T20 League: కుర్రాళ్లే.. కానీ కుమ్మేశారు.. టీమ్ఇండియా భవిష్యత్ స్టార్ క్రికెటర్లు వీరే!
ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది భారత టీ20 లీగ్. ప్రస్తుతం టీమ్ఇండియాలో కీలకంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ వేదిక ద్వారానే తమ సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకొచ్చింది భారత టీ20 లీగ్. ప్రస్తుతం టీమ్ఇండియాలో కీలకంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఈ వేదిక ద్వారానే తమ సత్తా చాటి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సీజన్లో కూడా కొంతమంది యువ క్రికెటర్లు అంచనాలకుమించి రాణించారు. ఈ ఆటగాళ్లు ఇదే ఊపుని కొనసాగిస్తే భవిష్యత్లో టీమ్ఇండియాకు కీలకంగా మారే అవకాశం ఉంది. మరి ఆటగాళ్లు ఎవరో ఓ లుక్కేద్దాం.
ఉమ్రాన్ మాలిక్
జమ్ముకశ్మీర్ యువ పేస్ బౌలింగ్ సంచలనం ఉమ్రాన్ మాలిక్ టీ20 లీగ్లో అదరగొట్టాడు. హైదరాబాద్ తరఫున ఆడిన ఉమ్రాన్.. 14 మ్యాచ్ల్లో 9.03 ఎకానమీతో 22 వికెట్లు పడగొట్టాడు. ఈ సీజన్లో అతడు ఓ మ్యాచ్లో 157 కి.మీ. వేగంతో బౌలింగ్ చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. జూన్9 నుంచి దక్షిణాఫ్రికా, భారత్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్కు ఉమ్రాన్ మాలిక్ ఎంపికయ్యాడు.
తిలక్ వర్మ
ఈ సీజన్లో మనకు దొరికిన మరో ఆణిముత్యం తిలక్ వర్మ. తెలంగాణకు చెందిన ఈ 19 ఏళ్ల కుర్రాడు ముంబయి జట్టులో నిలకడగా రాణించాడు. ఆడిన 14 మ్యాచ్ల్లో 36.09 సగటుతో 397 పరుగులు సాధించాడు. ఇందులో రెండు అర్ధ శతకాలున్నాయి. తిలక్ వర్మ ఇలానే ఆడితే మరికొన్ని నెలల్లో టీమ్ఇండియాకు ఎంపికై కీలక ఆటగాడిగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అర్ష్దీప్ సింగ్
ఎక్కువ వికెట్లు పడగొట్టకున్నా మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు అర్ష్దీప్ సింగ్. గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ జట్టుకు ఆడుతున్న ఈ 23 ఏళ్ల ఫాస్ట్బౌలర్ డెత్ ఓవర్లలో ఒత్తిడికి గురికాకుండా పొదుపుగా బౌలింగ్ చేసి మాజీ ఆటగాళ్ల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. ఈ సీజన్లో 14 మ్యాచ్ల్లో 7.70 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. జూన్లో భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగే ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు అర్ష్దీప్ సింగ్ ఎంపికయ్యాడు.
అభిషేక్ శర్మ
పంజాబ్కు చెందిన 21 ఏళ్ల అభిషేక్ శర్మ గత కొన్ని సీజన్ల నుంచి హైదరాబాద్కు ఆడుతున్నాడు. ఈ సీజన్లో అతడు 14 మ్యాచ్ల్లో 30.43 సగటుతో 426 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలున్నాయి. చెన్నైతో జరిగిన మ్యాచ్లో 50 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 75 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అభిషేక్ ఇదే ప్రదర్శనను భవిష్యత్లోనూ కొనసాగిస్తే భారత జట్టు స్టార్ ప్లేయర్గా మారే అవకాశం ఉంది.
మోసిన్ఖాన్
ఈ సీజన్లో వెలుగులోకి వచ్చిన మరో యువ క్రికెటర్ మోసిన్ఖాన్. ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ 23 ఏళ్ల కుర్రాడు టీ20 లీగ్లో లఖ్నవూ జట్టుకు ఆడాడు. 9 మ్యాచ్ల్లో కేవలం 5.96 ఎకానమీతో 14 వికెట్లు పడగొట్టాడు. దిల్లీతో జరిగిన ఓ మ్యాచ్లో 4 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో అతడు మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రానున్న రోజుల్లో దేశవాళీ టోర్నీల్లో కూడా మోసిన్ఖాన్ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడం ఖాయం.
రాహుల్ త్రిపాఠి
ఝార్ఖండ్కు చెందిన రాహుల్ త్రిపాఠి 2017 నుంచి టీ20 లీగ్లో ఆడుతున్నాడు. ఇప్పటివరకు 76 మ్యాచ్లు ఆడిన త్రిపాఠి 1798 పరుగులు చేశాడు. ఈ సీజన్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించిన ఇతడు 14 మ్యాచ్ల్లో 37.55 సగటుతో 413 పరుగులు సాధించాడు. ఇందులో మూడు అర్ధ సెంచరీలున్నాయి. త్రిపాఠి ఇలానే నిలకడగా రాణిస్తే త్వరలో టీమ్ఇండియాకు ఎంపిక కావొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి
-
వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు
-
‘చొరబాటుదారు’ వ్యాఖ్యలు.. మోదీపై ఫిర్యాదును పరిశీలిస్తున్నామన్న ఈసీ..!