Rajasthan vs Bangalore: 27న క్వాలిఫయర్ 2.. రెండు జట్ల పరిస్థితి 10 పాయింట్లలో!
భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. ప్లే ఆఫ్స్లో భాగంగా శుక్రవారం రాజస్థాన్, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్స్లో గుజరాత్తో తలపడతుంది.
ఇంటర్నెట్ డెస్క్: భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. ప్లే ఆఫ్స్లో భాగంగా శుక్రవారం రాజస్థాన్, బెంగళూరు మధ్య క్వాలిఫయర్-2 జరగనుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్స్లో గుజరాత్తో తలపడతుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్, బెంగళూరు జట్ల పరిస్థితి ఎలా ఉంది? ఇంతకుముందు ఈ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో అధిపత్యం ఎవరిది? అనే విషయాలకు సంబంధించిన 10 పాయింట్లు ఇవే..
- టీ20 లీగ్లో రాజస్థాన్, బెంగళూరు జట్ల మధ్య ఇప్పటివరకు 26 మ్యాచ్లు జరిగాయి. 13 మ్యాచ్ల్లో బెంగళూరు విజయం సాధించగా.. రాజస్థాన్ 11 మ్యాచ్ల్లో నెగ్గింది. మరో రెండింటిలో ఫలితం తేలలేదు. ఈ సీజన్లో రాజస్థాన్, బెంగళూరు రెండు సార్లు తలపడగా.. చెరో మ్యాచ్ గెలిచాయి.
- రాజస్థాన్ ప్రధాన బలం జోస్ బట్లర్. ఈ సీజన్లో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ చేరడంలో అతడు కీలకపాత్ర పోషించాడు. బట్లర్ 15 మ్యాచ్ల్లో 718 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఇందులో 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు ఉన్నాయి.
- రాజస్థాన్ బౌలింగ్ దళంలో యుజువేంద్ర చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ కీలకం. ఈ సీజన్లో ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడిన చాహల్ (26) వికెట్లతో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కొనసాగుతున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 15 మ్యాచ్ల్లో 15 వికెట్లు పడగొట్టాడు.
- ఈ సీజన్లో లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 9 మ్యాచ్ల్లో నెగ్గి ఐదింటిలో ఓడింది. క్వాలిఫయర్-1లో గుజరాత్ చేతిలో పరాజయం పాలైంది.
- ఈ సారి బెంగళూరుకు కాస్త అదృష్టం కలిసొచ్చింది. దిల్లీపై ముంబయి విజయం సాధించడంతో ఆ జట్టు ప్లే ఆఫ్స్కు చేరింది.
- లీగ్ దశలో 14 మ్యాచ్లు ఆడిన బెంగళూరు ఎనిమిది మ్యాచ్ల్లో గెలుపొందగా.. 6 మ్యాచ్ల్లో ఓటమిపాలైంది. ఎలిమినేటర్ మ్యాచ్లో లఖ్నవూపై విజయం సాధించి క్వాలిఫయర్-2కి అర్హత సాధించింది.
- బెంగళూరు బ్యాటింగ్లో కెప్టెన్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, దినేశ్ కార్తీక్తోపాటు ఎలిమినేటర్ మ్యాచ్లో శతకం బాదిన రజత్ పాటిదార్ కీలకం కానున్నారు.
- బెంగళూరు బౌలింగ్లో వానిందు హసరంగ, హర్షల్ పటేల్ కీలకం. ఈ సీజన్లో ఇప్పటివరకు 15 మ్యాచ్లు ఆడిన హసరంగ 7.62 ఎకానమీతో 25 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా కొనసాగుతున్నాడు. హర్షల్ పటేల్ 14 మ్యాచ్ల్లో 7.56 ఎకానమీతో 19 వికెట్లు తీశాడు.
- రాజస్థాన్ ఆటగాడు జోస్ బట్లర్ని వీలైనంత తొందరగా పెవిలియన్ చేర్చితే బెంగళూరుకు విజయావకాశాలు మెరుగవుతాయి.
- మొత్తం మీద టైటిల్ పోరుకు అర్హత సాధించేందుకు జరిగే క్వాలిఫయర్-2 రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బలాబలాల పరంగా చూస్తే రాజస్థాన్కే కాస్త విజయావకాశాలు మెరుగ్గా కనబడుతున్నాయి. అయితే, ఎలిమినేటర్ మ్యాచ్లోలాగా బెంగళూరు సమష్టిగా రాణిస్తే రాజస్థాన్ ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మా చిత్రాన్ని మరో ‘అన్బే శివం’ చేయొద్దు’: విజయ్ ఆంటోనీ వైరల్ పోస్ట్
-
నా భార్య ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలుపుతున్నారు: ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలు
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా