Suryakumar Yadav: సూర్యా.. ఏది కష్టమో అదే చేసేస్తాడు..!
సూర్యకుమార్ యాదవ్కు పేస్ వికెట్ అంటే ఏమాత్రం భయంలేదు.. పైగా అటువంటి పిచ్లపై అద్భుతంగా ఆడతాడు. టీమ్ ఇండియాలోని మిగిలిన బ్యాటర్లకు ఇది పూర్తిగా భిన్నమైన శైలి.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ఫాస్ట్ పిచ్లు అంటే టీమ్ ఇండియాకు భయం.. అందరికీ ఏదైతో భయమో ముందు అదే చేసేయడం నాకు అలవాటు అన్నట్లుంటుంది సూర్యకుమార్ యాదవ్ (స్కై) తీరు. షార్ట్కట్లు అతడికి తెలియవు. పేస్ పిచ్లంటే భారత బ్యాట్స్మన్కు భయం అనే అపవాదు ఎన్నో ఏళ్లుగా ఉంది. కానీ, మనవాడు అటువంటి పిచ్లపై కూడా ఆకాశమే హద్దుగా చెలరేగిపోతాడు. ఇటీవల జింబాబ్వే, దక్షిణాఫ్రికాపై ఇన్నింగ్సులే దీనికి ఉదాహరణ. ప్రపంచకప్ తర్వాత భారత్ బ్యాటింగ్లో సరికొత్త సూపర్ స్టార్గా ఉదయించాడు. నిలకడగా 180కిపై స్ట్రైక్ రేట్తో 59 సగటుతో ఆరు మ్యాచ్ల్లో 239 పరుగులు సాధించాడు. ప్రపంచకప్లో అత్యధిక పరుగులు సాధించిన ఏ బ్యాట్స్మన్ స్ట్రైక్ రేట్ అతడి దరిదాపుల్లో కూడా లేదు. నిలకడగా అంత స్ట్రైక్రేట్ సాధించడం సాధారణ విషయం కాదని సాక్షాత్తూ కోచ్ ద్రవిడ్ కూడా అంగీకరించాడు. అతడికి ఈ ప్రతిఫలం ఏదో ఒక్క రోజుతో వచ్చింది కాదు. నిత్యం కొత్త విషయాలు నేర్చుకొంటూ.. బలహీనతలను జయిస్తూ భారత్ క్రికెట్లో వెలిగిపోతున్నాడు స్కై.
బౌలింగ్ పిచ్ చేయించుకొని మరీ సాధన..
సూర్యకుమార్ యాదవ్ సాధన మొత్తం ముంబయిలో పార్సీ జింఖానా మైదానంలోనే జరుగుతుంది. అక్కడి సెక్రటరీ ఖోడాదాద్ను అడిగి మరీ పచ్చికతో కూడిన పేస్ బౌలింగ్ పిచ్ను చేయించుకొన్నాడు. అంతర్జాతీయ, ముంబయి క్రికెట్ జట్టు మ్యాచ్లు లేని సమయంలో కూడా సూర్యా అక్కడకు వచ్చి సాధన చేస్తాడు. ఈ సమయంలో అంతర్జాతీయ ప్రమాణాలు ఉండే కఠినమైన వికెట్లపై ప్రాక్టీస్ సాగుతుంది. దీంతో ఎంతటి కఠినమైన బౌలింగ్నైనా కకావికలం చేసేస్తాడు. పేస్ బౌలర్ల నుంచి 430 బంతులను ఎదుర్కొని 834 పరుగలు చేశాడు. అతడి స్ట్రైక్రేట్ 190..! ఈ గణాంకాలు చూస్తే అతడి సాధన వ్యూహం ఎంతగా ఫలితాలనిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
అన్నిరకాల బౌలర్లూ ఉండాల్సిందే..
కేవలం సీమర్లనే కాదు.. స్పిన్నర్లు.. మీడియం పేసర్లను కూడా ఎదుర్కోవడానికి సూర్యా ఎప్పుడూ సన్నద్ధమవుతాడు. ఏ బౌలర్కు బలహీనంగా కనిపించకూడదనేది అతడి నియమం. సూర్యా సాధన సెషన్ కోసం అతడి బృందం.. అన్ని రకాల బౌలర్లను సిద్ధం చేస్తుంది. వీరిలో లెఫ్టార్మ్, రైటార్మ్ పేసర్లు, లెఫ్టార్మ్ స్పిన్నర్, లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్, లెగ్ స్పిన్నర్ అందుబాటులో ఉండేలా చూసుకొంటారు. వీరితోపాటు సైడ్ ఆర్మ్ త్రో బౌలర్ ఓం కూడా అందుబాటులో ఉంటాడు.
పరిస్థితులను సృష్టించుకొని సూర్యా బ్యాటింగ్ చేస్తాడని అతడి కోచ్, సహచరుడు వినాయక్ మానె వెల్లడించారు. వివిధ రకాల బౌలర్లు అందుబాటులో ఉండటంతో పవర్ ప్లేలో ఎలా ఆడాలి.. స్పిన్నర్లను ఎలా ఎదుర్కోవాలి వంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సాధన చేస్తాడు. ప్రాక్టీస్ సెషన్ల సమయంలో బౌలర్లతో చర్చిస్తాడు.. మరేవిధంగా ప్రయత్నించవచ్చో తెలుసుకొంటాడు.
మానసిక సంసిద్ధత..
సూర్యా మైదానంలోకి అడుగుపెట్టడానికి ముందే మానసికంగా సిద్ధమైపోతాడు. తాను ఎటువంటి బౌలర్లను ఎదుర్కోబోతున్నాడు అన్నదానిపై ఓ అంచనాకు వచ్చి.. ఆ తర్వాత వారిని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకొంటాడు. బ్యాటింగ్కు వెళ్లే సమయంలో ఎటువంటి గందరగోళం ఉండకూడదని సూర్యా భావిస్తాడు. బౌలర్ బంతిని డెలివరీ చేయకముందే ఫీల్డింగ్ను బట్టి ఎలా ఆడాలో అతడి మనసులో ఓ ప్లాన్ సిద్ధంగా ఉంటుంది. దీనికి తోడు ఫిట్నెస్, డైట్ విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడు.
మానసికంగా సూర్యకుమార్ చాలా స్పష్టంగా ఉంటాడు. అద్భుతమైన బ్యాటింగ్ చేసినా టీమ్ ఇండియాలో చోటు దక్కకపోవడంతో నిరాశచెందేవాడు. కానీ, మైదానంలో మాత్రం రెట్టించిన ఉత్సాహంతో ఆడేవాడు. రెండేళ్ల క్రితం ముంబయి- బెంగళూరు మ్యాచ్లో ఆధునిక క్రికెట్ గాడ్ కోహ్లీ స్లెడ్జింగ్కు యత్నించినా బ్యాట్తో సమాధానం చెప్పాడు. రెండేళ్ల తర్వాత ఆసియాకప్లో సూర్యా సుడిగాలి ఇన్నింగ్స్ చూసి అదే కోహ్లీ ‘టేక్ ఏ బౌ’తో అభినందించాడు.
‘ఖాదూస్’ మారుతోంది..?
సూర్యకుమార్ యాదవ్ ప్రేరణతో ముంబయి క్రికెట్ మారిపోతోందని నిపుణులు అంటున్నారు. దీంతో ఖాదూస్ (ముంబయి శైలి క్రికెట్ నిక్కేమ్- బ్యాట్స్మన్ ఔట్ కాకుండా పాతుకుపోయి ఆడేశైలి) కూడా మారుతోంది. అక్కడ చాలా మంది యువ క్రికెటర్లు స్ట్రోక్ప్లేను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు కోచ్ మానె పేర్కొన్నాడు. చాలా మంది యువకులు టీ20 దృష్టిలో పెట్టుకొని ఈ షాట్లు ఆడుతున్నారని వెల్లడించాడు. సూర్యానే ఇందుకు చాలా దోహదపడ్డానని వెల్లడించాడు.
సూర్యా.. బ్రాండ్ విలువ పెరిగింది..
సూర్యకుమార్ బ్రాండ్ విలువ దాదాపు మూడు రెట్లు పెరిగినట్లు మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు. ప్రపంచ కప్ సమయంలో అతడి బ్రాండ్ ఎండార్స్మెంట్ ధర రూ. రూ.15-20 లక్షల నుంచి రూ.65 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం సూర్యకుమార్ దాదాపు 10 బ్రాండ్లను ఎండార్స్ చేస్తున్నాడు. డ్రీమ్11, పింటోలా పీనట్ బటర్, బోల్ట్ ఆడియో, ఎస్ఎస్ క్రికెట్ ఎక్విప్మెంట్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. త్వరలో మరిన్ని బ్రాండ్లు ఈ జాబితాలో వచ్చి చేరనున్నాయి. బ్రాండ్ విలువలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్ను సూర్య మించిపోయాడు. పానీయాలు, మీడియా, మొబైల్ యాక్సెసరీస్, క్రీడలు, దుస్తులు, విద్యారంగానికి చెందిన బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఎఫ్ఎంసీజీ, ఆటోమొబైల్ వంటి బ్రాండ్ల ప్రమోషన్ ఇతడికి దక్కితే కోహ్లీ, ధోనీ వంటి దిగ్గజాల సరసన చేరతాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?