Surya Kumar Yadav: సూర్య కుమార్ లవ్ స్టోరీ.. సేమ్ టు సేమ్ సినిమాలాగే ఉంటుంది తెలుసా?
Surya Kumar Yadav - Devisha Shetty: బౌలర్లకు పీడకలగా మారిన సూర్య.. ఓ అమ్మాయికి కలల రాకుమారుడిగా ఎలా మారాడు..? సినిమాను తలపించే సూర్యకుమార్ ప్రేమ కథ మీ కోసం..
సూర్య క్రీజులో ఉంటే.. గ్రౌండ్లో ఫీల్డర్లు గాల్లోకి చూడాల్సిందే అంటారు.
ఎటువైపు బంతి వేసినా ఆయన బ్యాటు కత్తిలా తిరుగుతుంది.. బంతి బౌండరీ దాటుతుంది.
ఇలాంటి సూర్య ఓ అమ్మాయి చేతిలో బౌల్డ్ అయిపోయాడు.
అయితే ఇది ఇప్పుడు కాదు.. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే.
శుక్రవారం సూర్య స్పెషల్ సెంచరీ చూశారుగా.. ఇప్పుడు ఆయన స్పెషల్ లవ్స్టోరీ చదివేయండి!
అది 2012.. 22 ఏళ్ల సూర్య కాలేజీలో తక్కువ, గ్రౌండ్లో ఎక్కువ ఉండేవాడు. పెన్ను, పుస్తకం కన్నా బ్యాటు, బంతితోనే ఎక్కువగా గడిపేవాడు. ‘సూర్య -దేవీషా’ ప్రేమ కథలో హీరో ఎంట్రీ ఇది. ఏంటీ సినిమా కథలా చెబుతున్నారు అనుకుంటున్నారా? సూర్య జీవితంలో జరిగింది అలాంటిదే. నెక్స్ట్ మీరు ఊహించినట్లే హీరోయిన్ దేవీషా ఎంట్రీ కాలేజీ ఫ్రెషర్స్ డే నాడే. దీనికి వేదిక ముంబైలోని ఆర్.ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ కళాశాల ఆడిటోరియం. దేవీషా డ్యాన్స్ను చూసిన సూర్య... అక్కడికక్కడే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత గ్రౌండ్లో సూర్య ప్రతాపం చూసి దేవీషా ఫిదా అయ్యింది. ఇంకేముంది ప్రేమ, పెళ్లి... అనేసుకుంటారామో! చెప్పాంగా ఇద్దరి ప్రేమ సినిమా స్టైల్ అని. చాలానే ట్విస్టులున్నాయి. అవి సినిమాలను మించే ఉన్నాయి.
ముంబయిలోని ఆర్.ఏ పోదర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ & ఎకనామిక్స్ కళాశాలలో సూర్య బీకామ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. 19 ఏళ్ల దేవీషా అప్పుడే ఇంటర్ పూర్తి చేసి ఆ కాలేజీలోనే చేరింది. అప్పటికే దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్నాడు సూర్య. ఫ్రెషర్స్ పార్టీలో దేవీషాను చూడటం.. ఆ తర్వాత ఆమెను గ్రౌండ్లో సూర్యను చూడటం సినిమాటిక్గా సాగిపోయాయి. అక్కడికి కొద్ది రోజులకు సూర్య ఒక మిత్రుడి ద్వారా ఆమెకు పరిచయమయ్యాడు. సగటు యూత్లాగే ఇద్దరూ కాలేజీ బయట కలుసుకోవడం, మాట్లాడుకోవడం షురూ అయ్యాయి. ఈ క్రమంలో ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఫేస్బుక్, బీబీయమ్ (మెసెంజర్) ద్వారా మరింత దగ్గరయ్యారు. ఇక సరదాగా గొడవలు ఎలానూ ఉంటాయి. అలా నాలుగేళ్లపాటు వీరి ప్రేమాయణం సాగింది.
లీగ్లోకి అలా వచ్చి...
దేవీషా మంచి డ్యాన్స్ కోచ్గా పేరు సంపాదించుకుంది. మరోవైపు సూర్య జాతీయ జట్టులో స్థానం కోసం పోరాడుతూనే ఉన్నాడు. 2012లో భారత టీ20 లీగ్లోకి ప్రవేశించినా 2015లో గానీ సరైన గుర్తింపు రాలేదు. ఆ ఏడాది ముంబయితో జరిగిన మ్యాచ్లో కోల్కతా తరఫున ఆడి 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. దీంతో అప్పటి వరకు దేశవాళీ క్రికెట్లోనే ఎంత రాణించినా రాని పేరు ఒక్కసారిగా ఈ ఇన్నింగ్స్తో వచ్చింది. ఆ ఇన్నింగ్స్ ఆనందాన్ని సూర్య బాగా ఎంజాయ్ చేశాడు.
ఆ తర్వాత ఏడాదే.. సూర్య, దేవీషా వివాహ బంధంలో మొదటి అడుగుపడింది. మే 29, 2016న ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది దేవీషా. వారి కుటుంబం దక్షిణ భారతదేశం నుంచి వచ్చి ముంబయిలో స్థిరపడింది. దీంతో 2016 జులై 7న దక్షిణ భారత సంప్రదాయం ప్రకారమే సూర్య - దేవీషా వివాహం జరిగింది. దేవీషాకు పెంపుడు కుక్కలు అంటే ఇష్టం. దీంతో పెళ్లయిన తరువాత వాటితో దిగిన ఫొటోలను, సూర్యతో గడిపిన మధురానుభూతులను ఎప్పటికప్పుడు దేవీషా సోషల్మీడియా వేదికగా పంచుకుంటోంది.
క్రికెట్పై దృష్టిపెట్టు..
తన లైఫ్లో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు దేవీషా అండగా ఉందని ‘బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్’ అనే ఎపిసోడ్లో సూర్య చెప్పాడు. ‘‘మా వివాహం తరవాత.. నేను ఒక రోజు దేవీషాతో నాకు క్రికెట్లో ఎదురైన కష్టాలు గురించి మాట్లాడాను. నేను కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, బుమ్రాతో కలిసి ఆడాం. వీళ్లంతా టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు... ’’ అంటూ దేవీషాకు సూర్య చెప్పబోయాడు. అయితే దేవీషా అక్కడితో సూర్య మాటలకు అడ్డుపడి... ‘సూర్యా.. నువ్వు అన్ని ఆటంకాల గురించి మర్చిపోయి ముందు క్రికెట్ పై దృష్టిపెట్టు’’ అని అందట. ఆ మాటలు తనలో బాగా నాటుకుపోయాయని, అప్పుడే ప్రేమ అంటే ఏంటో తన వల్లే తెలిసిందని సూర్య చెబుతుంటాడు.
సూర్య 2.0... అంతకుమించి
దేవీషా మాటలు సూర్యను ఎంతగా మార్చాయో తెలియాలంటే సూర్య 2.0 గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. 2016 నవంబర్లో ఉత్తర్ప్రదేశ్తో ముంబై రంజీ మ్యాచ్ అది. ముంబయి బ్యాటర్లు వరుసగా పెవిలియన్ చేరుతుంటే.. సూర్య పోరాటం మాత్రం ఆగలేదు. సెంచరీ ఒక్క పరుగు దూరంలో ఔటైనా... జట్టు తొలి ఇన్నింగ్స్లో 233 పరుగులు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లోనూ సూర్య మళ్లీ రాణించి 91 పరుగులు చేశాడు. దీంతో ముంబయి ఈ మ్యాచ్లో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సూర్య ఎంపికయ్యాడు.
అదే సమయంలో భారత టీ20 లీగ్లో కోల్కతా తరఫున సత్తాచాటి ఆ జట్టుకు వైస్ కెప్టెన్ కూడా అయ్యాడు. గౌతమ్ గంభీర్ అప్పటి నుంచే ‘SKY’ అనే పేరుతో సూర్యని పిలవడం మొదలుపెట్టాడు. ఆ తరవాత 2018 మెగా వేలంలో రూ.3.2 కోట్లకు ముంబయి కొనుగోలు చేసింది. అప్పటినుంచి ముంబై జట్టు టాప్ ఆర్డర్లో ఆడుతూ రెచ్చిపోయాడు. ఏటా నిలకడగా 400 పరుగులకుపైగా చేస్తూ వస్తున్నాడు. అయితే ఇది సూర్య - దేవీషా లక్ష్యంలో కొంత భాగం మాత్రమే.
ఇది ఆరంభం మాత్రమే...
సూర్యకు సుదీర్ఘ పోరాటం తరవాత ఎట్టకేలకు 2021లో ఇంగ్లాండ్పై టీ20ల్లో భారత జాతీయ జట్టుకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. టీమ్ఇండియాకు సూర్య ఎంపికైనా తరవాత దేవీషా తనతో ఏం మాట్లాడిందో ‘ బ్రేక్ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ ’అనే ఎపిసోడ్లోనే వివరించాడు. ‘‘మ్యాచ్ రోజు ఉదయం 4 గంటలకు.. దేవీషా నాకు ఒక సలహా ఇచ్చింది. నీ 10 సంవత్సరాల నిజమైన క్రికెట్ ప్రయాణం... ఇప్పుడే ప్రారంభమవుతోంది. ఇది ముగింపు పాయింట్ కాకూడదు’ అని దేవీషా చెప్పిందని సూర్య భావోద్వేగంగా తెలిపాడు. ఆ సమయంలో సూర్య కళ్లలో టీమ్ ఇండియా చరిత్రలో తన పేరున ఓ పేజీ రాసుకోవాలనే కసి కనిపించింది. ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించిందనే సంతృప్తి కూడా కనిపించింది.
ఆర్చర్ బంతిని సిక్స్కి పంపి...
ఇంగ్లాండ్తోనే అదే ఏడాది మార్చి14న నాలుగో టీ20లో సూర్య అరంగేట్రం చేశాడు. అది ‘అరంగేట్రం అనడం కంటే ఊచకోత అనడం బెటరేమో’ అని తొలి బంతిని అతను ఎదుర్కొన్న విధానం చూసి క్రీడా పండితులు అన్నారంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే మెరుపు వేగంతో బౌలింగ్ చేసే జోఫ్రా ఆర్చర్ బంతిని... అంతే వేగంతో ఫైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాడు. ఆ మ్యాచ్ కామెంటరీ చెబుతున్న వాళ్లకు ఆ షాట్ను వర్ణించడానికి మాటలు కూడా రాలేదు. ఎందుకంటే ఆర్చర్ను తొలి బంతికే అలా ఎదుర్కోవడం సాధారణ ఆటగాళ్లకు సాధ్యం కాదు అనేది వారి విశ్లేషణ. ఆర్చర్ ఒక్కడే కాదు.. అలాంటి షాట్లతో సూర్య ప్రతి బౌలర్కు స్వాగతం పలుకుతుంటాడు.
సూర్య ఎంత కసితో, ఆత్మవిశ్వాసంతో ఉన్నాడో.. అరంగేట్ర మ్యాచ్లోనే చూపించాడు. అక్కడ నుంచి మళ్లీ వెనక్కి తిరిగిచూడలేదు. తనదైన రోజున బౌలర్లకు నిద్రలేని రాత్రులు మిగిల్చే షాట్లు ఆడుతున్నాడు. అది ఐపీఎల్లో జట్టు అయినా, టీమ్ ఇండియా అయినా తన ఆట, తన షాట్లు మారవు. సూర్య ఇప్పుడు ఇలా ఆడుతున్నాడు అంటే.. దేవీషా మాటలు ఎంతలా అతని మీద ప్రభావం చూపించాయో మనకు అర్థమవుతుంది. ఈ ఏడాది ఇప్పటివరకు సూర్య 470కి పైగా పరుగులు చేశాడు. ఇంకొన్ని మ్యాచ్లున్నాయి కాబట్టి ఈ కౌంట్ ఇంకా పెరుగుతుంది. ఇక ప్రపంచక్రికెట్లో సూర్య ఘన చెప్పాలంటే టీ20 బ్యాటర్లలో టాప్ 1లో ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి ఓ బ్యాటర్కి.
మీరు ఇప్పటివరకు చాలా ప్రేమకథలు చూసుంటారు.. సూర్య కథ కూడా అలాంటిదే. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంది. సూర్య బ్యాటింగ్ లాగే అతని ప్రేమకథ కూడా ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. మనసైనవాడికి స్ఫూర్తినిస్తే ఎన్ని విజయాలు సాధించాడో సూర్య చూపిస్తే.. ఇష్టసఖి కోసం దేశంలోనే నెంబర్ వన్ ఎలా అవ్వడమో సూర్య చూపించాడు. ఇంతకంటే అదిరిపోయే లవ్ స్టోరీ ఇంకేముంటుంది చెప్పండి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..