్ రాహుల్పై విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సునీల్ గావస్కర్(Sunil gavaskar) రాహుల్ పక్షాన నిలిచాడు.
‘‘ఈ విషయంలో రాహుల్ క్యాచ్ అంశాన్ని మాత్రమే తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే, ఇది మ్యాచ్లో చివరి వికెట్. దానితో గేమ్ పూర్తవుతుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భారత స్కోరు 186 మాత్రమే. ఈ విషయంపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ పరంగా మనవాళ్లు అద్భుతమైన ప్రదర్శన చేశారు. ఆ తర్వాత హసన్ మిరాజ్ రావడం, చివరి క్యాచ్ను మనవాళ్లు వదిలేయడం వంటివి వారికి కలిసొచ్చాయి. కానీ, అతడు గొప్పగా ఆడాడు. ఆ జట్టు తెలివైన ప్రదర్శన చేస్తూ ప్రత్యర్థిపై దాడిని కొనసాగించింది’’అని గావస్కర్ కొనియాడాడు.
టీమ్ఇండియా ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తూ.. బంగ్లాదేశ్కు చెప్పినట్టుగా ఒక ఓవర్లో నాలుగు పరుగుల కన్నా తక్కువ ఛేదిస్తే సరిపోతుందంటే కచ్చితంగా ఆటగాళ్లు కాస్త తేలికపడతారు. ఇదే అవకాశంగా వారు చాలా జాగ్రత్తగా ఆడి భారత్ను చిక్కుల్లోకి నెట్టారు. మనవాళ్లు మరో 70-80 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. ఆ తప్పిదమే ఓటమికి కారణమైంది’’ అంటూ ఈ మాజీ కెప్టెన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ