Supriti Kachhap: తండ్రిని నక్సలైట్లు చంపినా.. గోల్డ్ మెడల్ సాధించిన సుప్రీతి
ఛాంపియన్లు ఎవరూ ఒక్క రోజులో తయారు కారు. కఠిన పరిస్థితులు, ముళ్ల దారులు దాటుకొని ఎన్నో ఏళ్లు శ్రమించి చివరికి విజేతలుగా ఎదుగుతారు...
(Photo: Khelo India Twitter)
ఛాంపియన్లు ఎవ్వరూ ఒక్క రోజులో తయారు కారు. కఠిన పరిస్థితులు, ముళ్ల దారులు దాటుకొని.. ఎన్నో ఏళ్లు శ్రమించి చివరికి విజేతలుగా ఎదుగుతారు. అందరి హృదయాలు గెలిచి మంచి గుర్తింపు సాధిస్తారు. అలాంటి ఒక అమ్మాయే 19 ఏళ్ల సుప్రీతి కచ్చప్. నెలల పసిపాపగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయినా.. ఆమె తల్లి అండతో జాతీయ స్థాయిలో మేటి అథ్లెట్గా గుర్తింపు సాధించింది. ప్రస్తుతం జరుగుతోన్న ‘ఖేలో ఇండియా’ పోటీల్లో జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించి కొత్త చరిత్ర లిఖించింది. బంగారు పతకం సాధించి తల్లికి అమితానందాన్ని మిగిల్చింది.
కొత్త రికార్డు నెలకొల్పి..
హరియాణాలోని పంచకులలో ప్రస్తుతం జరుగుతోన్న ‘ఖేలో ఇండియా’ పోటీల్లో గురువారం ఉదయం సుప్రీతి జాతీయ స్థాయిలో రికార్డు సృష్టించింది. గోల్డ్ మెడల్ సాధించి అందరి దృష్టినీ ఆకర్షించింది. మహిళల 3000 మీటర్ల పరుగు పందెంలో 9 నిమిషాల 46.14 సెకండ్లలోనే రేస్ను పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పింది. ఇదివరకు ఈ కేటగిరీలో అత్యుత్తమ రికార్డు 9 నిమిషాల 50.54 సెకండ్లు. దాన్ని సుప్రీతి అధిగమించి బంగారు పతకం సాధించింది.
అప్పుడే తండ్రిని కోల్పోయి..
సుప్రీతి నెలల పసిపాపగా ఉన్నప్పుడే తండ్రిని కోల్పోయింది. ఝార్ఖండ్లోని గుమ్లా జిల్లా బుర్హు అనే గిరిజన గ్రామం ఆమెది. సుప్రీతి తండ్రి రామ్సేవక్ మెడికల్ ప్రాక్టీషనర్గా స్థానికంగా వైద్యం అందించేవాడు. అయితే, 2003లో ఒకసారి పక్క ఊరిలో ఎవరికో ఆరోగ్యం బాగోలేకపోతే చూసేందుకు వెళ్లాడు. మరునాడు ఆయన మృతదేహం ఓ చెట్టుకు కట్టేసి ఉంది. నక్సలైట్లు ఆయనను చంపేశారు. శరీరం మొత్తం బుల్లెట్ తూట్లతో కనిపించింది. ఈ ఘటనతో నలుగురు పిల్లలతో సుప్రీతి తల్లి బాల్మతి దేవి ఒంటరైపోయింది. నష్టపరిహారంగా ప్రభుత్వం ఆమెకు చిన్నపాటి ఉద్యోగం కల్పించింది.
ఆయన గుర్తించడం వల్లే..
సుప్రీతి తల్లికి ప్రభుత్వ ఉద్యోగం రావడంతో ఆ కుటుంబం గుమ్లా జిల్లా కేంద్రానికి తరలిపోయింది. అక్కడే ప్రాథమిక విద్య అనంతరం సుప్రీతి స్కాలర్షిప్ సాయంతో సెంట్ పాట్రిక్స్ స్కూల్లో చేరింది. ఆ సమయంలో ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ జరగడంతో పరుగు పందెంలో పాల్గొంది. అప్పుడే ఆమెలోని టాలెంట్ను గుర్తించిన కోచ్ ప్రభత్ రంజన్ తివారి ఆమె బాధ్యతలు తీసుకున్నాడు. ఝార్ఖండ్లోని క్రీడా శిక్షణ కేంద్రంలో చేర్పించాడు. అక్కడ ప్రత్యేక శిక్షణ ఇప్పించి జాతీయ ఛాంపియన్గా తీర్చిదిద్దాడు.
ఆమె గుండె వేగం పెరగదు..
కోచ్ ప్రభత్ రంజన్ సుప్రీతి గురించి మాట్లాడుతూ ఓ ఆసక్తికర విషయం వెల్లడించారు. ఆమె మొదట్లో 400, 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొనేదని, తాము శిక్షణ ఇవ్వడం ప్రారంభించాక 1500, 3000 వేల మీటర్ల దూరం పరిగెడుతుందని చెప్పారు. ఆ సమయంలో సుప్రీతికి నిర్వహించిన శారీరక పరీక్షల్లో గుండె కొట్టుకునే వేగం పెరిగిపోయేది కాదని తెలిపారు. దీంతో తాము అత్యధిక దూరం పరిగెత్తేలా శిక్షణ ఇచ్చామన్నారు. అలా ఎక్కువ దూరం పరిగెత్తేలా చేసి ఆమెను మానసికంగా, శారీరకంగా దృఢమయ్యేలా చేశామని వివరించారు.
సుప్రీతి ప్రయాణం ఇలా సాగింది..
* 2016లో విజయవాడలో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 1500 మీటర్ల పోటీల్లో తొలిసారి ఫైనల్కు చేరింది.
* తర్వాత ఆమె రాష్ట్ర, జాతీయ స్థాయిలో 3000 మీటర్ల పోటీలకు అర్హత సాధించింది.
* 2018లో భోపాల్లోని సాయ్ శిక్షణా కేంద్రంలో చేరి మాజీ జాతీయ ఛాంపియన్ ప్రతిభా టోప్పో వద్ద శిక్షణ పొందింది.
* అలా 2019లో తొలిసారి జాతీయ స్థాయిలో పతకం సాధించింది. అప్పుడు నేషనల్ క్రాస్ కంట్రీ ఛాంపియన్షిప్ పోటీల్లో 2000 మీటర్ల విభాగంలో వెండి పతకం కైవసం చేసుకుంది.
* 2019లోనే గుంటూర్లో జరిగిన జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 3000 మీటర్ల పందెంలో రజత పతకం సొంతం చేసుకుంది.
* 2021లో భోపాల్లో నిర్వహించిన ఇండియన్ అండర్-20 ఫెడరేషన్ కప్లో 5000 మీటర్ల పందెంలో తొలిసారి పాల్గొని రజతం సాధించింది.
* అదే పోటీల్లో 3000 మీటర్ల పందెంలోనూ రజతం పొందింది.
* ఇక ఈ ఏడాది అండర్-20 ఫెడరేషన్ కప్లో 3000 మీటర్ల పందెంలో వెండి పతకం, ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్లో 5000 మీటర్ల పోటీల్లో బంగారు పతకం సాధించింది.
* ఈ నేపథ్యంలోనే వచ్చే ఆగస్టులో కొలంబియాలో జరిగే అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు అర్హత సాధించింది. అక్కడ కూడా సుప్రీతి విజయం సాధించి దేశానికి గర్వకారణంగా నిలవాలని ఆశిస్తోంది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం