Surya Kumar: నువ్విప్పుడు వైస్ కెప్టెన్.. మరింత బాధ్యతతో ఆడాలి సూర్యా భాయ్!
అదేంటో విచిత్రంగా జట్టు మొత్తం విఫలమైన చోట మెరుస్తాడు.. మిగతా సభ్యులంతా ఆడిన మ్యాచ్లో విఫలమవుతాడు. అయితే క్లిష్ట సమయాల్లో మాత్రం తన బ్యాటింగ్ పవర్ను చూపెట్టడంలో వెనుకడుగు వేయడు. అతడే టీమ్ఇండియా సెన్సేషనల్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్..
ఇంటర్నెట్ డెస్క్: సూర్య.. సూర్య.. ఇదీ శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్ సందర్భంగా వాంఖడే మైదానంలో అభిమానుల నుంచి వచ్చిన స్పందన.. సూర్యకుమార్ యాదవ్ను ‘స్కై’ అంటూ ముద్దుగా పిలుస్తుంటారు అభిమానులు. అందుకు తగ్గట్టుగానే ఆకాశమే హద్దుగా చెలరేగుతాడు. అతడి ఆటను చూస్తుంటే కనురెప్పలు మూయాలని అనిపించదు. ప్రత్యర్థి బౌలర్ ఎవరైనా సరే ఒకటే సమాధానం.. విభిన్న షాట్లు ఆడుతూ పరుగులు రాబట్టడం సూర్యకుమార్ యాదవ్ స్పెషాలిటీ. గత సంవత్సరం అద్భుతమైన ప్రదర్శనతో అతడిపై అభిమానుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో శ్రీలంకతో టీ20 సిరీస్కు అతడిని వైస్ కెప్టెన్గా బీసీసీఐ నియమించింది. కానీ తొలి మ్యాచ్లోనే విఫలమై నిరాశపరిచాడు.
గత టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ కీలక ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ భారత్ ఫైనల్కు చేరుకోవడంలో విఫలమైంది. లీగ్ స్టేజ్లో ఎలా ఆడినా ఫర్వాలేదు.. కానీ సెమీస్లో సూర్య విఫలం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. సూర్యకుమార్ ఆట ఓ పట్టాన అర్థం కాదు. ఎందుకంటే ప్రదర్శనలో అతడు రెండు అడుగులు ముందుకేస్తే.. ఒకడుగు వెనక్కి వేయడం గమనార్హం. టీ20 ప్రపంచకప్ తర్వాత న్యూజిలాండ్తో భారత్ తలపడింది. కివీస్పై టీ20ల్లో సెంచరీ (51 బంతుల్లోనే 111 పరుగులు) సాధించినా.. ఆ తర్వాత ఆడిన రెండు ఇన్నింగ్స్ల్లో పేలవ ప్రదర్శన చేసి నిరాశపరిచాడు. క్లిష్ట సమయాల్లో రాణించి జట్టుకు అండగా నిలబడితేనే ‘స్టార్ బ్యాటర్’ బిరుదుకు అర్థం ఉంటుంది.
టాలెంట్ ఎంత ఉన్నా ఓపిక అవసరం..
మిషన్ - 2024లో భాగంగా సూర్యకుమార్ కీలక బ్యాటర్గా మారతాడని అందరి అంచనా. ఇలాంటి సూర్యకుమార్లో టాలెంట్కు కొదవేం లేదు. ప్రత్యర్థి బౌలర్లకు ఏమాత్రం భయపడకుండా హడలెత్తిస్తాడు. అయితే ఒక్కోసారి తొందరపాటుతో పెవిలియన్కు చేరుతున్నాడు. తాజాగా శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్నే తీసుకొంటే.. కీలకమైన వన్డౌన్లో బ్యాటింగ్కు వచ్చాడు. ఇన్నింగ్స్కు ఇరుసులాంటి స్థానం. త్వరగా బ్యాటింగ్కు వచ్చే ఆటగాడు చాలా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్ను నిర్మించాల్సి ఉంటుంది. వన్డౌన్ బ్యాటర్ ఎంత బాగా రాణిస్తే జట్టు మీద ఒత్తిడి అంత తగ్గిపోతుంది. కానీ సూర్యకుమార్ మాత్రం మూడో ఓవర్లోనే క్రీజ్లోకి వచ్చినప్పటికీ.. ఎప్పటిలాగే తన షాట్ కొట్టేందుకు ప్రయత్నించి పెవిలియన్కు చేరాడు. అదీనూ 10 బంతులు ఎదుర్కొని ఏడు పరుగులే చేశాడు. నిన్నటి వరకు ఇదే స్థానంలో విరాట్ కోహ్లీ బరిలోకి దిగేవాడు. క్రీజ్లో పాతుకుపోయి జట్టుకు అవసరమైన పరుగులను రాబట్టేవాడు. దాంతో నాలుగో స్థానంలో వచ్చే బ్యాటర్ స్వేచ్ఛగా ఆడే అవకాశం కల్పించాడు. సూర్యకుమార్ సెకండ్ డౌన్లో ఇలా వచ్చి ధనాధన్ ఇన్నింగ్స్తో చెలరేగిపోయాడు. ఇప్పుడు మూడో స్థానంలో రావడంతో ఆచితూచి ఆడాల్సిన పరిస్థితిలోనూ తన పాత అలవాటునే కొనసాగించి బోల్తా పడ్డాడు.
న్యూజిలాండ్తో గత వన్డే సిరీస్ సందర్భంగా జరిగిన ఓ సంఘటన నుంచి సూర్యకుమార్ చాలా నేర్చుకోవాల్సి అవసరం ఉంది. 30వ ఓవర్ తర్వాత దాదాపు స్లిప్లో ఫీల్డర్ను పెట్టడానికి ఏ జట్టూ సాహసం చేయదు. కానీ సూర్యకుమార్ కోసం స్లిప్ పెట్టి మరీ వికెట్ను సాధించింది న్యూజిలాండ్ టీమ్. ఆ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ కామెంట్ చక్కర్లు కొట్టింది. ‘టీ20 టాప్ బ్యాటర్గా మారిన సూర్యకుమార్కు స్లిప్లో ఫీల్డర్ను పెడితే చటక్కున క్యాచ్ ఇచ్చేస్తాడు’ అనే వ్యాఖ్యలు వినిపించాయి
మళ్లీ మళ్లీ అదే పొరపాటు..
విభిన్న షాట్లు కొట్టడం తప్పేలేదు. అలా కొడితే బౌలర్లు అయోమయానికి గురై సరైన లెంగ్త్లో బంతిని సంధించడానికి ఇబ్బంది పడతారు. కానీ షార్ట్ ఫైన్లెగ్ వైపు తరచూ కొట్టి వికెట్ను చేజార్చుకొంటున్న సూర్యకుమార్ యాదవ్ మాత్రం తన తీరును మార్చుకోలేకపోతున్నాడు. అయితే అన్నిసార్లూ ఇది వర్కౌట్ కాదు. తాజాగా వచ్చీ రాగానే దూకుడు ఆడకుండా పరిస్థితులను బట్టి పరుగులు రాబట్టాల్సిన అవసరం ఉంటుంది. శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు కెప్టెన్ హార్దిక్ పాండ్యకు డిప్యూటీగా సూర్యకుమార్ ఉన్నాడు. ఇలాంటి తరుణంలో మరింత బాధ్యత తీసుకొని ఆడాల్సిన అవసరం ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ సిరీస్లో మిగిలిన రెండు మ్యాచుల్లోనైనా సూర్యకుమార్ రాణించాలని ఆకాంక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు