T20 League: కుర్రాళ్లే.. కానీ కుమ్మేశారు.. టీమ్ఇండియా భవిష్యత్ స్టార్ క్రికెటర్లు వీరే!
ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది భారత టీ20 లీగ్. ప్రస్తుతం టీమ్ఇండియాలో కీలకంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ వేదిక ద్వారానే తమ సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది భారత టీ20 లీగ్. ప్రస్తుతం టీమ్ఇండియాలో కీలకంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ వేదిక ద్వారానే తమ సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సీజన్లో కూడా కొంతమంది యువ క్రికెటర్లు అంచనాలకుమించి రాణించారు. ఈ ఆటగాళ్లు ఇదే ఊపుని కొనసాగిస్తే భవిష్యత్లో టీమ్ఇండియాకు కీలకంగా మారే అవకాశం ఉంది. మరి ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
ఉమ్రాన్ మాలిక్
జమ్ముకశ్మీర్ యువ పేస్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ టీ20 లీగ్లో అదరగొట్టాడు. హైదరాబాద్ తరఫున ఆడిన ఉమ్రాన్.. 14 మ్యాచ్ల్లో 9.03 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో అతడు ఓ మ్యాచ్లో 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. జూన్9 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికయ్యాడు.
తిలక్ వర్మ
ఈ సీజన్లో మనకు దొరికిన మరో ఆణిముత్యం తిలక్ వర్మ. తెలంగాణకు చెందిన ఈ 19 ఏళ్ల కుర్రాడు ముంబయి జట్టులో నిలకడగా రాణించాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో 36.09 సగటుతో 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలున్నాయి. తిలక్ వర్మ ఇలానే ఆడితే మరికొన్ని నెలల్లో టీమ్ఇండియాకు ఎంపికై కీలక ఆటగాడిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అర్ష్దీప్ సింగ్
ఎక్కువ వికెట్లు పడగొట్టకున్నా మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు అర్ష్దీప్ సింగ్. గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ జట్టుకు ఆడుతున్న ఈ 23 ఏళ్ల ఫాస్ట్బౌలర్ డెత్ ఓవర్లలో ఒత్తిడికి గురికాకుండా పొదుపుగా బౌలింగ్ చేసి మాజీ ఆటగాళ్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 7.70 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. జూన్లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు అర్ష్దీప్ సింగ్ ఎంపికయ్యాడు.
అభిషేక్ శర్మ
పంజాబ్కు చెందిన 21 ఏళ్ల అభిషేక్ శర్మ గత కొన్ని సీజన్ల నుంచి హైదరాబాద్కు ఆడుతున్నాడు. ఈ సీజన్లో అతడు 14 మ్యాచ్ల్లో 30.43 సగటుతో 426 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అభిషేక్ ఇదే ప్రదర్శనను భవిష్యత్లోనూ కొనసాగిస్తే భారత జట్టు స్టార్ ప్లేయర్గా మారే అవకాశం ఉంది.
మోసిన్ఖాన్
ఈ సీజన్లో వెలుగులోకి వచ్చిన మరో యువ క్రికెటర్ మోసిన్ఖాన్. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ 23 ఏళ్ల కుర్రాడు టీ20 లీగ్లో లఖ్నవూ జట్టుకు ఆడాడు. 9 మ్యాచ్ల్లో కేవలం 5.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. దిల్లీతో జరిగిన ఓ మ్యాచ్లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రానున్న రోజుల్లో దేశవాళీ టోర్నీల్లో కూడా మోసిన్ఖాన్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం.
రాహుల్ త్రిపాఠి
ఝార్ఖండ్కు చెందిన రాహుల్ త్రిపాఠి 2017 నుంచి టీ20 లీగ్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 76 మ్యాచ్లు ఆడిన త్రిపాఠి 1798 పరుగులు చేశాడు. ఈ సీజన్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన ఇతడు 14 మ్యాచ్ల్లో 37.55 సగటుతో 413 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి. త్రిపాఠి ఇలానే నిలకడగా రాణిస్తే త్వరలో టీమ్ఇండియాకు ఎంపిక కావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం