ఆఖరి లీగ్ మ్యాచ్లోనూ అదే జోరు.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
చివరి లీగ్ మ్యాచ్లో హైదరాబాద్ అదరగొట్టింది. పంజాబ్పై ఘన విజయాన్ని నమోదు చేసింది.
హైదరాబాద్: ఐపీఎల్ 17వ సీజన్లో మంచి ప్రదర్శన చేస్తూ ఇప్పటికే ప్లేఆఫ్స్కు చేరుకున్న హైదరాబాద్.. లీగ్ దశలో ఆఖరి మ్యాచ్లోనూ అదరగొట్టింది. సొంత మైదానంలో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యాన్ని సన్రైజర్స్ 19.1 ఓవర్లలోనే 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ మొదటి ఓవర్ తొలి బంతికే ఔటైనా.. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (66; 28 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లు) దంచికొట్టాడు. రాహుల్ త్రిపాఠి (33; 18 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు), నితీశ్ రెడ్డి (37; 25 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు), హెన్రిచ్ క్లాసెన్ (42; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. అబ్దుల్ సమద్ (11), సన్వీర్ సింగ్ (6) నాటౌట్గా నిలిచారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ 2, హర్షల్ పటేల్ 2, హర్ప్రీత్ బ్రార్, శశాంక్ సింగ్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు ఓపెనర్లు అథర్వ తైడే (46; 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్లు), ప్రభ్సిమ్రన్ సింగ్ (71; 45 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లు) శుభారంభం అందించారు. వన్డౌన్లో వచ్చిన రిలీ రోసో (49; 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లు) మెరుపులు మెరిపించి త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో కెప్టెన్ జితేశ్ శర్మ (32*; 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) దూకుడుగా ఆడటంతో పంజాబ్ స్కోరు 200 దాటింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ 2, కమిన్స్, విజయ్కాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
రెండో స్థానంలోనే ఉంటుందా?
ఈ విజయంతో సన్రైజర్స్ పాయింట్ల పట్టికలో 17 పాయింట్లతో రెండో స్థానంలోకి చేరింది. అయితే.. లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన రాజస్థాన్, కోల్కతా మ్యాచ్ ఫలితంపై హైదరాబాద్ రెండో స్థానంలో కొనసాగడం ఆధారపడి ఉంది. రాజస్థాన్ ఓడిపోతే హైదరాబాద్ రెండో స్థానంలోనే నిలిచి కోల్కతాతో క్వాలిఫయర్-1 ఆడుతుంది. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే హైదరాబాద్ మూడో స్థానానికి పడిపోయి ఆర్సీబీతో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!