Suryakumar Yadav: సూర్యా.. ఏది కష్టమో అదే చేసేస్తాడు..!
సూర్యకుమార్ యాదవ్కు పేస్ వికెట్ అంటే ఏమాత్రం భయంలేదు.. పైగా అటువంటి పిచ్లపై అద్భుతంగా ఆడతాడు. టీమ్ ఇండియాలోని మిగిలిన బ్యాటర్లకు ఇది పూర్తిగా భిన్నమైన శైలి.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఫాస్ట్ పిచ్లు అంటే టీమ్ ఇండియాకు భయం.. అందరికీ ఏదైతో భయమో ముందు అదే చేసేయడం నాకు అలవాటు అన్నట్లుంటుంది సూర్యకుమార్ యాదవ్ (స్కై) తీరు. షార్ట్కట్లు అతడికి తెలియవు. పేస్ పిచ్లంటే భారత బ్యాట్స్మన్కు భయం అనే అపవాదు ఎన్నో ఏళ్లుగా ఉంది. కానీ, మనవాడు అటువంటి పిచ్లపై కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. ఇటీవల జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్సులే దీనికి ఉదాహరణ. ప్రపంచకప్ తర్వాత భారత్ బ్యాటింగ్లో సరికొత్త సూపర్ స్టార్గా ఉదయించాడు. నిలకడగా 180కిపై స్ట్రైక్ రేట్తో 59 సగటుతో ఆరు మ్యాచ్ల్లో 239 పరుగులు సాధించాడు. ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన ఏ బ్యాట్స్మన్ స్ట్రైక్ రేట్ అతడి దరిదాపుల్లో కూడా లేదు. నిలకడగా అంత స్ట్రైక్రేట్ సాధించడం సాధారణ విషయం కాదని సాక్షాత్తూ కోచ్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అతడికి ఈ ప్రతిఫలం ఏదో ఒక్క రోజుతో వచ్చింది కాదు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకొంటూ.. బలహీనతలను జయిస్తూ భారత్ క్రికెట్లో వెలిగిపోతున్నాడు స్కై.
బౌలింగ్ పిచ్ చేయించుకొని మరీ సాధన..
సూర్యకుమార్ యాదవ్ సాధన మొత్తం ముంబయిలో పార్సీ జింఖానా మైదానంలోనే జరుగుతుంది. అక్కడి సెక్రటరీ ఖోడాదాద్ను అడిగి మరీ పచ్చికతో కూడిన పేస్ బౌలింగ్ పిచ్ను చేయించుకొన్నాడు. అంతర్జాతీయ, ముంబయి క్రికెట్ జట్టు మ్యాచ్లు లేని సమయంలో కూడా సూర్యా అక్కడకు వచ్చి సాధన చేస్తాడు. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండే కఠినమైన వికెట్లపై ప్రాక్టీస్ సాగుతుంది. దీంతో ఎంతటి కఠినమైన బౌలింగ్నైనా కకావికలం చేసేస్తాడు. పేస్ బౌలర్ల నుంచి 430 బంతులను ఎదుర్కొని 834 పరుగలు చేశాడు. అతడి స్ట్రైక్రేట్ 190..! ఈ గణాంకాలు చూస్తే అతడి సాధన వ్యూహం ఎంతగా ఫలితాలనిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
అన్నిరకాల బౌలర్లూ ఉండాల్సిందే..
కేవలం సీమర్లనే కాదు.. స్పిన్నర్లు.. మీడియం పేసర్లను కూడా ఎదుర్కోవడానికి సూర్యా ఎప్పుడూ సన్నద్ధమవుతాడు. ఏ బౌలర్కు బలహీనంగా కనిపించకూడదనేది అతడి నియమం. సూర్యా సాధన సెషన్ కోసం అతడి బృందం.. అన్ని రకాల బౌలర్లను సిద్ధం చేస్తుంది. వీరిలో లెఫ్టార్మ్, రైటార్మ్ పేసర్లు, లెఫ్టార్మ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ అందుబాటులో ఉండేలా చూసుకొంటారు. వీరితోపాటు సైడ్ ఆర్మ్ త్రో బౌలర్ ఓం కూడా అందుబాటులో ఉంటాడు.
పరిస్థితులను సృష్టించుకొని సూర్యా బ్యాటింగ్ చేస్తాడని అతడి కోచ్, సహచరుడు వినాయక్ మానె వెల్లడించారు. వివిధ రకాల బౌలర్లు అందుబాటులో ఉండటంతో పవర్ ప్లేలో ఎలా ఆడాలి.. స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధన చేస్తాడు. ప్రాక్టీస్ సెషన్ల సమయంలో బౌలర్లతో చర్చిస్తాడు.. మరేవిధంగా ప్రయత్నించవచ్చో తెలుసుకొంటాడు.
మానసిక సంసిద్ధత..
సూర్యా మైదానంలోకి అడుగుపెట్టడానికి ముందే మానసికంగా సిద్ధమైపోతాడు. తాను ఎటువంటి బౌలర్లను ఎదుర్కోబోతున్నాడు అన్నదానిపై ఓ అంచనాకు వచ్చి.. ఆ తర్వాత వారిని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకొంటాడు. బ్యాటింగ్కు వెళ్లే సమయంలో ఎటువంటి గందరగోళం ఉండకూడదని సూర్యా భావిస్తాడు. బౌలర్ బంతిని డెలివరీ చేయకముందే ఫీల్డింగ్ను బట్టి ఎలా ఆడాలో అతడి మనసులో ఓ ప్లాన్ సిద్ధంగా ఉంటుంది. దీనికి తోడు ఫిట్నెస్, డైట్ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడు.
మానసికంగా సూర్యకుమార్ చాలా స్పష్టంగా ఉంటాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసినా టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంతో నిరాశచెందేవాడు. కానీ, మైదానంలో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఆడేవాడు. రెండేళ్ల క్రితం ముంబయి- బెంగళూరు మ్యాచ్లో ఆధునిక క్రికెట్ గాడ్ కోహ్లీ స్లెడ్జింగ్కు యత్నించినా బ్యాట్తో సమాధానం చెప్పాడు. రెండేళ్ల తర్వాత ఆసియాకప్లో సూర్యా సుడిగాలి ఇన్నింగ్స్ చూసి అదే కోహ్లీ ‘టేక్ ఏ బౌ’తో అభినందించాడు.
‘ఖాదూస్’ మారుతోంది..?
సూర్యకుమార్ యాదవ్ ప్రేరణతో ముంబయి క్రికెట్ మారిపోతోందని నిపుణులు అంటున్నారు. దీంతో ఖాదూస్ (ముంబయి శైలి క్రికెట్ నిక్కేమ్- బ్యాట్స్మన్ ఔట్ కాకుండా పాతుకుపోయి ఆడేశైలి) కూడా మారుతోంది. అక్కడ చాలా మంది యువ క్రికెటర్లు స్ట్రోక్ప్లేను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కోచ్ మానె పేర్కొన్నాడు. చాలా మంది యువకులు టీ20 దృష్టిలో పెట్టుకొని ఈ షాట్లు ఆడుతున్నారని వెల్లడించాడు. సూర్యానే ఇందుకు చాలా దోహదపడ్డానని వెల్లడించాడు.
సూర్యా.. బ్రాండ్ విలువ పెరిగింది..
సూర్యకుమార్ బ్రాండ్ విలువ దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రపంచ కప్ సమయంలో అతడి బ్రాండ్ ఎండార్స్మెంట్ ధర రూ. రూ.15-20 లక్షల నుంచి రూ.65 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం సూర్యకుమార్ దాదాపు 10 బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నాడు. డ్రీమ్11, పింటోలా పీనట్ బటర్, బోల్ట్ ఆడియో, ఎస్ఎస్ క్రికెట్ ఎక్విప్మెంట్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. త్వరలో మరిన్ని బ్రాండ్లు ఈ జాబితాలో వచ్చి చేరనున్నాయి. బ్రాండ్ విలువలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ను సూర్య మించిపోయాడు. పానీయాలు, మీడియా, మొబైల్ యాక్సెసరీస్, క్రీడలు, దుస్తులు, విద్యారంగానికి చెందిన బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ వంటి బ్రాండ్ల ప్రమోషన్ ఇతడికి దక్కితే కోహ్లీ, ధోనీ వంటి దిగ్గజాల సరసన చేరతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్