SKY: వాషింగ్టన్ సుందర్ విషయంలో నాదే తప్పు.. వైరల్గా మారిన సూర్య వ్యాఖ్యలు
న్యూజిలాండ్తో (IND vs NZ) జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ (Team India) గెలవడంలో స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా వాషింగ్టన్ సుందర్కు (Washington Sundar) క్షమాపణలు తెలిపాడు. ఎందుకంటే..?
ఇంటర్నెట్ డెస్క్: ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ విజయం సాధించింది. దీంతో మూడు టీ20ల సిరీస్లో టీమ్ఇండియా 1-1తో సమంగా నిలిచింది. ఈ క్రమంలో జట్టును గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ చేసిన కీలక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఇంతకీ అతడేం చెప్పాడు.. ఎందుకు చెప్పాడో తెలియాలంటే.. దీనిపై ఓ లుక్కేయండి..
పది ఓవర్లు.. స్కోరు బోర్డుపై 49 పరుగులు.. ఓపెనర్లు అప్పటికే ఔట్.. ఇక చివరి 10 ఓవర్లలో భారత్ లక్ష్యం 51.. చేతిలో ఇంకా ఏడు వికెట్లు ఉన్నాయనే ధీమా.. డ్రింక్స్ బ్రేక్ ముగిసిన తర్వాతి ఓవర్లోనే కుదురుగా ఆడుతున్న రాహుల్ త్రిపాఠి పెవిలియన్కు చేరాడు. ఆ ఓవర్లో రెండే పరుగులు వచ్చాయి. దీంతో విజయ సమీకరణం 9 ఓవర్లలో 49 పరుగులకు చేరింది. ఇలాంటి సమయంలో సూర్యకుమార్ (26*)తో కలిసి వాషింగ్టన్ సుందర్ (9 బంతుల్లో 10) ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించాడు. అయితే 36 బంతుల్లో 30 పరుగులుగా భారత విజయ సమీకరణం మారింది. కానీ, గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్లో సూర్యకుమార్ చేసిన తప్పిదంతో వాషింగ్టన్ సుందర్ తన వికెట్ను త్యాగం చేయాల్సి వచ్చింది. 15వ ఓవర్ మూడో బంతిని ఆడిన సూర్యకుమార్.. బాల్ పక్కనే పెట్టుకొని మరీ పరుగు కోసం ముందుకొచ్చేశాడు. అప్పటికీ వాషింగ్టన్ సుందర్ వద్దని చెబుతున్నా సరే ఆగకుంగా నాన్స్ట్రైకింగ్ వైపు దూసుకొచ్చాడు. దీంతో సూర్యకుమార్ వికెట్ విలువను గుర్తెరిగిన సుందర్ అడుగులు ముందుకేసి రనౌట్ రూపంలో తీవ్ర అసంతృప్తితో డగౌట్కు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో చివరి వరకూ క్రీజ్లో ఉండి భారత్ను విజయతీరాలకు చేర్చిన సూర్యకుమార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకొన్నాడు. ఈ సందర్భంగా వాషింగ్టన్ సుందర్ రనౌట్ విషయంలో తనదే తప్పు అని అంగీకరించాడు.
మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ.. ‘‘రనౌట్ విషయంలో పూర్తిగా నాదే తప్పు. బంతి ఎక్కడికి వెళ్లిందనేది నేను గమనించలేదు. అక్కడైతే కచ్చితంగా పరుగు రాదు’’ అని వెల్లడించాడు. కఠినమైన పిచ్ మీద ప్రతి పరుగూ రాబట్టడం కష్టంగా మారింది. అయితే చివరి వరకూ బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. సుందర్ను రనౌట్ చేయడంపై సూర్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. నిజాయతీగా అంగీకరించిన సూర్యను అభిమానులు, నెటిజన్లు ప్రశంసించారు. అలాగే టీమ్ఇండియాను గెలిపించినందుకు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం.
తాజా వార్తలు (Latest News)
-
రూ.లక్షలు పెట్టు.. ఫ్యాన్సీ నంబరు పట్టు!
-
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
-
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే