Gavaskar: ఆ ‘పిచ్’ ప్రచారం ఇకనైనా ఆపండి.. సునీల్ గావస్కర్ ఆగ్రహం
బాల్ టాంపరింగ్, విభిన్న బంతులు, పిచ్లో మార్పులు వంటి ఆరోపణలతో ఐసీసీ వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) ముగిసింది. ఐసీసీ అధికారికంగా స్పందించినా విమర్శకుల నోళ్లకు మాత్రం తాళం పడటం లేదు. దీంతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ మరోసారి తీవ్రంగా స్పందించాడు.
ఇంటర్నెట్ డెస్క్: స్వదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) మెగా టోర్నీ సందర్భంగా ఐసీసీ, బీసీసీఐపై చాలా ఆరోపణలు వచ్చాయి. మరీ ముఖ్యంగా సెమీస్లో భారత్కు అనుకూలంగా పిచ్లో మార్పులు చేశారని పలువురు ఆరోపణలు చేశారు. వాటన్నింటినీ ఐసీసీ, బీసీసీఐ కొట్టిపడేశాయి. భారత క్రికెట్ దిగ్గజాలు కూడా ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు మూర్ఖులంటూ తిప్పి కొట్టారు. ఇప్పుడు వన్డే ప్రపంచకప్ ముగిసింది. అయినా, ఇంకా ఆ ఆరోపణలు మాత్రమే ఆగడంలేదు. తాజాగా సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) మరోసారి తీవ్ర అసహన వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘బీసీసీఐ కలగజేసుకుని పిచ్ను చివరి నిమిషంలో మార్చిందంటూ ఆరోపించడం అర్థరహితం. ఇప్పటికే ఐసీసీ, బీసీసీఐ వివరణ ఇచ్చాయి. అయినా, ఇలాంటి ఆరోపణలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. పిచ్ ఎంపిక అనేది ఐసీసీ కన్సల్టెంట్ ఎదురుగానే జరుగుతుంది. ప్రతినిధులంతా అక్కడే ఉంటారు. వారంతా సంతృప్తి చెంది ఆమోదం తెలిపితేనే మ్యాచ్ను నిర్వహిస్తారు. ఇవన్నీ తెలియని వారే ఆరోపణలు చేస్తుంటారు. స్పిన్నర్లకు అనుకూలంగా మార్చారని చెబుతున్నారు. అందులో ఎలాంటి వాస్తవం లేదు.
నాకౌట్ మ్యాచులను కొత్త పిచ్లపైనే ఆడాలని ఎక్కడా చెప్పలేదు. అందుకే, భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య సెమీస్ కోసం అప్పటికే వాడిన పిచ్ను ఎంపిక చేశారు. ఇదేమీ రహస్యంగా జరగలేదు. భారత స్పిన్నర్ల కోసం పొడిబారిన పిచ్ను వాడారనే ఆరోపణల్లో పసే లేదు. ఇప్పటికే సెమీస్లో అది నిరూపితమైంది. ఈ మ్యాచ్లో ఇరు జట్లూ కలిసి దాదాపు 724 పరుగులు చేశాయి. అలాగే ఒక్క పేసరే ఏడు వికెట్లు పడగొట్టాడు. భారత ఫాస్ట్ బౌలర్ షమీ అదరగొట్టాడు. ఆరోపణలు గుప్పించిన వారి ప్రకారం భారత స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీయాలి కదా.. అలాంటిదేమీ జరగలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా పిచ్తో తమకేమీ ఇబ్బంది లేదని చెప్పాడు’’ అని గావస్కర్ గుర్తు చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
కోల్కతా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) తమ జట్టు ఓపెనర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫిల్ సాల్ట్, సునీల్ నరైన్ బ్యాటింగ్ తీరు, టీమ్ మీటింగ్ల పట్ల వీరు ఎలా వ్యవహరిస్తారనే ఆసక్తికర విషయాలు వివరించాడు. -
ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
టీ20 ప్రపంచకప్ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. -
కోల్కతా కుమ్మేసింది
కోల్కతా అదరగొట్టింది. ఆల్రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ దిల్లీ క్యాపిటల్స్ను చిత్తుగా ఓడించింది. వరుణ్, అరోరా, హర్షిత్ సూపర్ బౌలింగ్తో దిల్లీని తక్కువ స్కోరుకే పరిమితం చేసిన నైట్రైడర్స్.. సాల్ట్ జోరుతో స్వల్ప లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. -
క్వార్టర్స్లో భారత్
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఇప్పటికే భారత అమ్మాయిలు క్వార్టర్స్ఫైనల్స్లో ప్రవేశించగా.. తాజాగా థామస్ కప్లో పురుషుల జట్టు కూడా తుది ఎనిమిదిలో చోటు దక్కించుకుంది. -
పారిస్కు ఏడుగురు షట్లర్లు
పారిస్ ఒలింపిక్స్లో భారత్ నుంచి ఏడుగురు షట్లర్లు పోటీపడబోతున్నారు. ఒలింపిక్ క్రీడల అర్హత ర్యాంకింగ్ ప్రకారం పి.వి.సింధు (మహిళల సింగిల్స్), హెచ్ఎస్.ప్రణయ్, లక్ష్యసేన్ (పురుషుల సింగిల్స్), సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టి (పురుషుల డబుల్స్), అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో (మహిళల డబుల్స్) ఈ మెగా ఈవెంట్ బరిలో నిలిచారు. -
జ్యోతి @ 2
ఆర్చరీ ప్రపంచకప్లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ.. కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించింది. -
టీ20 ప్రపంచకప్కు కివీస్ జట్టిదే
కేన్ విలియమ్సన్ నాలుగోసారి టీ20 ప్రపంచకప్లో న్యూజిలాండ్కు నాయకత్వం వహించనున్నాడు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న ఓపెనర్ డెవోన్ కాన్వేకు కూడా 15 మంది సభ్యుల జట్టులో చోటు దక్కింది. -
ఛాంపియన్స్ ట్రోఫీకి మూడు వేదికలు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమ్ఇండియా పాకిస్థాన్కు వెళ్తుందో లేదో తెలియదు.. అసలు ఆ టోర్నీ పాకిస్థాన్లోనే జరుగుతుందో లేదో తెలియదు కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాత్రం ఆ టోర్నీ కోసం ఏర్పాట్లు చేసుకుంటుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ అపోహ కారణంగానే నాకు దక్షిణాదిలో అవకాశాలు తగ్గాయి: ఇలియానా
-
5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్ సంపద
-
పన్నూపై హత్యాయత్నం.. వాషింగ్టన్ పోస్టు కథనంపై భారత్ ఘాటు స్పందన
-
కేసీఆర్ను చూస్తే గోబెల్స్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది : సీఎం రేవంత్
-
సునీల్ నరైన్ను టీమ్ మీటింగ్లకు రావొద్దనే వాడిని: శ్రేయస్ అయ్యర్
-
‘పాకిస్థాన్కు చెప్పిన తర్వాతే..’: బాలాకోట్ దాడులపై మోదీ కీలక వ్యాఖ్యలు